Arun Kumar Sinha: SPG చీఫ్, పీఎం సెక్యూరిటీ గ్రూప్ అధికారి అరుణ్ కుమార్ సిన్హా మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arun Kumar Sinha: స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(SPG) డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హా మరణించారు. హర్యానాలోని గురుగ్రామ్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాసవిడిచారు. 2016 నుంచి ఆయన ఎస్పీజీ గ్రూప్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, మాజీ ప్రధానుల భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
Read Also: Bharat: తాజాగా “ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్”.. మరోసారి పేరు మార్పు..
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
61 ఏళ్ల అరుణ్ కుమార్ సిన్హా గత కొన్ని నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. దీనికి సంబంధించి చికిత్స తీసుకుంటున్నారు. 1987 బ్యాచ్ కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన సిన్హా ఎస్పీజీ చీఫ్ గా ఉన్నారు. తాజాగా ఆయన సర్వీసును పొడగించారు. ఇంతలోనే ఆయన మరణించారు.
జార్ఖండ్ లో సిన్హా తన విద్యను పూర్తి చేశారు. కేరళ పోలీస్ డిపార్ట్మెంట్ లో పలు ఉన్నత స్థాయిల్లో పనిచేశారు. డీసీపీ కమిషనర్, ఐజీ, ఇంటలిజెన్స్ ఐజీ, తిరువనంతపురంలో అడ్మినిస్టేషన్ ఐజీగా బాధ్యతలు నిర్వహించారు. అరుణ్ కుమార్ సిన్హా లా అండ్ ఆర్డర్ ఇంఛార్జ్ గా ఉన్న సమయంలో మాల్డీవుల ప్రెసిడెంట్ అబ్దుల్ గయూమ్ ని హతమర్చేందుకు ప్రయత్నిస్తున్న మాస్టర్ మైండ్ ని తిరువనంతపురంలో పట్టుకున్నారు. ప్రధానికి, ప్రెసిడెంట్ కి ఈమెయిళ్ల ద్వారా వచ్చిన బెదిరింపుల కేసుల్లో ఈయన కీలక పాత్ర పోషించారు.
ఎస్పీజీ చాల ముఖ్యమైన భద్రతా దళం. ఇది ప్రధాని, మాజీ ప్రధానుల భద్రను చూస్తుంది. 1984లో ఇందిరా గాంధీ హత్య తర్వాత ఈ గ్రూప్ ఏర్పడింది. 1985లో ఎస్పీజీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎస్పీజీలో 3000 మంది ఉన్నారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!