Delhi Air Pollution: ఢిల్లీ ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న వాయు కాలుష్యం
- ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం..
- ఈరోజు 300కి చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్..
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తున్నాయని తెలిపిన ఢిల్లీ వాసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య స్థాయి ఒక రోజు పెరుగుతూ.. మరో రోజు తగ్గుతూ కనిపిస్తుంది. ఈరోజు ( నవంబర్ 28) ఉదయం మరోసారి హస్తినలో కాలుష్య స్థాయి ఏక్యూఐ 300కి చేరిపోయింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత చాలా తక్కువ కేటగిరీలో కొనసాగుతుందని చెప్పుకొచ్చింది. ఇండియా గేట్ దగ్గర భారీగా పొగమంచు కమ్ముకోగా.. కాళింది కుంజ్లోని యమునా నదిలో విషపు నురుగు భారీగా తేలియాడుతోందని పేర్కొనింది.
Read Also: PCB Chief Mohsin Naqvi: పాకిస్థాన్లో భారత్ క్రికెట్ ఆడకపోవడం ఆమోదయోగ్యం కాదు..
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
ఇక, గాలి కాలుష్యం వల్ల కంటి నొప్పులు, గొంతు సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తున్నాయని పలువురు బాధితులు చెప్తున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో కురుస్తున్న పొగ మంచు.. ప్రజలపై సూర్య కిరణాలు పడకుండా అడ్డుకుంటుంది. దీని ఫలితంగా శరీరంలోని ఎముకలు బలహీనంగా మారిపోతున్నాయని ఎయిమ్స్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. సూర్యకాంతి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు మనవ శరీరంలో 90 శాతం విటమిన్ డి3 ఉత్పత్తికి మూల కారణంగా అని తెలిపింది. భారీగా కురుస్తున్న పొగమంచు శీతాకాలంలో సూర్యరశ్మి నేరుగా భూమిని చేరుకోకుండా నిలువరిస్తుందన్నారు.
Read Also: Crime News: జార్ఖండ్లో దారుణం.. లవర్ను చంపి 50 ముక్కలుగా నరికేశాడు..
అయితే, ఎయిమ్స్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ, గురుగ్రామ్లలో పలువురిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్లు చెప్పుకొచ్చారు. ఢిల్లీలో పొగ మంచు వల్ల ప్రజలపై సూర్యరశ్మి తక్కువగా పడుతుంది.. దీంతో చాలామంది విటమిన్ డి లోపం బారిన పడుతున్నారని నివేదికలో తేలింది. ఢిల్లీలో అంతకంతకూ గాలి కాలుష్య స్థాయి పెరగడం.. పొగమంచు సమస్య తీవ్రతరమైందన్నారు. ఈరోజు దేశ రాజధానిలో దట్టమైన పొగమంచు కురిసే ఛాన్స్ ఉందని భారత వాతావారణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!