Manipur Violence: ఎడిటర్స్ గిల్డ్ సభ్యులపై ఎఫ్ఐఆర్.. అల్లర్లను పెంచేందుకు యత్నించారని ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Violence: కొన్ని నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణ జరగుతోంది. అయితే అక్కడి ఇప్పుడిప్పుడే శాంతియుత వాతావరణం ఏర్పడింది. ఇదిలా ఉంటే ఇటీవల కొన్ని రోజుల నుంచి కొన్ని ప్రాంతాల్లో మళ్లీ హింస చెలరేగింది. ఇదిలా ఉంటే ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సభ్యులపై మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చైర్మన్, దాని ముగ్గురు సభ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ వెల్లడించారు. మణిపూర్ లో మరిన్ని ఘర్షణలను సృష్టించడానికి ప్రయత్నించారని సీఎం ఆరోపించారు.
Read Also: Roshini App: “కంటిశుక్లాల”ను గుర్తించే యాప్.. డెవలప్ చేసిన టీనేజర్..
Also Read
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
- New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
జాతి హింసై మీడియా నివేదికలు ఏకపక్షంగా ఉన్నాయని ఇటీవల ఎడిటర్స్ గిల్డ్ ఆరోపించింది. రాష్ట్ర నాయకత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. ఈ ఆరోపణలపై రాష్ట్రప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్రంలో మరింత హింసను ప్రేరేపించేలా ప్రయత్నిస్తున్నారంటూ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీఎం తెలిపారు. కేసు బుక్ అయిన వారిలో ఎడిటర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ సీమా ముస్తాఫా, సీమా గుహ, భరత్ భూషణ్, సంజయ్ కపూర్ ఉన్నారు. మణిపూర్ రాష్ట్రంలో హింసకు సంబంధించి మీడియా నివేదికను అధ్యయనం చేసేందుకు సీమా గుహ, భరత్ భూషణ్, సంజయ్ కపూర్ గత నెలలో రాష్ట్రాన్ని సందర్శించారు. ఈ విషయంపై నిర్థారణకు వచ్చే ముందు అన్ని వర్గాల ప్రజలను కలుసుకుని ఉండాల్సిందని.. కొన్ని విభాగాలను కాదని ముఖ్యమంత్రి అన్నారు.
గత నాలుగు నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. మైయిటీ, కుకీ తెగల మధ్య రక్తపాతం జరిగింది. ఇరు వర్గాలు గ్రామాలను కాల్చివేసుకున్నాయి, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణల్లో వందల్లో ప్రాణాలు కోల్పోయారు. మైయిటీ వర్గం తమకు కూడా ఎస్టీ హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం, దీన్ని కుకీలు వ్యతిరేకించడంతో ఘర్షణలు మొదలయ్యాయి. చూర్చాంద్ పూర్, బిష్ణుపూర్, కాంగ్ పోక్సీ జిల్లాల్లో హింస ఎక్కువగా చెలరేగింది.
తాజావార్తలు
-
Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
-
RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..