Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress-TMC Merger: బెంగాల్ రాజకీయ పరిణామాలు, భారత రాజకీయలో కీలక మార్పులు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే మమతను ధిక్కరించి ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబాటు చేశారు. దీంతో టీఎంసీ 4 ముక్కలుగా మారింది. ఎంపీలంతా కాకోలిఘోష్ దస్తీదార్ మద్దతు ప్రకటిస్తే, ఎమ్మెల్యేలు రీటబ్రత బెనర్జీ వైపు ఉన్నారు. దీంతో మమతా బెనర్జీకి వరసగా షాక్లు తగులుతూ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్-టీఎంసీ విలీనం దిశగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ గంటన్నర పాటు రాహుల్ గాంధీతో చర్చించడం ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో ప్రతిపక్ష కూటమిలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించినట్లు మమత వర్గం స్పష్టం చేసింది. మరోవైపు, విలీనంపై తృణమూల్ నుంచే ప్రతిపాదన రావాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. ఈ విషయంలో తాము ఎలాంటి ఒత్తిడి చేయమంటూ చెబుతున్నట్లు తెలుస్తోంది. అభిషేక్ బెనర్జీ, రాహుల్ గాంధీ మీటింగ్ ముందు మంగళవారం సోనియా గాంధీ, మమతా బెనర్జీ భేటీ అయ్యారు. ఇద్దరూ ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఈ భేటీ తర్వాత నుంచి టీఎంసీ కాంగ్రెస్లో విలీనం అవుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Also Read
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Swara Bhasker: ఇతర మహిళల్ని గౌరవించడం నేర్చుకో.. స్వరా భాస్కర్ వ్యాఖ్యలపై బీజేపీ..
- CM Vijay: సీఎం విజయ్ను కలిసిన టీఎంసీ రెబెల్ ఎంపీ సయానీ ఘోష్
- Yasin Malik: ‘‘నన్ను ఉరితీయక ముందే నిన్ను విముక్తి చేస్తా’’.. భార్యకు యాసిన్ మాలిక్ విడాకులు
మరోవైపు, బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్యలు కూడా విలీనంపై అనుమానాలు పెంచేలా చేసింది. ఆ రాష్ట్ర అధ్యక్షుడు శుభంకర్ సర్కార్ మాట్లాడుతూ.. ‘‘రాజకీయాలు అంటేనే అవకాశాల కళ, రేపు ఏమైనా జరగొచ్చు. మా నాయకుడు రాహుల్ గాంధీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి, బీజేపీ నియంతృత్వానికి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. ఆయన ఎన్నడూ రాజీ పడలేదు. రాహుల్ గాంధీ అనగారిన వర్గాల గొంతుక. ఆయనే ప్రధానమంత్రి కావాలి. దీనిని అంగీకరించే ఎవరికైనా కాంగ్రెస్ ద్వారాలు తెరిచే ఉన్నాయి. ’’ అని అన్నారు.
ఈ ఊహాగానాలపై బీజేపీ తీవ్రంగా విరుచుకుపడింది. రాహుల్, అభిషేక్ కలయికను యువరాజుల కలయికగా పేర్కొంది. వారు అధికారంలో కోసం ఏమైనా చేయగలరని, ఎవరినైనా ఆలింగనం చేసుకోగలరని విమర్శించింది. ఇదిలా ఉంటే, టీఎంసీ పార్టీ ఎంపీ సుస్మితా దేవ్ రాజీనామా చేసింది. అస్సాం సీఎం హిమంత బిశ్వసర్మను కలవడంతో ఆమె బీజేపీలో చేరుతుందనే ప్రచారం ఊపందుకుంది. ఈ పరిణామాలను చూస్తే పార్టీ ఎంపీలు బీజేపీ వైపు ఉంటే, పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ వైపు చూస్తోంది.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!