EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్..వడ్డీ పై కేంద్రం ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఐదు కోట్లకు మందికిపైగా వేతన జీవులకు లబ్ధి చేకూరనుంది. 2022-23 ఆర్థిక ఏడాదికి గానూ వడ్డీ రేటును ప్రకటించింది. ఈసారి 8.15 శాతం వడ్డీ రేటుకు ఆమోదం తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మార్చి 28న 8.15 శాతం వడ్డీ రేటును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. బోర్డు ప్రతిపాదనకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.. ఈ మేరకు ఒక ప్రకటన వెలువరిచింది.. ఈపీఎఫ్ సభ్యుల ఖాతాల్లో వడ్డీని జమ చేసేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది..
ఇకపోతే EPFO వడ్డీ రేటుపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ ఏడాది మార్చి, 2023లో కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును పెంచాలని కోరినట్లు తెలుస్తుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ 8.10 వడ్డీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15 శాతం వడ్డీ రేటును ప్రకటించింది… సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ప్రతిపాదించిన వడ్డీ రేటుకు కేంద్ర ప్రభుత్వం పరిశీలించి చర్చల అనంతరం ఆమోదం తెలిపింది..
Also Read
- SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
- Tripura DGP Anurag Dhankar: పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్య!
- CJP Parliament March: ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్.. పార్లమెంట్ వరకు దూసుకెళ్లిన CJP కార్యకర్తలు..
- CJP Protest: ‘ఛలో పార్లమెంట్’ ఉద్యమంలో కీలక పరిణామం..
అయితే గత ఏడాది అతి తక్కువ వడ్డీని ప్రకటించిన ప్రభుత్వం ఈ ఏడాది ఊరట కలిగించింది.. ఏకంగా 5% పెంచడం విశేషం..2022-23 ఆర్థిక ఏడాదికి గానూ వడ్డీ ఇంకా తక్కువగా ఉండొచ్చని అంచనా వేశారు. ఈసారి వడ్డీ రేటు దాదాపు 8 శాతానికి తగ్గిస్తారని భావించారు. కానీ ఈపీఎఫ్ఓ 5 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటు పెంచడం విశేషం. గతేడాది మార్చిలో ఈపీఎఫ్ఓ 8.1 శాతం వడ్డీ రేటును సిఫార్సు చేసింది. ఇది గత నాలుగు దశాబ్దాల్లో కనిష్ట వడ్డీ రేటు. అంతకన్నా ముందు సంవత్సరంలో 8.5 శాతం వడ్డీని ఇచ్చింది ఈపీఎఫ్ఓ.. ఖాతా దారులకు వడ్డీ తగ్గితే.. తమ కంట్రిబ్యూషన్పై వచ్చే వడ్డీ తగ్గుతుంది. గతేడాది నాలుగు దశాబ్దాల్లోనే తక్కువ వడ్డీని ప్రకటించడం ఉద్యోగులను నిరాశపర్చింది. 1977-78 సంవత్సరంలో ఈపీఎఫ్ వడ్డీ 8 శాతం ఉండేది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది.. అప్పుడే వడ్డీ మనకు చేరుతుంది..
తాజావార్తలు
-
KTR: ‘రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి’..
-
Hindu Rituals: హిందూ సంప్రదాయంలో అందరికీ దహన సంస్కారమేనా? ఈ 5 మందిని కాల్చొద్దని ఎందుకు చెబుతారు?
-
Rohit Sharma: అతడితో కలిసి బ్యాటింగ్ చేయడం ఇష్టం.. నేను చాలా ఎంజాయ్ చేస్తా!
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Toxic: ‘టాక్సిక్’ నుంచి మరో సర్ప్రైజ్.. యష్తో ఈసారి తారా సుతారియా రొమాన్స్!
ట్రెండింగ్
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!