Himanta Biswa Sarma: లవ్ జీహాద్, హిందువుల హత్యలను సెక్యులరిజం పేరుతో సమర్థించలేం..
Himanta Biswa Sarma: బీజేపీకి లౌకికవాదాన్ని నేర్పించవద్దని అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ సర్మ కాంగ్రెస్ పార్టీకి చురకలంటించారు. వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్న ఛత్తీస్గఢ్ లోని కవార్దా అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన బహిరంగ ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని సీఎం భూపేష్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో లవ్ జిహాద్, మతమార్పిడి సంఘటనలు పెరుగుతున్నాయని అన్నారు.
లవ్ జిహాద్, మతమార్పిడి, హిందువుల హత్యలను సెక్యులరిజం పేరుతో సమర్థించలేమని, ఛత్తీస్గఢ్ లో గిరిజనులు క్రైస్తవ మతంలోకి మారడానికి ప్రతీ రోజూ ప్రోత్సహిస్తున్నారని, ప్రజలు చట్టానికి వ్యతిరేకంగా గొంతెత్తిన సందర్భంలో భూపేష్ బఘేల్ తనను తాను లౌకికవాదిగా చెప్పుకుంటారని హిమంత విమర్శించారు.
Also Read
హిందువులను చంపడం లౌకికవాదమా..? ఈ దేశం హిందువులదే, ఇది హిందువులకే చెందుతుంది, మాకు సెక్యులరిజం భాష నేర్పకండి అంటూ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. రామ మందిరాన్ని కూల్చివేసిన తర్వాత బాబర్ మసీదు కట్టడాన్ని సెక్యులరిజం అనడం సరికాదని అన్నారు. మతమార్పిడులను సెక్యులరిజం అనరని, మాత కౌలస్య భూమిని అక్బర్ కి అప్పగించడం సెక్యులరిజం కాదు, మన లౌకిక భావనను బాబా సాహెబ్ అంబేద్కర్, హిందూ సంస్కృతి అందించాయని, సెక్యులరిజం అంటే లవ్ జిహాద్ కాదని ఆయన అన్నారు.
కాంగ్రెస్ బాబార్ ని పూజిస్తోంది, అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రామమందిరం నిర్మిస్తున్నామని, జనవరి నెలలో నిర్మాణం పూర్తవుతుందని హిమంత అన్నారు. కాంగ్రెస్ 60 ఏళ్లు అధికారంలో ఉంది కానీ ఏనాడు రామ మందిర నిర్మాణ అంశాన్ని ప్రస్తావించలేదని ఆయన ఆరోపించారు. ప్రధాని ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. లవ్ జిహాద్, మత మార్పిడి నుంచి ఛత్తీస్గఢ్ నుంచి రక్షించడానికి అక్బర్ కి వీడ్కోలు పలకాలని ప్రజలను కోరారు. బీజేపీకి ఓట్లు వేయాలని ప్రజలను కోరారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో