Pulwama Attack: పుల్వామా దాడిని సెలబ్రేట్ చేసుకున్న విద్యార్థికి ఐదేళ్లు జైలు శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Engineering Student Gets 5 Years In Jail For “Celebrating” Pulwama Attack: 2019లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పుల్వామా దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి తర్వాత ఫేస్ బుక్ లో అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి బెంగళూర్ స్పెషల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు రూ. 25,000 జరిమానా విధించింది. ఈ మేరకు అదనపు సిటీ సివిల్, సెషన్స్ జడ్జి గంగాధర ఈ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడు ఫైజ్ రషీద్ కు ప్రస్తుతం 22 ఏళ్లు. నేరం జరిగే సమయానికి రషీద్ కు 19 ఏళ్లు. మూడున్నరేళ్లుగా ఇతడు కస్టడీలో ఉన్నాడు. సెక్షన్ 153ఏ( మతం ప్రాతిపదికన శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), సెక్షన్ 201 కింద అతన్ని కోర్టు దోషిగా నిర్థారించింది. సెక్షన్ 124(దేశ ద్రోహం) ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉండటంతో దీని విచారణ జరగలేదు.
Read Also: Bandi Sanjay Resign: బీజేపీ రాష్ట్రాధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా.. సోషల్ మీడియాలో ఫోర్జరీ లేఖ
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
పుల్వామా దాడి జరిగిన తర్వాత రషీద్ సెలబ్రేట్ చేసుకుంటూ.. ఆర్మీని అవహేళన చేస్తూ ఫేస్ బుక్ లో పలు పోస్టులు చేశాడు. మత ప్రాతిపదికన ఇరు వర్గాల మధ్య అల్లర్లు జరిగే విధంగా పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడిపై అవమానకరమైన పోస్టులు చేశాడు. భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కలిగించే విధంగా నిందితులు ప్రవర్తించినట్లు సాక్ష్యాలు లభించడంతో రషీద్ ను దోషిగా తేల్చింది కోర్టు. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యకు పాల్పడినట్లు కోర్టు భావించింది.
నిందితులు కేవలం ఒకటి రెండు సార్లు కించపరిచే వాఖ్యలు చేయలేదని.. ఫేస్ బుక్ లోని అన్ని న్యూస్ ఛానెళ్లలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడని.. అతడు నిరక్షరాస్యుడు, సామాన్యుడేం కానది.. ఇంజనీరింగ్ విద్యార్థి అని కోర్టు పేర్కొంది. అతడు 24 సార్ల కన్నా ఎక్కువ సార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని కోర్టు తెలిపింది. సీఆర్పీఎఫ్ జవాన్ల మరణాన్ని భారతీయుడు కాకుంటేనే సెలబ్రేట్ చేసుకుంటాడని.. ఈ చర్య దేశానికి వ్యతిరేకంగా ఉందని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. 2019లో పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ జరిపిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!