Delhi corona: ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కరోనా టెర్రర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడిప్పుడే కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనా నిబంధనలు సడలిస్తున్నాయి. తాజాగా ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఢిల్లీ,నోయిడా, ఘజియాబాద్, వసంత్ కుంజ్ ప్రైవేట్ స్కూల్స్ లో నమోదవుతున్న కోవిడ్ కేసులపై ప్రభుత్వం అప్రమత్తం అయింది.
గడిచిన మూడు రోజుల్లో ఢిల్లీ ఎన్సీఆర్ పాఠశాలల్లో 50 పైగా కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. పాఠశాలల కోసం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయనుంది ఢిల్లీ ప్రభుత్వం. ఇప్పటికే కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని పాటశాలలకు విద్యా శాఖ ఆదేశాలు జారీచేసింది. ఒక్క విద్యార్థి లేదా ఒక్క టీచర్ కి కోవిడ్ సోకిన స్కూల్ మూసివేయాలని ఆదేశించింది ఢిల్లీ ప్రభుత్వం.
Also Read
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
- LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
Also Read: Corona Updates : దేశ రాజధానిలో పెరుగుతున్న కరోనా కేసులు..
విద్యార్ధులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని వీలైనంత వరకు సామాజిక దూరాన్ని పాటించాలని సూచించిన డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్. పాఠశాలలో కోవిడ్ కేసు నమోదైతే డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలియజేయాలని పాఠశాలను తాత్కాలికంగా మూసివేయాలని సూచనలు జారీచేసింది. కేసులు పెరిగితే ఫోర్త్ వేవ్ ఖాయమంటున్నారు వైద్య నిపుణులు. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలని, శానిటైజర్లను ఉపయోగించాలని ప్రభుత్వం సూచించింది. అంతేకాదు, పాఠశాలకు వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయులు, సహాయక సిబ్బంది తల్లిదండ్రులకు కోవిడ్ నివారణ గురించి అవగాహన కల్పించాలని సూచనలిచ్చింది.
పాఠశాలల కోసం కోవిడ్ మార్గదర్శకాలను జారీ చేయాలని విద్యా శాఖను ఆదేశించారు మనీష్ సిసోడియా. ఢిల్లీ ప్రభుత్వం కోవిడ్ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి సిసోడియా తెలిపారు. ఆసుపత్రిలో చేరికలు,మరణాల సంఖ్య అంతగా లేనందున ప్రజలు భయపడవద్దని కోరారు కేజ్రీవాల్. వైద్యనిపుణులు సైతం కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు క్లాస్.. సమన్వయంపై ప్రత్యేక దృష్టి
-
Malayalam Thriller: థియేటర్లలో వణికించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్!
-
RBI Polymer Notes: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. రూ.10, రూ.20 నోట్లపై ఆర్బీఐ భారీ సన్నాహాలు
-
EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!