Anil Ambani: అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు.. 5న హాజరుకావాలని ఆదేశం
- అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు
- ఆగస్టు 5న హాజరుకావాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. రూ.17,000 కోట్లు విలువైన లోన్ మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 5న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ విచారణ చేయనుంది.
ఇది కూడా చదవండి: Deccan Kitchen Case: కోర్టుకు వెంకటేష్, రానా, సురేష్ బాబు
Also Read
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
- Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
జూలై 24న ముంబైలో అనిల్ అంబానీ గ్రూపుకు చెందిన 35 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. 50 కంపెనీలు, 25 మంది బిజినెస్ పార్ట్నర్స్ ఇళ్లపై మూడ్రోజుల పాటు సోదాలు నిర్వహించింది. రిలయన్స్ గ్రూపుకి చెందిన అనేక ఆస్తులు, లావాదేవీలపై కూడా ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. ఇక గురువారం కూడా నాలుగు ప్రాంగణాల్లో వరుస సోదాలు నిర్వహించింది. భువనేశ్వర్లో మూడు, కోల్కతాలో ఒక చోట సోదాలు చేశారు. తాజా దర్యాప్తులో రూ.68 కోట్ల నకిలీ బ్యాంక్ గ్యారెంటీ అభియోగం మోపబడింది.
ఇది కూడా చదవండి: Triangle Love: ఒక యువతిని ప్రేమించిన ఇద్దరు విద్యార్థులు.. ఒకరు హత్య
అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు రూ.వేల కోట్ల విలువైన బ్యాంకు రుణ మోసానికి పాల్పడ్డాయనే ఆరోపణలపై ఈడీ కేసు నమోదైంది. 2017-19 మధ్య అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు యెస్ బ్యాంక్ ఇచ్చిన రూ.3,000 కోట్ల రుణాలు చట్టవ్యతిరేక పద్ధతుల్లో దారిమళ్లాయన్న ఆరోపణలు వచ్చాయి. ఆ బ్యాంక్ మాజీ ప్రమోటర్లకు లంచం ఇచ్చారన్న అభియోగాలు ఉన్నాయి. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్న రూ.10వేల కోట్ల రుణాలను కూడా దారి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
-
Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
-
1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
-
Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్లో మంటలు..
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!