Delhi Air Pollution: ఢిల్లీ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న వాయు కాలుష్యం
- ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం..
- ఈరోజు 300కి చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్..
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తున్నాయని తెలిపిన ఢిల్లీ వాసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయి ఒక రోజు పెరుగుతూ.. మరో రోజు తగ్గుతూ కనిపిస్తుంది. ఈరోజు ( నవంబర్ 28) ఉదయం మరోసారి హస్తినలో కాలుష్య స్థాయి ఏక్యూఐ 300కి చేరిపోయింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత చాలా తక్కువ కేటగిరీలో కొనసాగుతుందని చెప్పుకొచ్చింది. ఇండియా గేట్ దగ్గర భారీగా పొగమంచు కమ్ముకోగా.. కాళింది కుంజ్లోని యమునా నదిలో విషపు నురుగు భారీగా తేలియాడుతోందని పేర్కొనింది.
Read Also: PCB Chief Mohsin Naqvi: పాకిస్థాన్లో భారత్ క్రికెట్ ఆడకపోవడం ఆమోదయోగ్యం కాదు..
Also Read
- IIT Deaths: ఐఐటీల్లో ఈ చావులు వెనుక ఉన్న కారణాలేంటి? విద్యార్థులను బలి తీసుకుంటుంది ఎవరు?
- NEET Counselling 2026: NEET కౌన్సెలింగ్ తొలి విడతలో సీటు రాకపోవడంతో.. 21 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
ఇక, గాలి కాలుష్యం వల్ల కంటి నొప్పులు, గొంతు సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తున్నాయని పలువురు బాధితులు చెప్తున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో కురుస్తున్న పొగ మంచు.. ప్రజలపై సూర్య కిరణాలు పడకుండా అడ్డుకుంటుంది. దీని ఫలితంగా శరీరంలోని ఎముకలు బలహీనంగా మారిపోతున్నాయని ఎయిమ్స్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. సూర్యకాంతి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు మనవ శరీరంలో 90 శాతం విటమిన్ డి3 ఉత్పత్తికి మూల కారణంగా అని తెలిపింది. భారీగా కురుస్తున్న పొగమంచు శీతాకాలంలో సూర్యరశ్మి నేరుగా భూమిని చేరుకోకుండా నిలువరిస్తుందన్నారు.
Read Also: Crime News: జార్ఖండ్లో దారుణం.. లవర్ను చంపి 50 ముక్కలుగా నరికేశాడు..
అయితే, ఎయిమ్స్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ, గురుగ్రామ్లలో పలువురిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్లు చెప్పుకొచ్చారు. ఢిల్లీలో పొగ మంచు వల్ల ప్రజలపై సూర్యరశ్మి తక్కువగా పడుతుంది.. దీంతో చాలామంది విటమిన్ డి లోపం బారిన పడుతున్నారని నివేదికలో తేలింది. ఢిల్లీలో అంతకంతకూ గాలి కాలుష్య స్థాయి పెరగడం.. పొగమంచు సమస్య తీవ్రతరమైందన్నారు. ఈరోజు దేశ రాజధానిలో దట్టమైన పొగమంచు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావారణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తాజావార్తలు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!