Delhi Weather: ఢిల్లీని గజగజలాడిస్తున్న చలి.. వేసవిలో 6 ఏళ్ల నాటి రికార్డ్ బద్దలు
- ఢిల్లీని గజగజలాడిస్తున్న చలి
- ఆహ్లాదకరంగా మారిన వాతావరణం
- వేసవిలో 6 ఏళ్ల నాటి రికార్డ్ బద్దలు
దేశ రాజధాని ఢిల్లీలో విచిత్రమైన వాతావరణం నెలకొంది. రెండ్రోజుల క్రితం వరకు ఎండలు మండిపోయాయి. బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోయారు. అంతగా వేడిగాలులతో నగర వాసులు ఇబ్బందిపడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. రెండు రోజుల నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోయింది. దీంతో చల్లని గాలులు వీచడంతో ఉల్లాస భరితంగా మారిపోయింది.
ఎప్పుడూ మార్చి నెలలో ఢిల్లీలో తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడిపోయి నగర వాసులు.. తాజాగా చలి యూ-టర్న్ తీసుకోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉష్ణోగ్రత 21.7 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. దీంతో 2020 మార్చి 8 నాటి రికార్డును మార్చి 20న ఆరేళ్ల తర్వాత బద్దలైంది. రెండు రోజుల నుంచి సాధారణం కంటే 22 శాతం అధిక వర్షపాతం నమోదు కావడంతో వాతావరణంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.
Also Read
- NDMA: మే 2న లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి సైరన్.. ఎందుకంటే?
- M. K. Stalin: "కష్టపడ్డాం.. ఫలితం దక్కుతుంది".. ఎగ్జిట్ పోల్స్పై సీఎం స్టాలిన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
- Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
- Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!
సహజంగా మార్చి నెలలో ఢిల్లీలో తీవ్రమైన వేడి గాలులు ఉంటాయి. అధిక విద్యుత్ అవసరం ఉంటుంది. ఫ్యాన్లు, ఏసీలు ఎక్కువ వాడడంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతుంది. కానీ ప్రకృతిలో అకస్మాత్తుగా మార్పులు రావడంతో తిరిగి దుప్పట్లు, కంబళ్లు బయటకు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈసారి ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ నుంచి భారతదేశం వరకు దాదాపు 1,000 కిలోమీటర్ల మేర ఒక సరళ ద్రోణిని విస్తరించి ఉంది. అంతేకాకుండా ఎత్తైన ప్రదేశాల్లోని మంచు గాలులు, అనేక చిన్న, పెద్ద తుఫాను వలయాల కలయిక వాతావరణాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఈ కారణంగానే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని పర్వత ప్రాంతాల్లో భారీ హిమపాతం కురుస్తుండగా.. ఢిల్లీతో సహా మైదాన ప్రాంతాల్లో వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తున్నాయి.
ఇక మార్చి 21 నుంచి ఆకాశం క్రమంగా ఉంటుందని.. సూర్యుడు యధావిధిగా ప్రకాశిస్తాడని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి 22వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు మళ్లీ పెరగడం ప్రారంభమవుతాయని.. మార్చి 23 నుంచి 26వ తేదీ మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు 30 నుంచి 33 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటాయని అంచనా వేసింది.
#WATCH | Uttar Pradesh: A layer of fog hovers over Noida this morning. Visuals from Sector 122. pic.twitter.com/oTlXtzzJ52
— ANI (@ANI) March 21, 2026
తాజావార్తలు
-
Ticket Inspector: టికెట్ ఇన్ స్పెక్టర్ పై కండక్టర్ చెప్పుతో దాడి చేసిన ఘటనలో ట్విస్ట్..
-
CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Shubman Gill: స్టేడియంలో కోహ్లీ-గిల్ మధ్య ఉద్రిక్తత.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఇన్స్టా పోస్ట్ వైరల్..
-
NDMA: మే 2న లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి సైరన్.. ఎందుకంటే?
-
Weather Updates in Regional Languages: రైతులకు గుడ్న్యూస్.. ఇక ప్రాంతీయ భాషల్లోనే వాతావరణ సమాచారం..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!