Dhruv Rathee: యూట్యూబర్ ధృవ్ రాఠీపై బీజేపీ నేత కేసు.. సమన్లు జారీ..
- యూట్యూబర్ ధృవ్ రాఠీపై పరువనష్టం కేసు..
- కేసు ఫైల్ చేసిన బీజేపీ నేత..
- సమన్లు జారీ చేసిన ఢిల్లీ కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhruv Rathee: ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చాలా ఫేమస్ అయిన ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాఠీ వరస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా ముంబైకి చెందిన బీజేపీ నేత సురేష్ కరంషీ నఖువా అతనిపై పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో ధృవ్ రాఠీకి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఓ వీడియోలో ఎలాంటి కారణాలు లేకుండా తనను ‘‘హింసాత్మక’’ వ్యక్తిగా ఆరోపణలు చేశాడని బీజేపీ నేత ఆరోపించారు. జులై 7న తన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిన “‘‘మై రిప్లై టూ గోడి యూట్యూబర్స్ ఎల్విష్ యాదవ్ ” అనే శీర్షికతో రాఠీ చేసిన వీడియోలో పరవు నష్టం కలిగించే వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన కేసు నమోదు చేశారు. తన పరువుకు నష్టం కలిగించినందుకు పరిహారంగా నఖువా రూ.20 లక్షలు డిమాండ్ చేశారు. ఈ కేసులో సాకేత్ కోర్టులోని జిల్లా జడ్జి గుంజన్ గుప్తా జూలై 19న ధ్రువ్ రాతీకి సమన్లు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Also: Puja Khedkar: పూజా ఖేద్కర్ మిస్సింగ్.. 5 రోజులుగా తెలియని జాడ!
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
డిజిటల్ ప్లాట్ఫారమ్లో రెచ్చగొట్టే విధంగా రాథీ, నఖువాకు వ్యతిరేకంగా నిరాధారమైన వ్యాఖ్యలు చేశారని పిటిషన్ పేర్కొంది. యూట్యూబర్ తన ప్రతిష్టను దెబ్బతీసే ధోరణిని కలిగి ఉన్నారని బీజేపీ నాయకుడు ఆరోపించారు. ప్రధాన మంత్రి మోడీ తన అధికారిక నివాసంలో ‘‘అంకిత్ జైన్, సురేష్ నఖువా, తజిందర్ బగ్గా వంటి హింసాత్మక మరియు దుర్వినియోగ ట్రోలర్లతో సమావేశయ్యారని రాఠీ నకిలీ ఆరోపణలు చేశారని నఖువా ఆరోపించారు. ఈ వీడియో 24 మిలియన్ల వ్యూస్ దక్కించుకుందని, 2.3 మిలియన్స్ లైక్స్ వచ్చాయని, ఈ సంఖ్య పెరుగుతూనే ఉందని పిటిషన్ పేర్కొంది. యూట్యూబ్ లేదా ఎక్స్లో ధృవ్ రాఠీ ఏదైనా కంటెంట్ ట్వీట్ చేయడం, పోస్ట్ చేయడాన్ని నిరోధించాలని పిటిషన్లో కోరారు. నఖువా చేసిన అభ్యర్థనపై ధృవ్ రాఠీకి కోర్టు సమన్లు జారీ చేసింది. దీనిపై ఆగస్టు 6న తదుపరి విచారణ జరగనుంది.
మరోవైపు స్పీకర్ ఓం బిర్లా కుమార్తెకు వ్యతిరేకంగా ఎక్స్లో నకిలీ వార్తలు ప్రసారం చేశారనే ఆరోపణలపై ధృవ్ రాఠీకి మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ఈ పరువునష్టం కేసు వెలుగులోకి వచ్చింది. యూపీఎస్సీ పరీక్షలు రాయకుండానే అంజలి బిర్లా ఉత్తీర్ణత సాధించారని ధృవ్ రాఠీ పేరుతో ఉన్న పేరడీ అకౌంట్లో ఆరోపణలు చేశారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!