Mahua Moitra: తప్పుడు ప్రశ్నలు అడిగారు.. ఎథిక్స్ ప్యానెల్ సమావేశం నుంచి మోయిత్రా, విపక్ష ఎంపీల వాకౌట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra: ‘‘క్యాష్ ఫర్ క్వేరీ’’ కేసులో టీఎంసీ మహువా మోయిత్రా ఈ రోజు పార్లమెంటరీ ఎథిక్స్ ప్యానెల్ ముందు హాజరయ్యారు. అయితే ఈ సమావేశం రసాభాసగా మారినట్లు తెలుస్తోంది. మోయిత్రాకు అండగా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు మద్దతు తెలిపారు. ప్యానెల్ తప్పుడు ప్రశ్నలు అడుగుతోందని ప్రతిపక్ష పార్టీల ఎంపీలతో పాటు మహువా మోయిత్రా సమావేశం నుంచి వాకౌట్ చేశారు.
ఇది ఎథిక్స్ కమిటీనా..? స్క్రిప్ట్ నుంచి చదవడం అని మహువా మోయిత్రా అన్నారు. సమావేశం నుంచి బయటకు వచ్చిన ప్రతిపక్ష ఎంపీలు కూడా ప్యానెల్ మోయిత్రాను అనైతిక ప్రశ్నలు అడిగారని చెప్పారు. ఎథిక్స్ కమిటీ చైర్పర్సన్ ప్రశ్నలు అనైతికంగా ఉన్నాయని మేము గుర్తించామని కాంగ్రెస్ ఎంపీ, ప్యానెల్ లో సభ్యుడైన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అతను ఎవరి ఆదేశాలతో వ్యవహరిస్తున్నారో తెలుస్తోందని, పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి విమర్శించారు. ఎక్కడికి వెళ్లారు..? ఎక్కడ కలిశారు.? మీరు మీ ఫోన్ రికార్డులను ఇవ్వగలరా..? అంటూ ప్రశ్నించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జేడీయూ ఏంపీ గిరిధారి యాదవ్ మాట్లాడుతూ.. మహువా వ్యక్తిగత ప్రశ్నలు అడిగే హక్కు ప్యానెల్కి లేదని అన్నారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
Read Also: Bombay High Court: బిడ్డను కిడ్నాప్ చేశాడని కన్నతండ్రిపై కేసు పెట్టలేం..
ఇదిలా ఉంటే బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి మాట్లాడుతూ.. మోయిత్రా ప్రవర్తన ఖండించేలా ఉందని, ఆమె ఎథిక్స్ ప్యానెట్ ముందు అన్ పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించారని ఆరోపించారు. కమిటీ చైర్పర్సన్ హీరానందానీ అఫిడవిట్ పై ప్రశ్నలు అడుగుతున్నారని, అందుకు ఆమె సమాధానం ఇవ్వడానికి ఇష్టపడలేదని అన్నారు.
పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి ఎంపీ మహువామోయిత్రా డబ్బులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. దీని కోసం విచారణ కోరుతూ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు. ఇదే కాకుండా ఆమె పార్లమెంట్ లాగిన్ వివరాలను వేరే వ్యక్తులకు వెళ్లడించిందని, వారు దుబాయ్ నుంచి ప్రశ్నలు అడిగారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ వ్యవహారంలో తాను తన స్నేహితుడు దర్శన్ హీరానందానీకి లాగిన్ వివరాలు ఇచ్చానని మోయిత్రా ఒప్పుకున్నారు. అయితే ప్రశ్నలు మాత్రం తానే అడిగానన్నారు. తాను లంచం తీసుకున్నా అనే వాదనల్ని ఖండించారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!