Delhi New CM: రేపే ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం.. ఈ సాయంత్రం సీఎం పేరు ప్రకటన
- రేపే ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం
- బుధవారం సాయంత్రం సీఎం పేరు ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా గురువారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం రాంలీలా మైదానంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కోసం బుధవారం సాయంత్రం 6:30 గంటలకు ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఈ భేటీలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకోనున్నారు.
ఇది కూడా చదవండి: Fake Employee: టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ అంటూ సీసీసీ సెంటర్లోకి వెళ్లిన కేటుగాడు
Also Read
ఇక ముఖ్యమంత్రి రేసులో పలువురు నేతలు ఉన్నారు. పరిశీలనలో పర్వేష్ వర్మతో పాటు ఓ మహిళను కూడా ఎంపిక చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ను ఓడించిన శిఖా రాయ్ పేరు కూడా వినిపిస్తోంది. అలాగే ఆశిస్ సూద్ (ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రటరీ), రేఖా గుప్తా, విజేందర్ గుప్తా (ఢిల్లీ అసెంబ్లీలో మాజీ ప్రతిపక్ష నేత), సతీష్ ఉపాధ్యాయ్ (బ్రాహ్మణ నేత, ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు), జితేంద్ర మహాజన్ (వైశ్య నేత) పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక మంత్రి పదవుల కోసం దాదాపు 15 మందితో కూడిన జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Sheikh Hasina vs Yunus: బంగ్లాదేశ్కు తిరిగి వస్తానని షేక్ హసీనా ప్రతిజ్ఞ.. ముహమ్మద్ యూనస్ కౌంటర్
ఈ నెల 20న రాంలీలా మైదానంలో అత్యంత గ్రాండ్గా ప్రమాణస్వీకారం ఏర్పాట్లు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇక ఈ ప్రమాణస్వీకారానికి 50 మంది సినీ తారలను, పారిశ్రామిక వేత్తలను, దౌత్యవేత్తలకు ఆహ్వానాలు పంపాలని భావిస్తోంది. బీజేపీ అగ్ర నేతలతో పాటు కేంద్రమంత్రులు, మిత్రపక్షాలు హాజరుకానున్నారు. 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ప్రోగ్రామ్కి హాజరుకానున్నారు. మరిచిపోలేని విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక దేశంలోని ఆధ్యాత్మిక వేత్తలు బాబా రామ్దేవ్, స్వామి చిదానంద, బాబా బాగేశ్వర్ ధీరేంద్ర శాస్త్రి, ఇతర మత ప్రముఖులను కూడా ఈ కార్యక్రమానికి పిలవనున్నారు. ఈ వేదికపై సంగీత కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. కైలాష్ ఖేర్ ఆధ్వర్యంలో సంగీత ప్రదర్శన జరగనుంది.
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకున్నాయి. ఇక 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్, మనీస్ సిసోడియా లాంటి నేతలు ఓడిపోయారు. అతిషి మాత్రం కల్కాజీ నియోజకవర్గం నుంచి అతి కష్టం మీద గట్టెక్కింది.
ఇది కూడా చదవండి: Nabha Natesh: మొక్కుబడిగా చేసిన ఆ పనిని ఇప్పుడు ఇష్టంగా చేస్తున్నా : నభా నటేష్
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!