Rahul Gandhi: ఉగ్రవాదులు నన్ను చూశారు, నేను వారిని చూశాను.. కానీ వారు ఏం అనలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi at Cambridge: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కీలక విషయాలను వెల్లడించారు. తాను భారత్ జోడో యాత్రలో భాగంగా కాశ్మీర్ లో పర్యటించినప్పుడు జరిగిన ఓ సంఘటనను అక్కడ ఉన్నవారితో పంచుకున్నారు. ఉగ్రవాద ప్రభావం ఉండటం వల్ల కాశ్మీర్ లో యాత్ర చేయొద్దని భద్రతా బలగాలు తనను కోరాయని, అయితే తాను మాత్రం యాత్రను కొనసాగించేందుకు నిర్ణయించుకున్నానని చెప్పారు.
Read Also: Amazon Jungle: పురుగులు తింటూ, మూత్రం తాగుతూ.. 31 రోజులు అమెజాన్ అడవిలో బతుకుపోరాటం
Also Read
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
ఆయన ‘ లర్నింగ్ టూ లిజన్ ఇన్ 21 సెంచరీ’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ఈ సమయంలో భారత్ జోడో యాత్రలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. నేను భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రజలతో మాట్లాడాలని అనుకున్నానని, కాశ్మీర్ లో యాత్ర జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి తన వద్దకు వచ్చి మాట్లాడాలని అనుకున్నారని, అతను ప్రజలు కష్టాలు తెలుసుకోవడానికి కాంగ్రెస్ నాయకులు కాశ్మీర్ వచ్చారా..? అని తనను అడిగాడని అన్నారు. కొద్ది సేపటి తర్వాత అతను దూరంగా ఉన్న కొందరు వ్యక్తల వైపు చూపుతూ.. వారంతా ఉగ్రవాదులు అని చెప్పాడని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదులు నన్ను చంపేస్తారని నేను ఇబ్బందుల్లో ఉన్నానని అనుకున్నాని, కానీ వారు ఏమీ చేయలేదని అన్నారు. ఎందుకంటే ఇది వినడానికి ఉన్న శక్తి అని ఆయన అన్నారు.
అంతకుముందు రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, ఇజ్రాయిల్ స్పైవేర్ పెగాసస్ ద్వారా కాంగ్రెస్ నేతలపై నిఘా పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. మీడియాను, న్యాయవ్యవస్థను కబ్జా చేసి నియంత్రిస్తున్నారని, మైనారిటీలు, దళితులు, గిరిజనులపై దాడులుకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
India U18 Hockey Asia Cup Champion: జపాన్పై ఘన విజయం.. అండర్-18 హాకీ ఆసియా కప్ ఛాంపియన్గా భారత్
-
Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!
-
Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
-
Salim Kumar Passed Away : ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత.!
-
Spirit : ‘స్పిరిట్’ ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!