Om Birla: లోక్సభ స్పీకర్ కుమార్తెకు ఊరట.. నెటిజన్ల ట్రోల్స్ తొలగించాలని హైకోర్టు ఆదేశం
- లోక్సభ స్పీకర్ కుమార్తె ఐఆర్పీఎస్ అధికారిణిగా ఎంపిక కావడంపై ట్రోల్స్
- తండ్రిని అడ్డంపెట్టుకుని తొలి ప్రయత్నంలోనే జాబ్ సంపాదించిందని ఆరోపణలు
- ట్రోల్స్పై హైకోర్టులో పిటిషన్... తొలగించాలని ఆదేశం
యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి ఉద్యోగం సంపాదించడంపై పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. లోక్సభ స్పీకర్ కుమార్తె కాబట్టి ఏదైనా సాధ్యమేనంటూ విపరీతంగా ఆమెపై నెట్టింట ట్రోల్స్ నడిచాయి. తండ్రిని అడ్డంపెట్టుకుని ఐఆర్పీఎస్ అధికారిణిగా అంజలి ఎంపిక అయిందంటూ ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె మంగళవారం ఉదయం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తన పరువుకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారంటూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా చేశారు. నిరాధార పోస్టుల్ని వెంటనే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ కేసులో ప్రతివాదులుగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గూగుల్, ఎక్స్ (ట్విట్టర్), ఇతరు సంస్థలను చేర్చారు. తాజాగా ఆమె అభ్యర్థనను న్యాయస్థానం స్వీకరించి ఆదేశాలు జారీ చేసింది. 24 గంటల్లో కామెంట్లు తొలగించాలని సోషల్ మీడియా సంస్థలకు ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Union Budget 2024: స్మార్ట్ఫోన్ కొనాలనే వారికి శుభవార్త.. ఆ ఫోన్లకు కస్టమ్స్ సుంకం తగ్గింపు
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
ఓం బిర్లా కుమార్తెకు పరువు నష్టం కలిగించే పోస్ట్లను 24 గంటల్లోగా తొలగించాలని గూగుల్, ఎక్స్ మరియు ఇతర సంస్థలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్లో పనిచేస్తున్న అంజలి… తన తండ్రి హోదాను అడ్డంపెట్టుకుని అవినీతికి పాల్పడి యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించిందని ఆమెపై పోస్టులు పెట్టారు. యూపీఎస్సీ పరీక్షలు రాసేంత వరకు ఆమె రీల్స్ చేస్తూ ఉండేదని.. అలాంటిది ఆమె తొలి ప్రయత్నంలోనే జాబ్ ఎలా కొట్టిందని ట్రోల్స్ నడిచాయి.
ఇది కూడా చదవండి: Health Care: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ ఆహార పదార్థాలు తినడం మానేయండి
ఇటీవల కాలంలో యూపీఎస్సీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. పూణెకు చెందిన పూజా ఖేద్కర్.. తప్పుడు పత్రాలు సమర్పించి ఐఏఎస్కు ఎంపిక కావడం పట్ల దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె సర్వీస్ను నిలిపివేసింది. యూపీఎస్సీని ప్రక్షాళన చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా యూపీఎస్సీ ఛైర్మన్ రాజీనామా చేయడం విశేషం.
ఇది కూడా చదవండి: Dharmendra Pradhan: సుప్రీం కోర్టు తీర్పుపై స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి..ఏమన్నారంటే..?
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!