Delhi: కేజ్రీవాల్కు ఎల్జీ షాక్.. సీఎం ప్రతిపాదన తోసిపుచ్చిన వీకే.సక్సేనా
- కేజ్రీవాల్కు లెఫ్టినెంట్ గవర్నర్ షాక్
- సీఎం ప్రతిపాదన తోసిపుచ్చిన వీకే సక్సేనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం-లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనా మధ్య వార్ మరింత ముదురుతోంది. ఇప్పటికే ఇరువర్గాల మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. తాజాగా ఎల్జీ తీసుకున్న నిర్ణయంతో ఆ జ్వాలలు మరింత రేకెత్తిస్తున్నాయి. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు తనకు బదులుగా మంత్రి అతిషిచే జరిగించాలని లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు జైలు నుంచి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ రాశారు. అయితే ఎల్జీ మాత్రం అందుకు భిన్నంగా హోంమంత్రి కైలాష్ గహ్లాట్ను ఎంపిక చేశారు. ఈ పరిణామం ఆప్కు పుండిమీద కారం చల్లినట్లుగా అయింది. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ రాసిన లేఖ అందలేదని రాజ్భవన్ కార్యాలయం తెలిపింది. మరోవైపు ఈ విధంగా కేజ్రీవాల్ లేఖ రాయడం ముఖ్యమంత్రి అధికారాలను దుర్వినియోగం చేయడమేనని తీహార్ జైలు అధికారులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Mars: అంగాకరకుడి ఉపరితలం కింద నీరు..? ఇన్సైట్ ల్యాండర్ కీలక డేటా..
Also Read
- TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్పై స్పీకర్ కీలక చర్య
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
జాతీయ జెండా ఆవిష్కరణకు హోంమంత్రి గహ్లాట్ను ఎంపిక చేసినట్లు మంగళవారం సాయంత్రం రాజ్భవన్ కార్యాలయం తెలిపింది. హోం మంత్రి కైలాష్ గహ్లాట్ను నామినేట్ చేయడం సంతోషంగా ఉందని సక్సేనా అన్నారు.
లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ తీహార్ జైల్లో ఉంటున్నారు. మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. దీంతో ఆయన అప్పటి నుంచి తీహార్ జైల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 15న జాతీయ జెండాను మంత్రి అతిషి చేత ఆవిష్కరించాలని ఎల్జీకి కేజ్రీవాల్ లేఖ రాశారు. ఈ లేఖ మీడియాకు అందింది. అయితే జైలు నిబంధనల ప్రకారం అధికారాల దుర్వినియోగానికి సంబంధించిన లేఖ అని.. అందుకే లెఫ్టినెంట్ గవర్నర్కు పంపలేదని జైలు అధికారులు ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు చెప్పారు.
ఇది కూడా చదవండి: Harish Shankar: మిస్టర్ బచ్చన్ ట్రూ ఇన్సిడెంట్.. ఎక్కడా లొంగలేదు: డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంటర్వ్యూ
Delhi LG nominates Delhi Home Minister Kailash Gahlot to hoist the national flag on 15th August 2024, at the Chhatrasal Stadium event pic.twitter.com/5C5CYwuXd0
— ANI (@ANI) August 13, 2024
తాజావార్తలు
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
-
Apple Mac mini M6: ఆపిల్ కొత్త Mac mini M6, Mac Studio M5 Max, M5 Ultra విడుదల.. 2nm చిప్, AI పవర్! ధర ఎంతంటే?
-
భారత్లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
-
Best Mileage Bikes: లీటర్కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!