Gandhi: దేశ విభజన తర్వాత.. మహాత్మా గాంధీ పాకిస్థాన్లో నివసించాలనుకున్నారా..? ఆశ్చర్యపరిచే నిజం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahatma Gandhi: ఈ రోజు అక్టోబర్ 2వ. మహాత్మా గాంధీ 156వ జయంతి. భారతదేశ స్వాతంత్ర్యాన్ని సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1947 ఆగస్టు 15వ తేదీ రాత్రి మన దేశం స్వాతంత్ర్యం పొందినప్పటికీ.. ఇస్లాం పేరుతో మన దేశం విభజించబడింది. పాకిస్థాన్ అనే కొత్త దేశం ఆవిర్భవించింది. విభజనకు మహాత్మా గాంధీ కారణమని చాలామంది నమ్ముతారు. ముస్లింలను సంతృప్తి పరచడానికి జిన్నా డిమాండ్లకు గాంధీ అంగీకరించారని రాడికల్ రైట్-వింగర్లు నమ్ముతారు.
READ MORE: Medha Gandhi: మహాత్మా గాంధీ ముని మనవరాలు పెద్ద యాక్టర్ అని మీకు తెలుసా..?
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
అయితే.. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ స్వయంగా పాకిస్తాన్కు వెళ్లాలని అనుకున్నారు. స్వాతంత్ర్యం తర్వాత గాంధీ మన పొరుగు దేశంలో స్థిరపడాలని కోరుకున్నారట. అయితే, ఆయన కోరిక వెనుక అనేక కారణాలు ఉన్నాయి. మాజీ కేంద్ర మంత్రి ఎం.జె. అక్బర్ రాసిన “గాంధీస్ హిందూయిజం: ది స్ట్రగుల్ ఎగైనెస్ట్ జిన్నాస్ ఇస్లాం” అనే పుస్తకం ప్రకారం.. మహాత్మా గాంధీ 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన మొదటి రోజును పాకిస్థాన్లో గడపాలని కోరుకున్నారని పేర్కొన్నారు. అయితే.. అప్పటి నాయకులు మహాత్మా గాంధీ పాకిస్థాన్ పర్యటన ప్రకటనలను పట్టించుకోలేదట.
READ MORE: MP: దుర్గామాత నిమజ్జనోత్సవంలో విషాదం.. 11 మంది భక్తుల మృతి
మహాత్మా గాంధీ పాకిస్థాన్ కు ఎందుకు వెళ్లాలనుకున్నారో తెలుసుకుందాం.. MJ అక్బర్ పుస్తకం ప్రకారం.. స్వాతంత్ర్యం తర్వాత మహాత్మా గాంధీ రెండు దేశాలలోని మైనారిటీల గురించి ఆందోళన చెందారు. పాకిస్థాన్ లో హిందువులు, భారత్లో ముస్లింలు మైనార్టీలు. గాంధీ హింస ప్రభావిత ప్రాంతాలను సందర్శించాలని భావించారు. 1946 అల్లర్లలో హిందువులు అత్యంత ప్రభావితమైన తూర్పు పాకిస్థాన్ లోని నోఖాలిలో నివసించాలని గాంధీ కోరుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి గాంధీ అక్కడికి వెళ్లాలని కోరుకున్నారు. 1947 మే 31న, గాంధీ పఠాన్ నాయకుడు అబ్దుల్ గఫార్ ఖాన్ (ఫ్రాంటియర్ గాంధీగా ప్రసిద్ధి చెందారు) తో తాను స్వాతంత్ర్యం తర్వాత పశ్చిమ సరిహద్దును సందర్శించి పాకిస్థాన్ లో స్థిరపడాలని కోరుకుంటున్నానని చెప్పారని పుస్తకంలో ఉంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?