Dhruv Rathee: యూట్యూబర్ ధృవ్ రాఠీపై బీజేపీ నేత కేసు.. సమన్లు జారీ..
- యూట్యూబర్ ధృవ్ రాఠీపై పరువనష్టం కేసు..
- కేసు ఫైల్ చేసిన బీజేపీ నేత..
- సమన్లు జారీ చేసిన ఢిల్లీ కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhruv Rathee: ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చాలా ఫేమస్ అయిన ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠీ వరస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా ముంబైకి చెందిన బీజేపీ నేత సురేష్ కరంషీ నఖువా అతనిపై పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో ధృవ్ రాఠీకి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఓ వీడియోలో ఎలాంటి కారణాలు లేకుండా తనను ‘‘హింసాత్మక’’ వ్యక్తిగా ఆరోపణలు చేశాడని బీజేపీ నేత ఆరోపించారు. జులై 7న తన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిన “‘‘మై రిప్లై టూ గోడి యూట్యూబర్స్ ఎల్విష్ యాదవ్ ” అనే శీర్షికతో రాఠీ చేసిన వీడియోలో పరవు నష్టం కలిగించే వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన కేసు నమోదు చేశారు. తన పరువుకు నష్టం కలిగించినందుకు పరిహారంగా నఖువా రూ.20 లక్షలు డిమాండ్ చేశారు. ఈ కేసులో సాకేత్ కోర్టులోని జిల్లా జడ్జి గుంజన్ గుప్తా జూలై 19న ధ్రువ్ రాతీకి సమన్లు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Also: Puja Khedkar: పూజా ఖేద్కర్ మిస్సింగ్.. 5 రోజులుగా తెలియని జాడ!
Also Read
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
డిజిటల్ ప్లాట్ఫారమ్లో రెచ్చగొట్టే విధంగా రాథీ, నఖువాకు వ్యతిరేకంగా నిరాధారమైన వ్యాఖ్యలు చేశారని పిటిషన్ పేర్కొంది. యూట్యూబర్ తన ప్రతిష్టను దెబ్బతీసే ధోరణిని కలిగి ఉన్నారని బీజేపీ నాయకుడు ఆరోపించారు. ప్రధాన మంత్రి మోడీ తన అధికారిక నివాసంలో ‘‘అంకిత్ జైన్, సురేష్ నఖువా, తజిందర్ బగ్గా వంటి హింసాత్మక మరియు దుర్వినియోగ ట్రోలర్లతో సమావేశయ్యారని రాఠీ నకిలీ ఆరోపణలు చేశారని నఖువా ఆరోపించారు. ఈ వీడియో 24 మిలియన్ల వ్యూస్ దక్కించుకుందని, 2.3 మిలియన్స్ లైక్స్ వచ్చాయని, ఈ సంఖ్య పెరుగుతూనే ఉందని పిటిషన్ పేర్కొంది. యూట్యూబ్ లేదా ఎక్స్లో ధృవ్ రాఠీ ఏదైనా కంటెంట్ ట్వీట్ చేయడం, పోస్ట్ చేయడాన్ని నిరోధించాలని పిటిషన్లో కోరారు. నఖువా చేసిన అభ్యర్థనపై ధృవ్ రాఠీకి కోర్టు సమన్లు జారీ చేసింది. దీనిపై ఆగస్టు 6న తదుపరి విచారణ జరగనుంది.
మరోవైపు స్పీకర్ ఓం బిర్లా కుమార్తెకు వ్యతిరేకంగా ఎక్స్లో నకిలీ వార్తలు ప్రసారం చేశారనే ఆరోపణలపై ధృవ్ రాఠీకి మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ఈ పరువునష్టం కేసు వెలుగులోకి వచ్చింది. యూపీఎస్సీ పరీక్షలు రాయకుండానే అంజలి బిర్లా ఉత్తీర్ణత సాధించారని ధృవ్ రాఠీ పేరుతో ఉన్న పేరడీ అకౌంట్లో ఆరోపణలు చేశారు.
తాజావార్తలు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!