Om Birla: లోక్సభ స్పీకర్ కుమార్తెకు ఊరట.. నెటిజన్ల ట్రోల్స్ తొలగించాలని హైకోర్టు ఆదేశం
- లోక్సభ స్పీకర్ కుమార్తె ఐఆర్పీఎస్ అధికారిణిగా ఎంపిక కావడంపై ట్రోల్స్
- తండ్రిని అడ్డంపెట్టుకుని తొలి ప్రయత్నంలోనే జాబ్ సంపాదించిందని ఆరోపణలు
- ట్రోల్స్పై హైకోర్టులో పిటిషన్... తొలగించాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి ఉద్యోగం సంపాదించడంపై పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. లోక్సభ స్పీకర్ కుమార్తె కాబట్టి ఏదైనా సాధ్యమేనంటూ విపరీతంగా ఆమెపై నెట్టింట ట్రోల్స్ నడిచాయి. తండ్రిని అడ్డంపెట్టుకుని ఐఆర్పీఎస్ అధికారిణిగా అంజలి ఎంపిక అయిందంటూ ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె మంగళవారం ఉదయం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తన పరువుకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారంటూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా చేశారు. నిరాధార పోస్టుల్ని వెంటనే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ కేసులో ప్రతివాదులుగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గూగుల్, ఎక్స్ (ట్విట్టర్), ఇతరు సంస్థలను చేర్చారు. తాజాగా ఆమె అభ్యర్థనను న్యాయస్థానం స్వీకరించి ఆదేశాలు జారీ చేసింది. 24 గంటల్లో కామెంట్లు తొలగించాలని సోషల్ మీడియా సంస్థలకు ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Union Budget 2024: స్మార్ట్ఫోన్ కొనాలనే వారికి శుభవార్త.. ఆ ఫోన్లకు కస్టమ్స్ సుంకం తగ్గింపు
Also Read
ఓం బిర్లా కుమార్తెకు పరువు నష్టం కలిగించే పోస్ట్లను 24 గంటల్లోగా తొలగించాలని గూగుల్, ఎక్స్ మరియు ఇతర సంస్థలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్లో పనిచేస్తున్న అంజలి… తన తండ్రి హోదాను అడ్డంపెట్టుకుని అవినీతికి పాల్పడి యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించిందని ఆమెపై పోస్టులు పెట్టారు. యూపీఎస్సీ పరీక్షలు రాసేంత వరకు ఆమె రీల్స్ చేస్తూ ఉండేదని.. అలాంటిది ఆమె తొలి ప్రయత్నంలోనే జాబ్ ఎలా కొట్టిందని ట్రోల్స్ నడిచాయి.
ఇది కూడా చదవండి: Health Care: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ ఆహార పదార్థాలు తినడం మానేయండి
ఇటీవల కాలంలో యూపీఎస్సీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. పూణెకు చెందిన పూజా ఖేద్కర్.. తప్పుడు పత్రాలు సమర్పించి ఐఏఎస్కు ఎంపిక కావడం పట్ల దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె సర్వీస్ను నిలిపివేసింది. యూపీఎస్సీని ప్రక్షాళన చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా యూపీఎస్సీ ఛైర్మన్ రాజీనామా చేయడం విశేషం.
ఇది కూడా చదవండి: Dharmendra Pradhan: సుప్రీం కోర్టు తీర్పుపై స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి..ఏమన్నారంటే..?
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!