Om Birla: లోక్సభ స్పీకర్ కుమార్తెకు ఊరట.. నెటిజన్ల ట్రోల్స్ తొలగించాలని హైకోర్టు ఆదేశం
- లోక్సభ స్పీకర్ కుమార్తె ఐఆర్పీఎస్ అధికారిణిగా ఎంపిక కావడంపై ట్రోల్స్
- తండ్రిని అడ్డంపెట్టుకుని తొలి ప్రయత్నంలోనే జాబ్ సంపాదించిందని ఆరోపణలు
- ట్రోల్స్పై హైకోర్టులో పిటిషన్... తొలగించాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి ఉద్యోగం సంపాదించడంపై పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. లోక్సభ స్పీకర్ కుమార్తె కాబట్టి ఏదైనా సాధ్యమేనంటూ విపరీతంగా ఆమెపై నెట్టింట ట్రోల్స్ నడిచాయి. తండ్రిని అడ్డంపెట్టుకుని ఐఆర్పీఎస్ అధికారిణిగా అంజలి ఎంపిక అయిందంటూ ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె మంగళవారం ఉదయం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తన పరువుకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారంటూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా చేశారు. నిరాధార పోస్టుల్ని వెంటనే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ కేసులో ప్రతివాదులుగా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గూగుల్, ఎక్స్ (ట్విట్టర్), ఇతరు సంస్థలను చేర్చారు. తాజాగా ఆమె అభ్యర్థనను న్యాయస్థానం స్వీకరించి ఆదేశాలు జారీ చేసింది. 24 గంటల్లో కామెంట్లు తొలగించాలని సోషల్ మీడియా సంస్థలకు ఆదేశించింది.
ఇది కూడా చదవండి: Union Budget 2024: స్మార్ట్ఫోన్ కొనాలనే వారికి శుభవార్త.. ఆ ఫోన్లకు కస్టమ్స్ సుంకం తగ్గింపు
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- India At UN: పాక్కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!
ఓం బిర్లా కుమార్తెకు పరువు నష్టం కలిగించే పోస్ట్లను 24 గంటల్లోగా తొలగించాలని గూగుల్, ఎక్స్ మరియు ఇతర సంస్థలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్లో పనిచేస్తున్న అంజలి… తన తండ్రి హోదాను అడ్డంపెట్టుకుని అవినీతికి పాల్పడి యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించిందని ఆమెపై పోస్టులు పెట్టారు. యూపీఎస్సీ పరీక్షలు రాసేంత వరకు ఆమె రీల్స్ చేస్తూ ఉండేదని.. అలాంటిది ఆమె తొలి ప్రయత్నంలోనే జాబ్ ఎలా కొట్టిందని ట్రోల్స్ నడిచాయి.
ఇది కూడా చదవండి: Health Care: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ ఆహార పదార్థాలు తినడం మానేయండి
ఇటీవల కాలంలో యూపీఎస్సీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. పూణెకు చెందిన పూజా ఖేద్కర్.. తప్పుడు పత్రాలు సమర్పించి ఐఏఎస్కు ఎంపిక కావడం పట్ల దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె సర్వీస్ను నిలిపివేసింది. యూపీఎస్సీని ప్రక్షాళన చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా యూపీఎస్సీ ఛైర్మన్ రాజీనామా చేయడం విశేషం.
ఇది కూడా చదవండి: Dharmendra Pradhan: సుప్రీం కోర్టు తీర్పుపై స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి..ఏమన్నారంటే..?
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!