Gandhi: దేశ విభజన తర్వాత.. మహాత్మా గాంధీ పాకిస్థాన్లో నివసించాలనుకున్నారా..? ఆశ్చర్యపరిచే నిజం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahatma Gandhi: ఈ రోజు అక్టోబర్ 2వ. మహాత్మా గాంధీ 156వ జయంతి. భారతదేశ స్వాతంత్ర్యాన్ని సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1947 ఆగస్టు 15వ తేదీ రాత్రి మన దేశం స్వాతంత్ర్యం పొందినప్పటికీ.. ఇస్లాం పేరుతో మన దేశం విభజించబడింది. పాకిస్థాన్ అనే కొత్త దేశం ఆవిర్భవించింది. విభజనకు మహాత్మా గాంధీ కారణమని చాలామంది నమ్ముతారు. ముస్లింలను సంతృప్తి పరచడానికి జిన్నా డిమాండ్లకు గాంధీ అంగీకరించారని రాడికల్ రైట్-వింగర్లు నమ్ముతారు.
READ MORE: Medha Gandhi: మహాత్మా గాంధీ ముని మనవరాలు పెద్ద యాక్టర్ అని మీకు తెలుసా..?
Also Read
- Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
- Mithali Raj: ఇకనైనా 'స్మృతి మందాన'ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
- Rohit Sharma Retirement: లార్డ్స్లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా..!
- India vs England: రెండో వన్డేలో ఓటమిపై కెప్టెన్ గిల్ అసంతృప్తి.. వాళ్లే కారణం..!
అయితే.. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ స్వయంగా పాకిస్తాన్కు వెళ్లాలని అనుకున్నారు. స్వాతంత్ర్యం తర్వాత గాంధీ మన పొరుగు దేశంలో స్థిరపడాలని కోరుకున్నారట. అయితే, ఆయన కోరిక వెనుక అనేక కారణాలు ఉన్నాయి. మాజీ కేంద్ర మంత్రి ఎం.జె. అక్బర్ రాసిన “గాంధీస్ హిందూయిజం: ది స్ట్రగుల్ ఎగైనెస్ట్ జిన్నాస్ ఇస్లాం” అనే పుస్తకం ప్రకారం.. మహాత్మా గాంధీ 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన మొదటి రోజును పాకిస్థాన్లో గడపాలని కోరుకున్నారని పేర్కొన్నారు. అయితే.. అప్పటి నాయకులు మహాత్మా గాంధీ పాకిస్థాన్ పర్యటన ప్రకటనలను పట్టించుకోలేదట.
READ MORE: MP: దుర్గామాత నిమజ్జనోత్సవంలో విషాదం.. 11 మంది భక్తుల మృతి
మహాత్మా గాంధీ పాకిస్థాన్ కు ఎందుకు వెళ్లాలనుకున్నారో తెలుసుకుందాం.. MJ అక్బర్ పుస్తకం ప్రకారం.. స్వాతంత్ర్యం తర్వాత మహాత్మా గాంధీ రెండు దేశాలలోని మైనారిటీల గురించి ఆందోళన చెందారు. పాకిస్థాన్ లో హిందువులు, భారత్లో ముస్లింలు మైనార్టీలు. గాంధీ హింస ప్రభావిత ప్రాంతాలను సందర్శించాలని భావించారు. 1946 అల్లర్లలో హిందువులు అత్యంత ప్రభావితమైన తూర్పు పాకిస్థాన్ లోని నోఖాలిలో నివసించాలని గాంధీ కోరుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి గాంధీ అక్కడికి వెళ్లాలని కోరుకున్నారు. 1947 మే 31న, గాంధీ పఠాన్ నాయకుడు అబ్దుల్ గఫార్ ఖాన్ (ఫ్రాంటియర్ గాంధీగా ప్రసిద్ధి చెందారు) తో తాను స్వాతంత్ర్యం తర్వాత పశ్చిమ సరిహద్దును సందర్శించి పాకిస్థాన్ లో స్థిరపడాలని కోరుకుంటున్నానని చెప్పారని పుస్తకంలో ఉంది.
తాజావార్తలు
-
Volvo EX90: వోల్వో EX90 ఎలక్ట్రిక్ SUV.. 602KM రేంజ్, 5-స్టార్ సేఫ్టీ, లగ్జరీ ఫీచర్లతో రానున్న ఫ్లాగ్షిప్ EV
-
Akshay Kumar : ‘వెల్కమ్ టుది జంగిల్’ థియేటర్లలో ఉండగానే మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అక్షయ్ కుమార్
-
Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
-
Ather: ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్ కు రెడీ.. కొత్త EL ప్లాట్ఫామ్, స్మార్ట్ ఫీచర్లు
-
Mithali Raj: ఇకనైనా ‘స్మృతి మందాన’ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!