Electric Vehicles: 2030 నాటికి ఇండియాలో 5 కోట్లకు చేరనున్న ఎలక్ట్రిక్ వాహనాలు
Electric Vehicles in India To Touch 5 Crore By 2030: భారత్ తో క్రమక్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతోంది. వినియోగదారులు ఈవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పెరుగుతున్న పెట్రోల్, డిజిల్ ధరలకు ప్రత్యామ్నాయంగా విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా ద్విచక్ర వాహనాలతో పాటు, కార్లు అమ్మకాలు పెరిగాయి. కేపీఎంజీ కన్సల్టెన్సీ సంస్థ నివేదిక ప్రకారం ఇండియాలో 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 5 కోట్లకు చేరుతుందని అంచానా వేసింది. ప్రస్తుతం ఇండియాలో కేవలం 1 శాతం మాత్రమే ఉన్న ఈవీలు డిమాండ్, సరఫరాలకు అనుకూలంగా ఉండటంతో రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో పెరుగుదల చోటు చేసుకుంటుందని అంచనా వేసింది. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కూడా పెద్ద అవకాశంగా అభివర్ణించింది.
Read Also: Ganesh Chaturthi: వినాయకుడిని తాకిన ‘పుష్ప’ క్రేజ్.. వైరల్గా మారిన ‘పుష్ప’ వినాయకుడు
Also Read
- Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
- Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
- Delhi: లక్ష్మీనగర్లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
- Gujarat: సూరత్లో బాలికపై లైంగిక వేధింపులు.. నిందితుడిని శిక్షించాలంటూ భారీ ఆందోళన
నివేదిక ప్రకారం.. క్రమంగా ఈవీలు జనాల్లోకి ప్రవేశిస్తున్నాయని.. గత ఆర్థిక సంవత్సరంలో ఈవీల అమ్మకాలు ఏకంగా మూడు రెట్లు పెరిగాయని తెలిపింది. మార్చి 2022 నాటికి ఇండియాలో ఈవీల సంఖ్య పది లక్షలను అధిగమించింది. ఈ సంఖ్య 2030 నాటికి 45-50 మిలియన్లకు అంటే దాదాపుగా 5 కోట్లకు చేరే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. దీంతో పాటు ఈవీ ఛార్జింగ్ ఎకో సిస్టమ్ కూడా మెరుగైన అవకాశాలను కల్పిస్తాయని పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 1700 ఛార్జింగ్ స్టేషన్లు మాత్రమే పనిచేస్తున్నాయని.. ఇవి ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు సరిపోవు.. ఛార్జింగ్ స్టేషన్ సౌకర్యాలను కల్పించేందుకు పబ్లిక్, ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని.. ప్రభుత్వం కూడా బలంగా వీటని ఏర్పాటు చేయాలని చూస్తోందని నివేదికలో తెల్పింది.
కేపీఎంజీ నివేదిక ప్రకారం టూ వీలర్ విభాగంలో 2025 నాటికి 15-20 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేయగా… 2030 నాటికి 50-60 శాతానికి మరింతగా పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత ప్యాసింజర్ వాహనాల విషయానికి వస్తే 2030 నాటికి 8-10 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. అదే విధంగా త్రిచక్ర వాహనాల్లో 2025 నాటికి 45-50 శాతం వృద్ధి ఉంటే 2030 నాటికి 90-95 శాతం గ్రోత్ ఉంటుందని అంచానా వేసింది.
తాజావార్తలు
-
BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
-
Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
-
Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!
-
Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ
-
Panama Canal: హార్మూజ్ జలసంది మూసివేత..! ఒక్కో ట్యాంకర్పై రూ.37 కోట్లు సంపాదిస్తున్న ఓ చిన్న దేశం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!