Triangle Love: ఒక యువతిని ప్రేమించిన ఇద్దరు విద్యార్థులు.. స్నేహితుడు హత్య
- ట్రయాంగిల్ లవ్కు ఒకరు బలి
- ఒక యువతిని ప్రేమించిన ఇద్దరు విద్యార్థులు
- ప్రత్యర్థి ప్రేమికుడ్ని చంపబోయి స్నేహితుడు హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రయాంగిల్ లవ్ కారణంగా ఒక స్నేహితుడు బలైపోయాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. డీఎంకే నేత మనవడు సహా మరో ముగ్గురు నిందితులు అరెస్ట్ కాగా.. ఇంకొకరి కోసం గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Kolkata: బంగ్లాదేశ్ మోడల్ శాంతా పాల్ అరెస్ట్.. పోలీస్ కస్టడీకి అప్పగింత
Also Read
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
ఇద్దరు విద్యార్థులు.. ఒక విద్యార్థినిని ప్రేమిస్తున్నారు. దీంతో రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అయితే అందులో ఒక ప్రేమికుడు చంద్రు…డీఎంకే కౌన్సిలర్ మనవడు సహాయం కోరాడు. ప్రత్యర్థి వర్గానికి చెందిన వారిని బెదిరించాలని కోరాడు. దీంతో సోమవారం చెన్నైలో రేంజ్ రోవర్ కారులో బయల్దేరారు. ప్రత్యర్థి వర్గం రెండు బైక్లపై వెళ్తున్నారు. అయితే ప్రత్యర్థి ప్రేమికుడు వెంకటేశన్ను చంపబోయి.. అతడి స్నేహితుడు నితిన్ సాయిను చంపేశారు. వెనుక నుంచి బైక్ను కారు ఢీకొట్టగా విద్యార్థి నితిన్ సాయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఇది కూడా చదవండి: US Tariffs: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. ఆ ఒక్క రంగంలోనే లక్ష ఉద్యోగాలకు ఎసరు..!
అయితే మొదట్లో ఇది ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులు భావించారు. కానీ పోలీసుల దర్యాప్తులో కారు ఉద్దేశపూర్వకంగానే ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిందని తేలింది. ఒక యువతి కోసం రెండు వర్గాలు ఘర్షణ పడుతున్నట్లుగా తేలింది. దీంతో డీఎంకే కౌన్సిలర్ మనవడు సహా విద్యార్థులను అరెస్ట్ చేయగా.. ఇంకొకరి కోసం గాలిస్తున్నారు.

వాస్తవానికి వెంకటేశన్ అనే విద్యార్థిని బెదిరించడానికి బయల్దేరితే.. స్నేహితుడు నితిన్ సాయి(19) ప్రాణాలు పోయాయి. తలకు తీవ్ర గాయాలై నితిన్ అక్కడికక్కడే మృతి చెందాడు. నితిన్ సాయి.. అభిషేక్ ఒక బైక్పై ఉండగా.. వెంకటేశన్ ఇంకో బైక్పై ఉన్నాడు. కానీ అభిషేక్ నడుపుతున్న బైక్ను కారు ఢీకొట్టింది. డ్రైవింగ్ చేస్తున్న అభిషేక్ గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. ఆయా సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కారులో ఉన్న నాల్గవ విద్యార్థి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసును రాజకీయ సంబంధంగా చూడలేమని డీఎంకే తెలిపింది. ఇది సామాజిక సమస్య అని.. రాజకీయ సమస్య కాదని డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఎలంగోవన్ అన్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!