వాయు కాలుష్యం : లాక్ డౌన్ సిధ్దమేనన్న కేజ్రీవాల్ ప్రభుత్వం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో “సంక్షోభం లాంటి పరిస్థితి” ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ రోజు తిరిగి సర్వోన్నత న్యాయస్థానం లో విచారణ ప్రారంభం అయింది. పంట వ్యర్ధాలను కాల్చడం ద్వారా కలిగే వాయు కాలుష్యం కేవలం 10 శాతమే అని నిర్ధారణ అయుందని ధర్మాసనానికి వివరించారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. అయుతే, “దేశ రాజధాని ప్రాంతం” ( ఎన్.సి.ఆర్) పరిధిలోకి వచ్చే ఢిల్లీ పొరుగు ప్రాంతాల్లో కూడా నిర్దిష్ట పరిమితులు, నిబంధనలు అమలు చేయాలని అఫిడవిట్ లో పేర్కొంది కేజ్రీవాల్ ప్రభుత్వం. వాయు కాలుష్య నియంత్రణ లో ఢిల్లీ కున్న పరిధి పరిమితంగా ఉందని, ఇరుగు పొరుగు ప్రాంతాల్లో కూడా ఖచ్చితమైన నిబంధనలు పాటిస్తేనే అర్దవంతంగా ఉంటుందని పేర్కొంది కేజ్రీవాల్ ప్రభుత్వం.
“లాక్ డౌన్” విధింపుకు మేము సిధ్దమే. అయుతే,“ఎన్.సి.ఆర్ వాయు కాలుష్య నియంత్రణ కమిషన్” లేదా కేంద్ర ప్రభుత్వం కానీ అదే తరహాలో నిబంధనలను దేశ రాజధాని ప్రాంతంలో కూడా విధించాలని కోరింది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వివరించిన కేజ్రావాల్ ప్రభుత్వం… మూడు రోజుల పాటు, ఢిల్లీలో అన్ని నిర్మాణ పనులు నిలిపివేసిఇంది. ఈ వారం ఆసాంతం పాఠశాలలు మూసివేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేందుకు ఆదేశాలు ఇచ్చారు. ప్రైవేట్ ఉద్యోగులు కూడా అదే విధంగా ఇంటి నుంచి పనిచేయాలని సూచించారు.
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
ఢిల్లీలో అత్యంత ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా ఉన్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఓ అత్యవసర ప్రణాళిక ను తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ. “రెండు రోజుల పాటు “లాక్ డౌన్” విధిస్తారా…!? ఏలాంటి అత్యవసర చర్యలు తీసుకోవాలనుకుంటున్నారో తెలియజేయండి. “వాయు నాణ్యత సూచిక” ( ఎయుర్ క్వాలిటీ ఇండెక్స్) స్థాయిలు తగ్గించేందుకు మీ ప్రణాళికలు ఏమిటో లిఖిత పూర్వకంగా కోర్టుకు సోమవారం ( ఈరోజు) సమర్పించాలని గత శనివారం కేంద్రానికి, సంబంధిత రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసారు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ. “వాయు నాణ్యత సూచిక” ( ఎయుర్ క్వాలిటీ ఇండెక్స్) గత శుక్రవారం 471 గా నమోదు. ఈ సీజన్లో ఇది అత్యంత గరిష్టం. న శనివారం 437 గా నమోదు. ఆదివారానికి సూచిక స్థాయు 330 కు పడిపోయింది. పంజాబ్, హర్యానాలలో పంట వ్యర్థాల కాల్చివేత బాగా తగ్గిపోవడంతో, వాయుకాలుష్య తీవ్రత స్థాయు కూడా తగ్గుముఖం పట్టింది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!