యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి ఉద్యోగం సంపాదించడంపై పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. లోక్సభ స్పీకర్ కుమార్తె కాబట్టి ఏదైనా సాధ్యమేనంటూ విపరీతంగా ఆమెపై నెట్టింట ట్రోల్స్ నడిచాయి.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె అంజలి బిర్లా ఐఆర్పీఎస్ అధికారిణిగా ఎంపికైన తర్వాత పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. తండ్రి ఓం బిర్లా పలుకుబడి ఉపయోగించి అంజలి ఉద్యోగం సంపాదించిందని.. యూపీఎస్సీ పరీక్షల్లో నెగ్గుకు రాగలిగారని నెటిజన్లు ట్రోల్స్ చేశారు.