Mercy killing: “మా కుటుంబానికి మరణాన్ని ప్రసాదించండి”.. సుప్రీంకోర్టుకు కేరళ కుటుంబం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mercy killing: పుట్టుకతోనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న తమ ఇద్దరు పిల్లలతో పాటు తమకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలంటూ కేరళకు చెందిన ఐదుగురు సభ్యుల కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇద్దరు పిల్లల చికిత్సను కొనసాగించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని కుటుంబీలకు చెప్పారు. కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన కుటుంబంలోని ఐదుగురు ‘మెర్సి కిల్లింగ్’ కోరుతూ భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు.
Read Also: Vice Chancellors: తెలంగాణలోని 10 వర్సిటీలకు వీసీల నియామకం.. నోటిఫికేషన్ విడుదల
Also Read
కోజికోడ్ జిల్లా కోజువనల్కి చెందిన స్మిత ఆంటోనీ, మను జోసెఫ్ దంపతుల ముగ్గురు పిల్లల్లో ఇద్దరు ‘‘సాల్ట్-వేస్టింగ్ కన్జెనిటర్ అడ్రినల్ హైపర్ప్లాసియా(SWCAH)’’తో బాధపడుతున్నారు. వీరి చికిత్సను ముందుకు తీసుకెళ్లడానికి మార్గం కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. సాల్ట్ వేస్టింగ్ అనేది కన్జెనిటల్ అడ్రినల్ హైపర్ప్లాసియా తీవ్రమైన రూపం. ఇది ముఖ్యమైన హార్మోన్ల ఉత్పత్తి చేసే అడ్రినల్ గ్రంధులపై తీవ్ర ప్రభావం చూపే జన్ముపరమైన రుగ్మత.
తాను తన భర్త వృత్తి రీత్యా నర్సులమైనప్పటికీ, తమ పిల్లలకు పూర్తి సమయం సంరక్షణ అవసరం దీంతో తాము పనికి వెళ్లలేకపోయారని స్మిత చెప్పారు. తమ పిల్లల చికిత్స కోసం ఇప్పటికే ఆస్తులు తాకట్టు పెట్టామని చెప్పారు. మా రోజూవారీ ఖర్చల కోసం, చికిత్స కోసం తాము చాలా కష్టపడుతున్నట్లు తెలిపారు. ఉద్యోగం, వైద్యం కోసం స్థానిక పంచాయతీని ఆశ్రయించినప్పటికీ.. ఎలాంటి సాయం లభించలేదని చెప్పారు. తనకు ఉద్యోగం ఇవ్వాలని పంచాయతీ నిర్ణయించినప్పటికీ, కార్యదర్శి నిర్లక్ష్యం వల్ల తనకు జాబ్ రాలేదరి చెప్పారు. మానవహక్కుల సంఘం జోక్యంతో ఫైలును ప్రభుత్వానికి పంపినా.. ఉద్యోగంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. తమ కుటుంబానికి ’’మెర్సికిల్లింగ్’’ వేరే మార్గం లేదని, అందుకే సుప్రీంకోర్టు ఆశ్రయించబోతున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!