Samsung History: ఏంటి! శాంసంగ్ కంపెనీ మొదట్లో ఎండు చేపలు అమ్మిందా..? సంచలన విషయాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాంసంగ్ పేరు వినగానే మీ మదిలో ఏ ఫొటో వస్తుంది..? మొబైల్ ఫోన్, ఫ్రిజ్, టీవీ, గృహోపకరణాల కనిపిస్తాయి. కానీ.. ఈ కంపెనీ మొదట్లో ఏం చేసేది? అనే విషయం తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. శాంసంగ్ మార్చి 1, 1938న ప్రారంభమైంది. దాని వ్యవస్థాపకుడు లీ బైయుంగ్-చుల్. దక్షిణ కొరియాలోని డేగు నగరంలో ప్రారంభమైన కంపెనీ.. మొదట్లో ఎండిన చేపలు, పండ్లు, నూడుల్స్ విక్రయించే దుకాణాన్ని ప్రారంభించారు. అనంతరం రవాణా, రియల్ ఎస్టేట్, బీమా, బ్రూయింగ్ వంటి రంగాలలో విస్తరించింది.
READ MORE: Chicken: ఎక్స్ట్రా “చికెన్” కావాలన్నందుకు ఫ్రెండ్నే చంపేశాడు..
Also Read
- 200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
- Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
- Google Free Storage: గూగుల్ షాకింగ్ డెసిషన్.. ఫ్రీ స్టోరేజ్లో భారీ మార్పు.. కొత్త అకౌంట్లకు 5GB మాత్రమే!
- AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
1938లో దక్షిణ కొరియాలో లీ బైంగ్-చుల్ స్థాపించిన ఈ సంస్థ, మొదట్లో తన వ్యాపారాన్ని ఎండు చేపలు, కిరాణా సామాగ్రి, నూడుల్స్ అమ్మకాలతో ప్రారంభించింది. అయితే, కాలక్రమేణా శామ్సంగ్ తన వ్యాపార మార్గాన్ని మార్చుకుంది. 1969 నుంచి ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలోకి ప్రవేశించి, రేడియోలు, టెలివిజన్లు, గృహోపకరణాలు, టెలికమ్యూనికేషన్ ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించింది. మొదట్లో ఎండు చేపల వ్యాపారం చేసినప్పటికీ.. కాలక్రమేణా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీగా ఎదిగింది. 1987లో మరణించే వరకు లీ బైంగ్-చుల్ కంపెనీకి నాయకత్వం వహించారు. ఇప్పుడు మనవరాళ్ళు ప్రొఫెషనల్ మేనేజర్లతో కలిసి శామ్సంగ్ గ్రూప్ను నిర్వహిస్తున్నారు.
READ MORE: Pilot Project: ఏపీలో మరో పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం.. 10 నిమిషాల్లో పని పూర్తి!
ఇదిలా ఉండగా.. తాజాగా శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ల శ్రేణిని కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. ఈ లైనప్లో ‘గెలాక్సీ Z ఫోల్డ్7’, ‘గెలాక్సీ Z ఫ్లిప్7’, ‘గెలాక్సీ Z ఫ్లిప్7 FE’ ఉన్నాయి. కంపెనీ తన ‘గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్’లో వీటిని ఆవిష్కరించింది. గతేడాది విడుదల చేసిన ‘గెలాక్సీ Z ఫోల్డ్ 6’, ‘Z ఫ్లిప్ 6’కు కొనసాగింపుగా వీటిని ప్రారంభించింది. అయితే ఈసారి వీటిని మరింత స్లిమ్ డిజైన్లో తీసుకొచ్చింది. భారత మార్కెట్లో వీటి ధరలను ప్రకటించడంతో పాటు ప్రీ-బుకింగ్లను కూడా ప్రారంభించింది. ‘గెలాక్సీ Z ఫోల్డ్7’ రూ.1,74,999 నుంచి ప్రారంభమవుతుంది. ‘గెలాక్సీ Z ఫ్లిప్7’ రూ.1,09,999 నుంచి ప్రారంభమవుతుంది. మరింత సరసమైన ‘గెలాక్సీ Z ఫ్లిప్7 FE’ ధర రూ.89,999 నుంచి లభిస్తుంది.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..