Kejriwal: కేజ్రీవాల్ ఎన్నికల్లో పోటీ చేయొద్దనడానికి మీరెవరు? పిటిషనర్కు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు
- కేజ్రీవాల్ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలని పిటిషన్
- ఈ వ్యాజ్యమే పూర్తిగా తప్పు అన్న ఢిల్లీ హైకోర్టు
- పిటిషనర్కు న్యాయస్థానం చీవాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలని కోరుతూ పిల్ వేసిన పిటిషనర్కు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు పెట్టింది. అసలు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యమే పూర్తిగా తప్పు అని ధర్మాసనం పేర్కొంది.
ఆమ్ ఆద్మీ పార్టీ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. అలాగే కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, దుర్గేష్ పాఠక్లను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలన్న డిమాండ్ను కూడా కోర్టు తిరస్కరించింది.ఈ పిటిషన్ పూర్తిగా అపార్థంపై ఆధారపడి ఉందని.. దీనికి ఎలాంటి అర్హత లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
Also Read
- Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
- Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
- Jantar Mantar: జంతర్ మంతర్లో నిరసనలు అవసరమా? ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
- Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
కఠినమైన వ్యాఖ్యలు
విచారణ సమయంలో ఒక రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ను రద్దు చేయమని ఎన్నికల కమిషన్ (ECI)ని ఆదేశించడానికి ఏదైనా నిబంధన ఉందా అని కోర్టు పిటిషనర్ న్యాయవాదిని అడిగింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలో అటువంటి స్పష్టమైన నిబంధన ఏదీ లేదని న్యాయవాది అంగీకరించారు. కొంతమంది పార్టీ నాయకుల ప్రవర్తనపై అభ్యంతరాల కారణంగా ఒక పూర్తి రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ను ఎలా రద్దు చేయగలరని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ పిటిషన్ ఏ నిర్దిష్ట చట్టపరమైన నిబంధనపై ఆధారపడి ఉందని కూడా కోర్టు నిలదీసింది.
రాజకీయ నాయకులు కోర్టు విచారణలను బహిష్కరించడం, తదనంతరం పత్రికా సమావేశాలు నిర్వహించడం ‘‘రాజ్యాంగ విరుద్ధం’’ అని, కోర్టును అవమానించడమేనని పిటిషనర్ వాదించారు. ఎవరైనా కోర్టు ధిక్కరణకు పాల్పడితే.. కోర్టు ధిక్కరణ చట్టం కింద పరిహారం పొందవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకానీ ఒక వ్యక్తి ధిక్కారానికి పాల్పడినట్లు రుజువైనంత మాత్రాన.. అతడిని ఎన్నికలలో పోటీ చేయకుండా ఆటోమేటిక్గా నిషేధించలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది.
అసలేం జరిగిందంటే…
గత ఫిబ్రవరి 27న ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ సహా పలువురిని నిర్దోషులుగా తేల్చుతూ ట్రయల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అయితే కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. అయితే ఈ పిటిషన్ జస్టిస్ స్వర్ణ కాంత శర్మ దగ్గరకు వెళ్లింది. అయితే స్వర్ణ కాంత శర్మ ఆర్ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ ఉన్న న్యాయమూర్తి అని.. ఆమె వల్ల తమకు న్యాయం జరగదని.. దీంతో విచారణకు హాజరు కాబోమని కేజ్రీవాల్, సిసోడియా తేల్చి చెప్పారు. దీంతో కోర్టు ధిక్కరణ కింద పార్టీని, కేజ్రీవాల్ను బహిష్కరించాలని పిటిషన్ వేయగా.. న్యాయస్థానం కొట్టేసింది.

తాజావార్తలు
-
Vishwanath and Sons Trailer: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ టాక్.. సూర్య-మమితా కెమిస్ట్రీ అదుర్స్.!
-
Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
-
Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్కు కృష్ణా జలాలు
-
Ritika Nayak : ‘కొరియన్ కనకరాజు’తో జాక్పాట్.. టాలీవుడ్కు కొత్త గోల్డెన్ లెగ్గా రితికా నాయక్.!
-
Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!