Dengue Vaccine : భారతదేశంలో తొలి స్వదేశీ డెంగ్యూ వ్యాక్సిన్..!
- డెంగ్యూకు స్వదేశీ పరిష్కారం.. డెంగిఆల్ ట్రయల్స్ ముగింపుదశలో
- 20 కేంద్రాల్లో 10 వేల మందిపై ఫేజ్ 3 ప్రయోగాలు
- టీకా భద్రత, సమర్థతపై రెండేళ్ల పాటు పర్యవేక్షణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dengue Vaccine : భారతదేశంలో డెంగ్యూ వ్యాధి నివారణలో మైలురాయిగా నిలిచే స్వదేశీ టెట్రావాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుంది. ‘డెంగిఆల్’ పేరుతో అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) సహకారంతో పనాసియా బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్లో ఉంది. ఇది నాలుగు డెంగ్యూ వైరస్ సెరోటైప్ల నుంచి రక్షణ కలిగించే లైవ్-అటెన్యూయేటెడ్ టీకా కావడం విశేషం.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ ట్రయల్స్లో అక్టోబర్ నాటికి దాదాపు 10,500 మంది వాలంటీర్లను నమోదు చేసే లక్ష్యం ఉంది. ఇప్పటికే పూణే, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, భువనేశ్వర్ సహా ఇతర నగరాల్లోని కేంద్రాల్లో 8,000 మందికి పైగా వాలంటీర్లు పాల్గొన్నారు. టీకా లేదా ప్లేసిబో ఇవ్వడమూ ఇందులో భాగం.
Also Read
- Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
- Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
- TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
- TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
AI Heros: మన హీరో హీరోయిన్లు ఇలా అయిపోతే.. అమ్మో.. ఆ ఊహే భయంకరం!
ఈ ట్రయల్స్ను పూణేలోని ICMR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ వైరాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం భారత్లో డెంగ్యూ వ్యతిరేకంగా లైసెన్స్ పొందిన ఏ టీకా అందుబాటులో లేనందున ఇది ఎంతో కీలకం.
డాక్టర్ మనోజ్ ముర్హేకర్ (NIE డైరెక్టర్) ప్రకారం, మొదటి, రెండో దశల ట్రయల్స్లో భద్రతాపరమైన ఎలాంటి సమస్యలు కనిపించలేదు. మూడో దశ ట్రయల్లో టీకా తీసుకున్నవారిని రెండేళ్లపాటు పర్యవేక్షించి, దీర్ఘకాలిక రోగనిరోధక శక్తిని అంచనా వేస్తారు.
2023లో ప్రారంభమైన ఈ మల్టీసెంటర్, డబుల్-బ్లైండ్, రాండమైజ్డ్, ప్లేసిబో నియంత్రిత ట్రయల్ తొలిగా రోహ్తక్లోని పండిట్ భగవత్ దయాళ్ శర్మ PGIMSలో ప్రారంభమైంది. ఈ టెట్రావాలెంట్ స్ట్రెయిన్ (TV003/TV005) అమెరికాలో అభివృద్ధి అయింది. ఇది బ్రెజిల్లో ట్రయల్స్లో మంచి ఫలితాలు చూపినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పనాసియా బయోటెక్ ఈ స్ట్రెయిన్ ఆధారంగా పూర్తి స్థాయి ఫార్ములేషన్ అభివృద్ధి చేస్తూ, ప్రాసెస్ పేటెంట్ను కూడా పొందింది.
డెంగ్యూ భారతదేశంలో ప్రధాన ప్రజారోగ్య సవాలుగా కొనసాగుతోంది. WHO ప్రకారం 2023 చివరినాటికి 129 దేశాల్లో డెంగ్యూ వ్యాప్తి ఉందని నివేదికలు వెల్లడించాయి. భారత్ టాప్ 30 దేశాల్లో ఒకటిగా ఉండగా, ఇక్కడి కేసులలో 75-80 శాతం లక్షణాలు లేకుండానే ఉంటాయి. అయినా దోమల ద్వారా వ్యాధి వ్యాప్తి అవకాశముంటుంది. పిల్లల్లో ఆసుపత్రి పాలవడం, మరణాలు నమోదు కావడం గమనార్హం. పెద్దవారిలో అయితే డెంగ్యూ హెమరాజిక్ ఫీవర్, షాక్ సిండ్రోమ్ వంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి.
2024లో ఇప్పటివరకు 2.3 లక్షల కేసులు, 297 మరణాలు నమోదవ్వగా, మార్చి వరకు మాత్రమే 12,000కి పైగా కేసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో డెంగిఆల్ వ్యాక్సిన్ భారతదేశానికి ఓ కీలక దిశను చూపనుంది.
ఈ వ్యాక్సిన్ విజయవంతమైతే, దేశీయంగా అభివృద్ధి అయిన తొలి టెట్రావాలెంట్ డెంగ్యూ టీకాగా చరిత్రలో నిలిచే అవకాశం ఉంది. దీని ద్వారా డెంగ్యూ నియంత్రణలో భారత ఆరోగ్య రంగం కొత్త దశలోకి అడుగుపెడుతుందన్న ఆశలు వెల్లువెత్తుతున్నాయి.
Samsung History: ఏంటి! శాంసంగ్ కంపెనీ మొదట్లో ఎండు చేపలు అమ్మిందా..? సంచలన విషయాలు…
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!