Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Badlapur Encounter Sparks Blame Game How Handcuffed Accused Opened Fire

Badlapur encounter: బద్లాపూర్ రేప్ నిందితుడి ఎన్‌కౌంటర్.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారిన అంశం..

Published Date :September 24, 2024 , 1:56 pm
By Venu Goapl Reddy
  • బద్లాపూర్ రేప్ నిందితుడి ఎన్‌కౌంటర్..
  • ఇద్దరు చిన్నారులపై నిందితుడి అత్యాచారం..
  • గత నెలలో మహారాష్ట్రలో సంచలనంగా మారిన ఘటన..
  • పారిపోతున్న క్రమంలో ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులు..
  • నిందితుడు అక్షయ్ షిండే మృతిపై రాజకీయ దుమారం..
Badlapur encounter: బద్లాపూర్ రేప్ నిందితుడి ఎన్‌కౌంటర్.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారిన అంశం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Badlapur encounter: బద్లాపూర్ అత్యాచార నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. నిందితుడిని వాహనంలో తీసుకెళ్తుండగా.. అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ నీలేష్ మోర్ పిస్టల్ లాక్కుని ఎస్కార్ట్ పోలీసుల నుంచి పారిపోయిందుకు ప్రయత్నించాడని, ఈ నేపథ్యంలో ముగ్గురు పోలీసులకు కారణమయ్యాయని పోలీసులు వెల్లడించారు. బద్లాపూర్ పాఠశాలలో ఇద్దరు మైనర్ బాలికను లైంగికంగా వేధించిన స్వీపర్ అక్షయ్ షిండే ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఈ లైంగిక వేధింపుల ఘటన ఆగస్టులో బద్లాపూర్ రైల్వే స్టేషన్‌లో తీవ్ర నిరసనకు కారణమైంది. కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసు వెలుగులోకి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది.

ఇదిలా ఉంటే, ఈ ఎన్‌కౌంటర్ మహారాష్ట్రలో పొలిటికల్ వార్‌కి దారి తీసింది. ముఖ్యంగా కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్ పవార్) పార్టీలు అధికార బీజేపీ-శివసేన ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. మహారాష్ట్ర ఎన్నికలకు కొన్ని రోజుల ముందు, ఈ ఎన్‌కౌంటర్ ప్రజల దృష్టిని మళ్లించడానికి అని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఘటన జరిగిన స్కూల్ బీజేపీ నాయకుడి యాజమాన్యంలో ఉందనే రుజువల్ని నాశనం చేయడానికి ఈ ఎన్‌కౌంటర్ చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి.

Read Also: Bengaluru chilling murder: ఫ్రిజ్‌లో, సూట్‌కేసులో 50 ముక్కలుగా మహాలక్ష్మీ శరీరం.. అష్రాఫ్‌పై భర్త అనుమానం..

మహారాష్ట్ర మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ నేత అనిల్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ.. చేతికి సంకెళ్లు ఉన్న వ్యక్తి ఎలా కాల్పులు జరిపాడని ప్రశ్నించారు. ఈ ఘటనపై రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మాట్లాడుతూ.. ఈ రోజు మహారాష్ట్రలో చట్టం అమలు, న్యాయవ్యవస్థ పూర్తిగా విచ్చినమైందని అన్నారు. కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ దీనిని ‘‘మహారాష్ట్ర పోలీసులకు బ్లాక్ డే’’గా అభివర్ణించారు. అది ఎన్‌కౌంటర్ అని ఎవరూ నమ్మరు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ జరిపించాలని చవాన్ డిమాండ్ చేశారు. నిందితుడి తల్లిదండ్రులు ఎన్‌కౌంటర్‌ బూటకమని ఆరోపించారు. ఇందులో పెద్ద కుట్ర దాగి ఉందని షిండే తల్లిదండ్రులు అన్నారు. తన కొడుకు క్రాకర్స్, రోడ్డు దాటడానికి కూడా భయపడుతాడని, అలాంటి వాడు ఎలా పోలీసులపై కాల్పులు జరుపుతాడంటూ ప్రశ్నించారు.

అయితే, ప్రతిపక్షాల ఆరోపణలపై బీజేపీ, అధికార శివసేన ఘాటుగా స్పందించాయి. అత్యాచార నిందితుడికి ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతున్నాయని ఆరోపించారు. పోలీసులపై దాడి చేశాడు, అయినా కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, అక్షయ్ షిండేను ఉరితీయాలని ప్రతిపక్షాలే డిమాండ్ చేశాయి, ఇప్పుడు ఎన్‌కౌంటర్‌లో మరణిస్తే అతడికి అనుకూలంగా మాట్లాడుతున్నారని శివసేన ఎంపీ నరేష్ మాస్కే అన్నారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా ప్రతిపక్షాల విమర్శలపై ధ్వజమెత్తాడు. ప్రతిపక్షాలు తమ ప్రభుత్వ లడ్కీ బహిన్ పథకం విజయవంతం కావడంతో భయపడుతున్నాయని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Badlapur encounter
  • Badlapur Rape Case
  • bjp
  • congress
  • Maharashtra

తాజావార్తలు

  • Hormuz: హార్ముజ్‌పై బ్రిటన్-ఫ్రాన్స్ కొత్త వ్యూహం.. ట్రంప్‌నకు ఎదురుదెబ్బేనా?

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • CM Revanth Reddy: డీలిమిటేషన్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

  • 430 సీసీ కెమెరాలు, 2000 పోలీసుల గస్తీ మధ్య ఉప్పల్ వేదికగా SRH vs RR మ్యాచ్..!

  • Trisha: నటి త్రిష ఇంటికి బాంబ్ బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్స్ తనిఖీలు

ట్రెండింగ్‌

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions