DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DMK vs TVK: తమిళనాడు రాజకీయాల్లో మరోసారి తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. టీవీకేకు చెందిన పలువురు నేతలు తమ చదువుల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తూ, డీఎంకే ఐటీ వింగ్ కొన్ని పత్రాలు మరియు అఫిడవిట్ ఆధారాలను సోషల్ మీడియాలో విడుదల చేసింది. చెన్నైలో ఈ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. కొత్తగా ఏర్పాటైన టీవీకే ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇవ్వాలని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా, తమిళనాడు విపక్షనేత ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు టీవీకే నేతలపై నేరుగా దాడి ప్రారంభించారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
విద్యార్హతలపై డీఎంకే ఆరోపణలు
డీఎంకే విడుదల చేసిన వివరాల ప్రకారం, టీవీకే తాంబరం నియోజకవర్గ అభ్యర్థి సి. విజయలక్ష్మి తనను బి.కామ్ గ్రాడ్యుయేట్గా ప్రచారం చేసుకున్నారని పేర్కొంది. అయితే ఆమె ఎన్నికల అఫిడవిట్ ప్రకారం కేవలం 12వ తరగతి వరకు మాత్రమే చదివినట్లు డీఎంకే ఆరోపిస్తోంది. ఈ విషయానికి సంబంధించిన పత్రాలను కూడా పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే ఎగ్మూర్ అభ్యర్థి ఎ. రాజమోహన్ తనను ‘బీటెక్ ఐటీ’ చదివిన వ్యక్తిగా ప్రచారం చేసుకున్నారని, కానీ అసలు ఆయన ‘బీఏ జర్నలిజం’ మాత్రమే పూర్తి చేశారని డీఎంకే ఆరోపించింది. దీనికి సంబంధించిన విద్యా పత్రాలను కూడా బయటపెట్టింది.
Also Read
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
- Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
‘డాక్టర్’ బిరుదులపై వివాదం
టీవీకేకు చెందిన మరికొందరు నేతల పేర్ల ముందు ‘డాక్టర్’ అనే పదాన్ని ఉపయోగించడంపైనా డీఎంకే ప్రశ్నలు లేవనెత్తింది. విరుదునగర్కు చెందిన కాలాంతక జగదీశ్వరి, జె. మొహమ్మద్ పర్వేజ్ తమ పేర్ల ముందు ‘డాక్టర్’ అని వాడుకుంటున్నారని, కానీ వారికి ఎలాంటి పీహెచ్డీ లేదా డాక్టరేట్ లేదని ఆరోపించింది. డీఎంకే ప్రకారం, జగదీశ్వరి కేవలం బీఎస్సీ మాత్రమే చదివారని, పర్వేజ్ బీఏ ఎల్ఎల్బీ వరకు మాత్రమే విద్యను అభ్యసించారని తెలిపింది. ప్రజలను ఆకట్టుకోవడానికి తప్పుడు బిరుదులను ఉపయోగిస్తున్నారని అధికార పార్టీ విమర్శిస్తోంది.
సీఎం విజయ్పై డీఎంకే తీవ్ర విమర్శలు
టీవీకే అభ్యర్థుల చదువుల విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించిన డీఎంకే, ఇలాంటి వ్యక్తులను మంత్రులు కూడా చేశారు అంటూ ముఖ్యమంత్రి విజయ్పై విమర్శలు గుప్పించింది. ప్రజలు ఇలాంటి “నకిలీ ప్రచారాలకు” మోసపోవద్దని సూచించింది..
టీవీకే స్పందన కోసం ఎదురుచూపులు
ఈ ఆరోపణలపై ఇప్పటివరకు టీవీకే అధికారికంగా స్పందించలేదు. దీంతో ఈ వివాదం తమిళనాడు రాజకీయాల్లో మరింత చర్చకు దారితీస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. డీఎంకే విడుదల చేసిన పత్రాలు, ఆరోపణలపై టీవీకే ఎలా స్పందిస్తుందో.. ముఖ్యమంత్రి విజయ్ ఎలాంటి కౌంటర్ ఇస్తారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
-
OTR: మూతపడ్డ CCI ఫ్యాక్టరీపై మళ్లీ రాజకీయ రగడ… బీఆర్ఎస్ భారీ స్కెచ్?
-
Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
-
Off The Record: చేవెళ్ల కాంగ్రెస్లో తీవ్ర స్థాయికి పాత, కొత్త వివాదం
-
Swarnagiri Gold Mine : జొన్నగిరి గోల్డ్ మైన్ ఇకపై ‘స్వర్ణగిరి గోల్డ్ మైన్’
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?