Bengaluru: వైద్య వృత్తికే మాయని మచ్చ.. భార్యకు అనస్థీషియా ఇచ్చి చంపిన డాక్టర్
- వైద్య వృత్తికే మాయని మచ్చ
- భార్యకు అనస్థీషియా ఇచ్చి చంపిన డాక్టర్
- బెంగళూరులో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వారిద్దరూ వైద్య వృత్తిలో ఉన్నారు. చూడచక్కని జంట. ఇంకేముంది పెళ్లితో చక్కని జంట అవుతుందని పెద్దవాళ్లు భావించారు. ఇద్దరికి గ్రాండ్గా వివాహం జరిపించారు. కానీ ఏడాది తిరగకుండానే భార్యను కాటికి పంపేశాడు దుర్మార్గుడు. ఈ దారుణ ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. వైద్య వృత్తికే మాయని మచ్చగా మిగిలిపోయింది.

Also Read
- Ayodhya Ram mandir: అయోధ్య రామాలయంలో "బంగారు రామచరితమానస్" మాయం.?
- China: భారత్, హిందూ మహాసముద్రమే టార్గెట్?.. 5,000 కి.మీ LPAR రాడార్తో చైనా కొత్త సవాల్
- Pani Puri: ఏందిరా ఇది.. పానీపూరీ కోసం 12 ఏళ్లుగా పోరాటం..
- Meta India notice: ఇన్స్టాగ్రామ్పై కేంద్రం సీరియస్.. బాలల లైంగిక దోపిడీ కంటెంట్ తొలగించాలని మెటాకు నోటీసులు
కృతికా రెడ్డి-మహేందర్ రెడ్డి ఇద్దరూ డాక్టర్లు. ఈ జంటకు గత ఏడాది మే 26న వివాహం జరిగింది. ఇద్దరూ కూడా విక్టోరియా ఆస్పత్రిలో వైద్యులుగా కొనసాగుతున్నారు. కృతికా రెడ్డి చర్మవ్యాధి నిపుణురాలు. ఏప్రిల్ 21న కృతికా రెడ్డి అనారోగ్యానికి గురైందని సమీపంలోని ఒక ఆస్పత్రికి తరలించాడు. డాక్టర్లు పరిశీలించి చనిపోయినట్లుగా ప్రకటించారు. కృతికా రెడ్డిది సహజ మరణంగా భావించి సమాధి కార్యక్రమాలు నిర్వహించారు.
ఇది కూడా చదవండి: Durgapur Student Rape: మమత ‘తల్లి’లాంటిది.. సీఎంకు క్షమాపణ చెప్పిన బాధితురాలి తండ్రి
కానీ మారతహళ్లి పోలీస్ స్టేషన్లో మాత్రం అసహజ మరణంగా కేసు నమోదైంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇంట్లో తనిఖీలు చేయగా కొన్ని ఇంజెక్షన్లు, వైద్య వస్తువులు లభించాయి. మరికొన్ని కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వస్తువులన్నిటినీ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు.
తాజాగా నివేదిక వెలుగులోకి వచ్చింది. దాదాపు 6 నెలల తర్వాత బాధితురాలి శరీరంలో శక్తివంతమైన మత్తుమందు ఉన్నట్లు నిర్ధారణ అయింది. కృతికారెడ్డిది సహజమరణం కాదని.. హత్యగా పేర్కొంది. దీంతో బాధిత తండ్రి తీవ్ర ఆవేదన చెందాడు.. తన అల్లుడు మత్తుమందు ఇచ్చి కుమార్తెను చంపాడని ఆరోపించి తిరిగి ఫిర్యాదు చేశాడు.
ఇది కూడా చదవండి: Trump: యుద్ధాలను ఆపడం ఇష్టం.. వచ్చే ఏడాది నోబెల్ రావొచ్చేమో!
మారతహళ్లి పోలీసులు వేగంగా రంగంలోకి దిగి అక్టోబర్ 14న నిందితుడు మహేందర్రెడ్డిని అరెస్టు చేశారు. నిందితుడు తన వైద్య నైపుణ్యాన్ని ఉపయోగించి సహజ మరణాన్ని చూపించాడని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు దురుద్దేశంతోనే భార్యను చంపినట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. అయితే కృతికారెడ్డి అనారోగ్య సమస్యలను దాచి పెట్టి పెళ్లి చేశారన్న కోపంతోనే మహేందర్రెడ్డి ఇలా చేసినట్లుగా సమాచారం.
తాజావార్తలు
-
T20 World Cup Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా..
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఐరన్ లెగ్.. తెరపైకి కొత్త డిమాండ్..
-
Indian Player: మూడో టీ20కి ఛాన్స్ కొట్టేసిన యువ క్రికెటర్.. ఇక ఇంగ్లాండ్కు చుక్కలే..
-
CM Chandrababu : కుప్పం నుంచే విజయదుందుభి.. మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి
-
YS Jagan : హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!