Pulwama Attack: పుల్వామా దాడిని సెలబ్రేట్ చేసుకున్న విద్యార్థికి ఐదేళ్లు జైలు శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Engineering Student Gets 5 Years In Jail For “Celebrating” Pulwama Attack: 2019లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పుల్వామా దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి తర్వాత ఫేస్ బుక్ లో అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి బెంగళూర్ స్పెషల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు రూ. 25,000 జరిమానా విధించింది. ఈ మేరకు అదనపు సిటీ సివిల్, సెషన్స్ జడ్జి గంగాధర ఈ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడు ఫైజ్ రషీద్ కు ప్రస్తుతం 22 ఏళ్లు. నేరం జరిగే సమయానికి రషీద్ కు 19 ఏళ్లు. మూడున్నరేళ్లుగా ఇతడు కస్టడీలో ఉన్నాడు. సెక్షన్ 153ఏ( మతం ప్రాతిపదికన శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), సెక్షన్ 201 కింద అతన్ని కోర్టు దోషిగా నిర్థారించింది. సెక్షన్ 124(దేశ ద్రోహం) ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉండటంతో దీని విచారణ జరగలేదు.
Read Also: Bandi Sanjay Resign: బీజేపీ రాష్ట్రాధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా.. సోషల్ మీడియాలో ఫోర్జరీ లేఖ
Also Read
పుల్వామా దాడి జరిగిన తర్వాత రషీద్ సెలబ్రేట్ చేసుకుంటూ.. ఆర్మీని అవహేళన చేస్తూ ఫేస్ బుక్ లో పలు పోస్టులు చేశాడు. మత ప్రాతిపదికన ఇరు వర్గాల మధ్య అల్లర్లు జరిగే విధంగా పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడిపై అవమానకరమైన పోస్టులు చేశాడు. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కలిగించే విధంగా నిందితులు ప్రవర్తించినట్లు సాక్ష్యాలు లభించడంతో రషీద్ ను దోషిగా తేల్చింది కోర్టు. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యకు పాల్పడినట్లు కోర్టు భావించింది.
నిందితులు కేవలం ఒకటి రెండు సార్లు కించపరిచే వాఖ్యలు చేయలేదని.. ఫేస్ బుక్ లోని అన్ని న్యూస్ ఛానెళ్లలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడని.. అతడు నిరక్షరాస్యుడు, సామాన్యుడేం కానది.. ఇంజనీరింగ్ విద్యార్థి అని కోర్టు పేర్కొంది. అతడు 24 సార్ల కన్నా ఎక్కువ సార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని కోర్టు తెలిపింది. సీఆర్పీఎఫ్ జవాన్ల మరణాన్ని భారతీయుడు కాకుంటేనే సెలబ్రేట్ చేసుకుంటాడని.. ఈ చర్య దేశానికి వ్యతిరేకంగా ఉందని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. 2019లో పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ జరిపిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!