Electric Vehicles: 2030 నాటికి ఇండియాలో 5 కోట్లకు చేరనున్న ఎలక్ట్రిక్ వాహనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Electric Vehicles in India To Touch 5 Crore By 2030: భారత్ తో క్రమక్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతోంది. వినియోగదారులు ఈవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పెరుగుతున్న పెట్రోల్, డిజిల్ ధరలకు ప్రత్యామ్నాయంగా విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా ద్విచక్ర వాహనాలతో పాటు, కార్లు అమ్మకాలు పెరిగాయి. కేపీఎంజీ కన్సల్టెన్సీ సంస్థ నివేదిక ప్రకారం ఇండియాలో 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 5 కోట్లకు చేరుతుందని అంచానా వేసింది. ప్రస్తుతం ఇండియాలో కేవలం 1 శాతం మాత్రమే ఉన్న ఈవీలు డిమాండ్, సరఫరాలకు అనుకూలంగా ఉండటంతో రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో పెరుగుదల చోటు చేసుకుంటుందని అంచనా వేసింది. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కూడా పెద్ద అవకాశంగా అభివర్ణించింది.
Read Also: Ganesh Chaturthi: వినాయకుడిని తాకిన ‘పుష్ప’ క్రేజ్.. వైరల్గా మారిన ‘పుష్ప’ వినాయకుడు
Also Read
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
నివేదిక ప్రకారం.. క్రమంగా ఈవీలు జనాల్లోకి ప్రవేశిస్తున్నాయని.. గత ఆర్థిక సంవత్సరంలో ఈవీల అమ్మకాలు ఏకంగా మూడు రెట్లు పెరిగాయని తెలిపింది. మార్చి 2022 నాటికి ఇండియాలో ఈవీల సంఖ్య పది లక్షలను అధిగమించింది. ఈ సంఖ్య 2030 నాటికి 45-50 మిలియన్లకు అంటే దాదాపుగా 5 కోట్లకు చేరే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. దీంతో పాటు ఈవీ ఛార్జింగ్ ఎకో సిస్టమ్ కూడా మెరుగైన అవకాశాలను కల్పిస్తాయని పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 1700 ఛార్జింగ్ స్టేషన్లు మాత్రమే పనిచేస్తున్నాయని.. ఇవి ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు సరిపోవు.. ఛార్జింగ్ స్టేషన్ సౌకర్యాలను కల్పించేందుకు పబ్లిక్, ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని.. ప్రభుత్వం కూడా బలంగా వీటని ఏర్పాటు చేయాలని చూస్తోందని నివేదికలో తెల్పింది.
కేపీఎంజీ నివేదిక ప్రకారం టూ వీలర్ విభాగంలో 2025 నాటికి 15-20 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేయగా… 2030 నాటికి 50-60 శాతానికి మరింతగా పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత ప్యాసింజర్ వాహనాల విషయానికి వస్తే 2030 నాటికి 8-10 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. అదే విధంగా త్రిచక్ర వాహనాల్లో 2025 నాటికి 45-50 శాతం వృద్ధి ఉంటే 2030 నాటికి 90-95 శాతం గ్రోత్ ఉంటుందని అంచానా వేసింది.
తాజావార్తలు
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
-
Dal Dhokli Recipe : ఉల్లి, వెల్లుల్లి లేని ట్రెడిషనల్ గుజరాతీ ట్రెడిషనల్ వంటకం .. దీక్షలో ఉన్నప్పుడు భలే రుచిగా.!
-
NTRNeel : ఎన్టీఆర్ బర్త్డే ‘డబుల్ ధమాకా’.. ‘డ్రాగన్’ గ్లింప్స్.. ఇంకా..!
-
KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..