Devendra Fadnavis: రాహుల్ గాంధీ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. దేవేంద్ర ఫడ్నవీస్ కౌంటర్ ఎటాక్
- మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపణలు..
- కాంగ్రెస్ను ప్రజలు తిరస్కరించారు, అందుకే ఈవీఎంలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు..
- రాహుల్ గాంధీ వైఫల్యాన్ని అంగీకరించలేని వ్యక్తి: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devendra Fadnavis: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ.. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లోని శరద్ పవార్ వర్గం, శివసేన (యూబీటీ) ఉద్ధవ్ వర్గాల కూటమి ఊహించని ఓటమిని చవి చూసిందని పేర్కొన్నారు. అలాగే, కాంగ్రెస్ను ప్రజలు తిరస్కరించారు, అందుకే వారు ఇప్పుడు ఈవీఎంలను తప్పుబడుతూ, ప్రజాస్వామ్య ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆయన ఆరోపించారు. మహారాష్ట్రలో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ ఈవీఎంలపై ప్రశ్నలు లేవనెత్తడం ప్రతిపక్ష పార్టీలకు అలవాటుగా మారిపోయిందని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ వైఫల్యాన్ని అంగీకరించలేని వ్యక్తి అని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు.
Read Also: Pakistan: పాక్కు ఉగ్రవాద నిరోధక కమిటీ వైస్ ఛైర్మన్ హోదా.. సభ్య దేశాలు అభ్యంతరం..
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు సరైనవేనా? అని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎన్సీపీలోని శరద్ పవార్ వర్గం, ఉద్ధవ్ థాకరే శివసేనల మహా వికాస్ అఘాడి కూటమి నవంబర్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు కేవలం 46 చోట్ల మాత్రమే విజయం సాధించింది. అప్పటి, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, బీజేపీల మహాయుతి కూటమి దాదాపు 235 సీట్లను కైవసం చేసుకుంది. ఇందులో భారతీయ జనతా పార్టీకి 132 స్థానాల్లో గెలిచింది. ఇది ఆ రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు అని చెప్పాలి.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!