Kejriwal: రేపు కేజ్రీవాల్ను కలవనున్న పంజాబ్ కేబినెట్, ఎమ్మెల్యేలు
- రేపు కేజ్రీవాల్ను కలవనున్న పంజాబ్ కేబినెట్, ఎమ్మెల్యేలు
- 2027లో జరగబోయే పంజాబ్ ఎన్నికలపై చర్చించే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి తర్వాత పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది. 2027లోనే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పంజాబ్లోనే ఆప్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ అధికారాన్ని నిలబెట్టుకుంటేనే పార్టీ మనుగడ సాగుతోంది. లేదంటే పార్టీ పరిస్థితి దారుణంగా తయారయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా రేపు (మంగళవారం) ఆప్ అధినేత కేజ్రీవాల్ను పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్తో సహా కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు కలవనున్నారు. ఈ సందర్భంగా 2027లో జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కొవాలన్న అంశంపై కేజ్రీవాల్ దిశానిర్దేశం చేయనున్నారు. ఢిల్లీలో ఎదురైన పరిస్థితుల గురించి కూడా చర్చించనున్నారు.
ఇది కూడా చదవండి: Supreme Court: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసును వాయిదా వేసిన సుప్రీంకోర్టు
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
ఇదిలా ఉంటే పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా మాట్లాడుతూ.. పంజాబ్లో 30 మంది ఆప్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని.. వారంతా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని బాంబ్ పేల్చారు. ఢిల్లీలో ఆప్ ఓటమి తర్వాత కూడా కాంగ్రెస టార్గెట్ చేసుకున్నట్లుగానే కనిపిస్తోంది. ఇరు పార్టీల మధ్య వార్ చల్లారలేదు. మోసం, అబద్ధాలు, నెరవేర్చలేని వాగ్దానాలతో పాలన ముగిసిందంటూ ఆప్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పంజాబ్లో వాగ్దానాలు అమలు చేయడంలో ఆప్ విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలను ఆప్ సీరియస్గా చూస్తోంది. ఈ వ్యాఖ్యలపై కూడా రేపటి కేజ్రీవాల్ సమావేశంలో చర్చకు రానున్నాయి.
ఇది కూడా చదవండి: Rupee All time Low : డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ యుద్ధం.. రికార్డు స్థాయికి పడిపోయిన రూపాయి
ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో బీజేపీ అధికారం చేజిక్కించుకుంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇక ఆప్లో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి రాజకీయ ఉద్దండులంతా ఓడిపోయారు. మాజీ ముఖ్యమంత్రి అతిషి మాత్రమే కల్కాజీ నియోజకవర్గం నుంచి స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. లిక్కర్ స్కామ్, శేష్ మహల్ అంశం ఆప్ను ఘోరంగా దెబ్బకొట్టింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. పంజాబ్లో కూడా కాంగ్రెస్, ఆప్ వేర్వేరుగానే పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Mahesh Kumar: ఫాం హౌస్కే పరిమితమైన కేసీఆర్కి ప్రతిపక్ష హోదా ఎందుకు: టీపీసీసీ అధ్యక్షుడు
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!