Fake social media profiles: సిక్కులు లక్ష్యంగా చైనా కుట్ర.. పలుదేశాల నుంచి భారత వ్యతిరేక ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake social media profiles: డ్రాగన్ కంట్రీ చైనా తన భారత వ్యతిరేకతను వీడటం లేదు. ఏదో విధంగా భారత్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. తాజాగా సిక్కులను టార్గెట్ చేస్తూ, భారత వ్యతిరేక ప్రచారం కోసం ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైళ్లను క్రియేట్ చేస్తోంది. చైనా మద్దతు ఉన్న ఈ ప్రొఫైళ్లు నిత్యం భారత వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అనేక దేశాలల్లో ఖలిస్తాన్ అనుకూల నిరసనలు ప్రేరేపించడానికి ఈ ఖాతాలను ఉపయోగిస్తున్నట్లు మెటా రిపోర్టు వెల్లడించింది.
‘‘యూఎస్ఏలో విద్యాభాస్యం చేసి, ఢిల్లీలో నివసిస్తున్న సిక్కు వారసత్వం, భాష-సంస్కృతిపై మక్కువ ఉన్న పంజాబీ అమ్మాయిగా తనను తాను చెప్పుకుంటున్న ఆద్యా సింగ్ అనే యువతి భారత ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించడంతో పాటు తన సోషల్ మీడియా పోస్టుల్లో భారత ఆధిపత్యాన్ని ఎదుర్కొవడానికి అమెరికా మద్దతు ఇవ్వాలని కోరుతుంది’’ అయితే నిజమైన విషయం ఏంటంటే ఆద్య సింగ్ అనే యువతి అసలు లేనే లేదు. ఇది చైనాతో లింక్ ఉన్న నకిలీ ప్రొఫైల్ నెట్వర్క్లో భాగం. ఇది ఒక ఉదాహరణ మాత్రమే, ఇలాంటివి అనేకం ఉన్నాయి.
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
Read Also: Haircut: హెయిర్ కటింగ్ చేయడానికి ఆలస్యంగా వచ్చాడని.. బార్బర్ని లాకప్లో పెట్టిన పోలీస్..
ఇలాంటి ఫేక్ అకౌంట్లలో చైనా హస్తం ఉండొచ్చని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న రిపోర్టులు దీనికి మద్దతు ఇస్తున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ మరియు ఎక్స్ (గతంలో ట్విట్టర్) వంటి ప్లాట్ఫారమ్లలో ఉన్న పలు సిక్కు అకౌంట్లు భారతదేశంతో సహా 7 దేశాలలలో భారత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ఇవన్నీ చైనాకు చెందినవి. మెటా ఇటీవల 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు అసమంజసమైన సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఖాతాలను, పేజీలతో సహా 60కి పైగా చైనా లింక్డ్ సోషల్ మీడియా అకౌంట్లను తొలగించింది.
ఈ నెట్వర్క్స్ చైనా నుంచి ఉద్భవిస్తున్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, యూకే, నైజీరియాతో సహా ప్రపంచ సిక్కు సమాజాన్ని లక్ష్యంగా చేసుకుందని మెటా నివేదించింది. మెటా ప్రకారం ఈ ఖాతాలు గతంలో భారత్, టిబెట్లను లక్ష్యంగా చేసుకున్న చైనా నెట్వర్క్తో లింక్ చేయబడ్డాయి. ఈ ఖాతాలు అనేక దేశాల్లో ఖలిస్తాన్ అనుకూల నిరసనల్ని ప్రేరేపించడానికి వినియోగిస్తున్నారు. ఈ ఖాతాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగించాయి, తరచుగా హిందీ మరియు ఇంగ్లీషులో పోస్ట్ చేస్తూ, భారత ప్రభుత్వంపై పాశ్చాత్య దేశాలు చర్యలను కోరుతున్నాయి. ముఖ్యంగా కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇలాంటి ప్రచారం మరింత ఎక్కువైంది.
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!