Dharmendra Pradhan: సుప్రీం కోర్టు తీర్పుపై స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి..ఏమన్నారంటే..?
- నీట్ పేపర్ లీక్ కేసుపై సుప్రీంకోర్టు ఈ రోజు కీలక తీర్పు
- పరీక్షను రద్దు చేసి.. మళ్లీ నిర్వహించేందుకు నిరాకరణ
- కోర్టు తీర్పుపై స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
- రెండు రోజుల్లో ఎన్టీఏ తుది ఫలితాలను ప్రకటిస్తుందని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీట్ పేపర్ లీక్ కేసుపై సుప్రీంకోర్టు ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. మే 5న జరిగిన నీట్-యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ జరిగిందని, అవకతవకలు జరిగాయని నీట్ యూజీ పునఃపరీక్ష నిర్వహించాలని కోరుతూ 40కి పైగా అభ్యర్థుల పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. నీట్ రీ-ఎగ్జామ్ అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
READ MORE: TGSRTC : ఆర్టీసీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు వైద్య పరీక్షలు
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
కాగా.. పరీక్షను రద్దు చేసి, మళ్లీ పరీక్షను నిర్వహించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో రెండు రోజుల్లో ఎన్టీఏ తుది ఫలితాలను ప్రకటిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. గరిష్టంగా రెండు రోజుల్లో కొత్త మెరిట్ జాబితా వస్తుందని తెలిపారు. నీట్పై విపక్షాలు అరాచకాలు సృష్టించాలని, అల్లర్లు సృష్టించాలని చూస్తున్నాయన్నారు. సుప్రీంకోర్టు తీర్పును సత్యమేవ జయతే అని కేంద్ర విద్యాశాఖ మంత్రి అభివర్ణించారు. సత్యం గెలిచిందని అన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.
READ MORE:Minister Narayana: వైజాగ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుపై మంత్రి నారాయణ సమీక్ష..
మన విద్యార్థులే ప్రాథమికమని మొదటి నుంచి చెబుతున్నామని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. “వారి ప్రయోజనాలను దెబ్బతీయకూడదు. సుప్రీం కోర్టు తీర్పు కూడా అదే విషయాన్ని తెలిపింది. అణగారిన వర్గాల విద్యార్థులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అవినీతికి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోడీ జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించారు. మోడీ ప్రభుత్వం పారదర్శకంగా, సున్నా దోషం లేకుండా చేసేందుకు కట్టుబడి ఉందని కోర్టుకు ముందే చెప్పాం. ఎన్టీఏ పునరుద్ధరణకు కమిటీని ఏర్పాటు చేశాం. ఆ కమిటీ సక్రమంగా పనిచేస్తోంది. ఎన్టీఏని జీరో ట్యాంపర్ ఫ్రీగా మరియు జీరో ఎర్రర్ లేకుండా చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము.” అని ఆయన పేర్కొన్నారు.
READ MORE: Minister Narayana: వైజాగ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుపై మంత్రి నారాయణ సమీక్ష..
ఈ మొత్తం ప్రక్రియలో జరిగిన గందరగోళంలో ఎవరినీ విడిచిపెట్టబోమని ఆయన స్పష్టంగా చెప్పారు. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నేరానికి పాల్పడిన నిందితులందరినీ కనిపెట్టేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!