Viral: మహిళను తొక్కి చంపిన ఏనుగు.. అంత్యక్రియలు కూడా అడ్డుకొని..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గజరాజుకు కోపం వస్తే ఏం జరుగుతోందో.. ఎలా ప్రవర్తిస్తోందో ఎన్నో ఘటనలు వెలుగు చూశాయి.. ప్రశాంతంగా ఉండే గజరాజుకు కోపం వచ్చిందంటే.. ఆపడం ఎవరితరం కాదు.. విధ్వంసం సృష్టిస్తోంది.. పంట పొలాలు, వాహనాలు, ప్రజలు, జంతువులు.. ఇలా ఏది అడ్డువచ్చినా.. అడ్డుకోవడం కష్టమే.. అయితే, తాజాగా ఓ ఏనుగు ప్రవర్తించిన తీరు మాత్రం సోషల్ మీడియాకు ఎక్కింది.. ఔరా..! ఆ గజరాజు ఎందుకు ఇలా చేశాడు..? మహిళలను తొక్కి చంపడం ఏంటి..? ఆ తర్వాత అంత్యక్రియలను కూడా అడ్డుకోవడం ఏంటి..? అంటూ అంతా ఆశ్చర్యపోయేలా చేసింది. అంతే కాదు.. ఆ ఘటన వెనుక ఓ స్టోరీని కూడా తెరపైకి తెస్తున్నారు.
Read Also: Rahul Gandhi At ED Office: ఈడీ ముందుకు రాహుల్.. విచారణ ప్రారంభం
Also Read
- New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
- Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ప్రమాదంపై కొత్త డిమాండ్.. పైలట్ల సంఘాలు నిరసన
- Saayoni Ghosh: గెటప్ మార్చేసిన టీఎంసీ రెబల్ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
ఒడిశాలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మయూర్భంజ్ జిల్లాలో 70 ఏళ్ల వృద్ధురాలిపై దాడి చేసింది ఓ ఏనుగు.. రాయ్పల్ గ్రామంలో నివాసం ఉంటున్న 70 ఏళ్ల వృద్ధురాలు మయ ముర్మూ.. తాగు నీటి కోసం సమీపంలోని పంపు మోటర్ దగ్గరకు వెళ్లగా.. పొలాల్లోకి దూసుకొచ్చిన ఓ ఏనుగు.. ఆమె దాడి చేసింది.. ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు స్థానికులు.. కానీ, అప్పటికే ఆమె మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.. ఇక, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన బంధువులు, స్థానికులు.. మృతదేహాన్ని ఊరేగింపుగా స్మశనవాటికకు తరలించారు. మృతదేహాన్ని చితి మీద పెట్టే సమయానికి మరోసారి ఎంట్రీ ఇచ్చింది ఆ ఏనుగు.. భయంతో అక్కడివారు పరుగులు తీయగా.. చితి మీద నుంచి శవాన్ని తొండంతో ఎత్తి పడేసింది.. కిందపడేసి తొక్కింది.. ఆ వృద్ధురాలి శవాన్ని దూరంగా విసిరేసంది.. ఇక, ఆ తర్వాత నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది..
ఈ ఘటన వెనుక స్థానికులు ఓ స్టోరీని చెబుతున్నారు.. మయ ముర్మూ భర్త ఏడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడట.. అయితే, ఆయనకు విషం పెట్టి మయ ముర్మూ చంపేసిందనే ప్రచారం కూడా ఉందట.. దీంతో, ఆమెపై కోపంతో ఉన్న భర్త.. ఆత్మగా మారి.. ఆ ఏనుగులో ప్రవేశించి.. ఇప్పుడు ఆమెను చంపేశాడని.. కనీసం అంత్యక్రియలను కూడా సజావుగా సాగకుండా చేశాడని.. గ్రామస్తుల జోలికే రాలేదని కథలు కథలుగా చెబుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు నెట్టింట వైరల్గా మారిపోయింది.
- Tags
- elephant
- funeral
- india
- Maya Murmu
- Odisha
తాజావార్తలు
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!