Haryana: హర్యానాలో దారుణం.. కోడలిపై మామ హత్యాచారం.. ఇంటి ముందే..!
- హర్యానాలో దారుణం
- కోడలిపై మామ హత్యాచారం
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మార్పు రావడం లేదు. ఎక్కడొక చోట హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హర్యానాలో కోడలిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: KL Rahul: దేశానికే తొలి ప్రాధాన్యం.. కేఎల్ రాహుల్ సూపర్!
Also Read
- National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
- Karnataka: ‘‘చిల్లర లేకపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లా షికోహాబాద్కు చెందిన మహిళ (24).. హర్యానాలోని ఫరీదాబాద్కు చెందిన యువకుడితో 2023, జూలైలో వివాహం జరిగింది. అయితే పెళ్లైన దగ్గర నుంచి కట్న వేధింపులు మొదలయ్యాయి. దీంతో పోరు భరించలేక పుట్టింటికి వెళ్లిపోయింది. ఏడాది పాటు అక్కడే ఉంది. మొత్తానికి తిరిగి అత్తారింటికి వచ్చింది. అయితే రెండు నెలలుగా ఆమె ఆచూకీ కనిపించలేదు. తమ కోడలు అదృశ్యమైందంటూ అత్తామామలు చెప్పడంతో ప్రజలంతా అదే నమ్మారు.
ఇది కూడా చదవండి: Tollywood : ప్లాప్ హీరోయిన్ కు పిలిచి మరీ అవకాశాలు
ఇక రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో అత్తమామలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. ఫదీదాబాద్లోని ఇంటి వెలుపల తవ్విన 10 అడుగుల గుంటలో పూడ్చి పెట్టిన మృతదేహాన్ని పోలీసులు పైకి తీశారు. దీంతో స్థానిక ప్రజలతో పాటు పోలీసులు షాక్కు గురయ్యారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఏప్రిల్ 14న ఆమెను చంపాలని అత్తమామలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పథకంలో భాగంగా అత్తగారిని ఉత్తరప్రదేశ్లోని ఎటాలో జరిగిన వివాహానికి పంపించారు. ఏప్రిల్ 21న రాత్రి కోడలి, ఆమె సోదరికి మామ ఆహారంలో నిద్రమాత్రలు కలిపాడు. భోజనం తర్వాత ఇద్దరు కూడా వేర్వేరు గద్దుల్లో నిద్రపోయారు. ఇక కోడలు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు మామ గదిలోకి ప్రవేశించి.. ఆమెపై అత్యాచారం చేసి చంపేశాడు. అనంతరం కొడుకును పిలిచి మృతదేహాన్ని ఇంటి వెలుపల తవ్విన గుంటలో పూడ్చేసి.. దానిపై సిమెంట్ కప్పేశారు. గుంట ఎందుకు తవ్వారని ఇరుగుపొరుగు వారు అడిగితే మురుగు నీళ్లు వెళ్లేందుకు తవ్వినట్లు నమ్మించారు. ఏప్రిల్ 25న తన కోడలు తప్పిపోయిందంటూ మమ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో ఫిర్యాదుదారుడిని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మామ, అత్త, భర్త, వదినను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బాధితురాలి సోదరి మాట్లాడుతూ.. పెళ్లైన దగ్గర నుంచి అత్తమామలు నిరంతరం వేధిస్తూనే ఉన్నారని తెలిపింది. అందుకే వివాహం అయిన కొద్ది రోజులకే పుట్టింటికి వచ్చేసిందని తెలిపింది. సంవత్సరం పాటు పుట్టింట్లోనే ఉందని వెల్లడించింది. నిత్యం వేధిస్తూనే ఉన్నారని వాపోయింది.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..