PM Modi: భారత్ శాంతికి ప్రయత్నిస్తే.. పాకిస్తాన్ ప్రతీసారి ద్రోహం చేసింది..
- భారత్ శాంతి ప్రయత్నానికి పాకిస్తాన్ ద్రోహం..
- పాక్కి జ్ఞానం రావాలి, శాంతిని ఎంచుకోవాలి..
- లెక్స్ ఫ్రిడ్మాన్ ఇంటర్వ్యూలో పీఎం మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: పాకిస్తాన్తో శాంతిని నెలకొల్పడానికి చేసిన ప్రతి ప్రయత్నంలో భారత్కి ద్రోహం, శత్రుత్వం ఎదురైందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అమెరికన్ పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2014లో తాను మొదటిసారిగా ప్రమాణస్వీకారం చేసే సమయంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ని ప్రత్యేకంగా ఆహ్వానించిన విషయాన్ని గుర్తు చేశారు. దైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడానికి ఇస్లామాబాద్కి జ్ఞానం రావాలని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: Mohammed Shami: షమీ కూతురిని టార్గెట్ చేసిన మత పెద్దలు.. ఈసారి ఎందుకంటే..?
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
‘‘శాంతిని పెంపొదించే ప్రతీ ప్రయత్నానికి శత్రుత్వం, ద్రోహం ఎదురైంది. వారికి జ్ఞానం రావాలి. వారు శాంతి మార్గాన్ని ఎంచుకుంటానని మేము హృదయపూర్వకంగా ఆశిస్తున్నాము’’ అని ప్రధాని అన్నారు. పాక్ ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని తాను నమ్ముతున్నానని మోడీ అన్నారు. పాక్ ప్రజలు నిత్యం కలహాలు, అశాంతి, నిరంతర భయాల్లో జీవించడంలో అలసిపోయారు, అక్కడి అమాయకపు పిల్లలు కూడా చంపబడ్డారని, లెక్కలేనన్ని జీవితాలు నాశనమయ్యాయని ప్రధాని అన్నారు.
‘‘ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి తాను చేసిన తొలి ప్రయత్నం సద్భావనకు నిదర్శనమని ప్రధానమంత్రి అన్నారు. దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా ఇది దౌత్యపరమైన చర్య. విదేశాంగ విధానం పట్ల నా విధానాన్ని ఒకప్పుడు ప్రశ్నించిన వ్యక్తులు నేను అన్ని సార్క్ దేశాధినేతలను ఆహ్వానించానని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోయారు. అప్పటి రాష్ట్రపత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ చారిత్రాత్మక విషయాన్ని తన జ్ఞాపకాలలో అందంగా చిత్రీకరించారు’’ అని పీఎం మోడీ చెప్పారు. భారత విదేశాంగ విధానం ఎంత స్పష్టంగా నమ్మకంగా మారిందనే దానికి ఇది నిదర్శనమని, ఇది శాంతి, సారస్యానికి భారత్ చూపించే నిబద్ధత అని ప్రపంచాన్ని సందేశమిచ్చామని చెప్పారు.
తాజావార్తలు
-
Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
-
నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి నేడు పండగే!
-
Tollywood : చేతులు దాటుతున్న సినిమా బడ్జెట్లు.. కుదేలవుతున్న టాలీవుడ్ నిర్మాతలు!
-
Strait of Hormuz Closure: ఇరాన్ తీవ్ర హెచ్చరిక.. హార్మూజ్ గుండా వచ్చే నౌకలపై దాడులకు సిద్ధం.. చమురు సరఫరాకు ముప్పు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!