Pakistan: పాక్కు ఉగ్రవాద నిరోధక కమిటీ వైస్ ఛైర్మన్ హోదా.. సభ్య దేశాలు అభ్యంతరం..
- ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన పాకిస్తాన్..
- పాక్కు ఉగ్రవాద నిరోధక కమిటీ వైస్ ఛైర్మన్ హోదా ఇచ్చిన యూఎన్ఎస్సీ..
- ఉగ్రవాద ఆంక్షల కమిటీ పగ్గాలను పాక్ దక్కించుకోవడంతో సభ్య దేశాలు అభ్యంతరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన పాకిస్థాన్కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో టెర్రర్ నిరోధక కమిటీకి వైస్ ఛైర్మన్ హోదాను కట్టబెట్టడం ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఇస్లామాబాద్కు తాలిబాన్ల ఆంక్షల కమిటీ బాధ్యతలను అప్పగించడంపై ప్రపంచ దేశాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇక, భద్రతా మండలి తీసుకున్న ఈ నిర్ణయాన్ని కౌన్సిల్లోని మిగిలిన సభ్యులు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. జనవరిలో జరగాల్సిన ఐక్యరాజ్య సమితి కమిటీల కేటాయింపు ప్రక్రియ కేవలం పాకిస్తాన్ డిమాండ్లపై ఏకాభిప్రాయం లేకపోవడంతోనే గత ఐదు నెలలు ఆలస్యమైందని అధికారులు తెలిపారు.
Read Also: Mini Countryman Electric JCW: మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ విడుదల.. సింగిల్ ఛార్జ్ తో 462KM రేంజ్
Also Read
కాగా, పాకిస్తాన్ మంకుపట్టు, అహేతుక డిమాండ్లపై భద్రతా మండలిలోని ఇతర సభ్యులు విసిగి పోయారని యూఎన్ అధికారులు చెప్పుకొచ్చారు. దీంతో ఉగ్రవాదంపై భారత్ను లక్ష్యంగా చేసే పాక్ ప్రయత్నాలకు ఇతర సభ్యులు సపోర్టు పలికేందుకు రెడీగా లేనట్లు సమాచారం. యూఎన్ఎస్సీ శాశ్వత సభ్యులు చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, అమెరికా ఏ కమిటీకీ కూడా నాయకత్వం వహించడానికి ఇష్టపడలేదు.. ఎందుకంటే ఆ దేశాలకు హోదాలతో పని లేదని పేర్కొన్నారు. ఈ దేశాలన్నీ ఏకాభిప్రాయంతో పని చేస్తాయని అధికారులు చెప్పుకొచ్చారు. అయితే, పాక్కు కేటాయించిన స్థానం అంత ముఖ్యమైనది కాదు.. కేవలం నామమాత్రం అయిందేనన్నారు. కానీ, ఉగ్రవాద ఆంక్షల కమిటీ పగ్గాలను దక్కించుకోవడం వల్ల ఇస్లామాబాద్, కాబుల్ మధ్య అభిప్రాయ భేదాలు తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు.
Read Also: Akhanda 2 : ‘అఖండ2’ టీజర్కు టైమ్ టూ డేట్ ఫిక్స్..
ఇక, తొలుత భద్రతా మండలిలోని ఆంక్షల కమిటీ, (నాన్-ప్రొలిఫరేషన్) ఆంక్షల కమిటీ, తాలిబాన్ కమిటీ, ఉగ్రవాద నిరోధక కమిటీల అధ్యక్ష పదవులను పాకిస్తాన్ డిమాండ్ చేయగా.. యూఎన్ఎసీ ఆ దేశానికి తాలిబాన్ కమిటీతో పాటు ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్ ఛైర్మన్ హోదాలను మాత్రమే కట్టబెట్టింది. పాక్ ఉగ్రవాదానికి అడ్డా అనేది అందరికి తెలిసిన విషయం.. ప్రపంచవ్యాప్తంగా 850 మంది వ్యక్తులను, సంస్థలను ఐరాస భద్రతా మండలి ఉగ్ర జాబితాలో చేర్చగా.. అందులో 146 మంది పాకిస్తానీయులే ఉన్నారు. 2008 ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్, జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్ లాంటి ఎంతో మంది టెర్రరిస్టులు పాకిస్తాన్ లోనే ఆశ్రయం పొందుతున్నారు.
తాజావార్తలు
-
Trump: మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Iran War: కువైట్ ఏయిర్పోర్ట్పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..
-
Bengal Politics: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రీటబ్రత.. మమత పార్టీలో కల్లోలం..
-
El Nino-Centre: ఎల్నినోపై కేంద్రం అప్రమత్తం.. భయాందోళన అక్కర్లేదని హామీ
-
Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
ట్రెండింగ్
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!