PCB Chief Mohsin Naqvi: పాకిస్థాన్లో భారత్ క్రికెట్ ఆడకపోవడం ఆమోదయోగ్యం కాదు..
- భారత్పై విరుచుకుపడిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ..
- టీమిండియా పాకిస్థాన్ లో క్రికెట్ ఆడకపోతే.. భారత్ వెళ్లి పాక్ ఆడటం సాధ్యం కాదు..
- 2025 ఛాంపియన్స్ టోర్నమెంట్ మొత్తం పాకిస్థాన్ లోనే జరుగుతుంది: పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PCB Chief Mohsin Naqvi: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మరోసారి భారత్పై విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ లోనే టోర్నమెంట్ మొత్తం జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం.. ఈ విషయాన్ని ఇప్పటికే ఐసీసీ ఛైర్మన్కు తెలియజేసినట్లు ఆయన తెలిపారు. భారతదేశం ఇక్కడ క్రికెట్ ఆడకపోతే.. పాకిస్తాన్ కూడా ఇండియాకు వెళ్లి ఆడటం సాధ్యం కాదని వెల్లడించారు. ఇక, మేము చెప్పాల్సింది మొత్తం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కు చాలా స్పష్టంగా చెప్పాం.. ఆ తరువాత ఏం జరుగుతుందో అనేది వేచి చూడాలని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చెప్పుకొచ్చారు.
Read Also: Crime News: జార్ఖండ్లో దారుణం.. లవర్ను చంపి 50 ముక్కలుగా నరికేశాడు..
Also Read
ఇక, 2023 వన్డే ప్రపంచ కప్ కోసం పాకిస్థాన్ జట్టు భారత్కు వెళ్లినప్పటికీ.. ఇంకా ఇరు దేశాల మధ్య రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ నఖ్వీ పేర్కొన్నారు. దీన్ని సాకుగా చూపించి పాక్ లో నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ రాకపోవడం మంచి పద్దతి కాదన్నారు. ఇప్పటికే పాకిస్థాన్కు వెళ్లకూడదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నుంచి తమకు ఎలాంటి వ్రాతపూర్వక సమాచారం అందలేదని ఆయన ధృవీకరించారు. కాగా, వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్కు 8 జట్ల షెడ్యూల్ను ఖరారు చేసేందుకు ఐసీసీ రేపు (నవంబర్ 29) బోర్డు సమావేశాన్ని నిర్వహించనుంది.
Read Also: Israel: అరెస్టు వారెంట్ను క్యాన్సిల్ చేయండి.. అంతర్జాతీయ కోర్టుకు ఇజ్రాయెల్
అయితే, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్థాన్ కలిగి ఉంది. కానీ, పాక్ లో ఆడేందుకు తమ క్రికెట్ జట్టును పంపకూడదని భారత్ తీసుకున్న నిర్ణయం ప్రతిష్టంభనను సృష్టించింది. కొన్ని మ్యాచ్లను తటస్థ వేదికలో నిర్వహిస్తే.. టోర్నమెంట్ లో పాల్గొంటామని బీసీసీఐ తేల్చి చెప్పింది. దీంతో హైబ్రిడ్ మోడల్ను స్వీకరించకూడదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మొండి వైఖరి ప్రదర్శిస్తుంది. భారతదేశం యొక్క భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని ఇప్పటికే PCB చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చెప్పుకొచ్చారు. కానీ, పాకిస్థాన్ లో క్రికెట్ ఆడేందుకు టీమిండియా సిద్ధంగా లేదని బీసీసీఐ మరోసారి తెలిపింది.
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!