Rahul Gandhi: ఉగ్రవాదులు నన్ను చూశారు, నేను వారిని చూశాను.. కానీ వారు ఏం అనలేదు..
Rahul Gandhi at Cambridge: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కీలక విషయాలను వెల్లడించారు. తాను భారత్ జోడో యాత్రలో భాగంగా కాశ్మీర్ లో పర్యటించినప్పుడు జరిగిన ఓ సంఘటనను అక్కడ ఉన్నవారితో పంచుకున్నారు. ఉగ్రవాద ప్రభావం ఉండటం వల్ల కాశ్మీర్ లో యాత్ర చేయొద్దని భద్రతా బలగాలు తనను కోరాయని, అయితే తాను మాత్రం యాత్రను కొనసాగించేందుకు నిర్ణయించుకున్నానని చెప్పారు.
Read Also: Amazon Jungle: పురుగులు తింటూ, మూత్రం తాగుతూ.. 31 రోజులు అమెజాన్ అడవిలో బతుకుపోరాటం
Also Read
- Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
- Pakistan train speed: రైళ్ల వేగంలో భారత్ దూసుకెళ్తుంటే… పాకిస్తాన్ పరిస్థితి ఏంటి.?
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
ఆయన ‘ లర్నింగ్ టూ లిజన్ ఇన్ 21 సెంచరీ’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ఈ సమయంలో భారత్ జోడో యాత్రలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. నేను భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రజలతో మాట్లాడాలని అనుకున్నానని, కాశ్మీర్ లో యాత్ర జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి తన వద్దకు వచ్చి మాట్లాడాలని అనుకున్నారని, అతను ప్రజలు కష్టాలు తెలుసుకోవడానికి కాంగ్రెస్ నాయకులు కాశ్మీర్ వచ్చారా..? అని తనను అడిగాడని అన్నారు. కొద్ది సేపటి తర్వాత అతను దూరంగా ఉన్న కొందరు వ్యక్తల వైపు చూపుతూ.. వారంతా ఉగ్రవాదులు అని చెప్పాడని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదులు నన్ను చంపేస్తారని నేను ఇబ్బందుల్లో ఉన్నానని అనుకున్నాని, కానీ వారు ఏమీ చేయలేదని అన్నారు. ఎందుకంటే ఇది వినడానికి ఉన్న శక్తి అని ఆయన అన్నారు.
అంతకుముందు రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, ఇజ్రాయిల్ స్పైవేర్ పెగాసస్ ద్వారా కాంగ్రెస్ నేతలపై నిఘా పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. మీడియాను, న్యాయవ్యవస్థను కబ్జా చేసి నియంత్రిస్తున్నారని, మైనారిటీలు, దళితులు, గిరిజనులపై దాడులుకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ‘గిరిదర్శక్’గా ఉద్యోగాలు!
-
Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
Ashu Reddy Scam: డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంది!
-
The Paradise: ‘ఆయా షేర్’ తర్వాత అనిరుధ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్.. ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్కి డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!