Atishi: ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషికి జెడ్ కేటగిరీ భద్రత కేటాయింపు
- ఢిల్లీ సీఎం అతిషికి జెడ్ కేటగిరీ భద్రత కేటాయింపు
- ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర హోంశాఖ నిర్ణయం
- కార్మికుల కనీస వేతనాన్ని పెంచిన సీఎం అతిషి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషికి ఢిల్లీ పోలీసులు జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు అతిషికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ వర్తిస్తుంది. ప్రోటోకాల్ ప్రకాశం ఆమె కాన్వాయ్లో ఇకపై పైలట్ సహా పోలీసు సిబ్బందితో భద్రత కల్పించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రి రక్షణగా ఢిల్లీ పోలీసులు 22 మందితో వంతుల వారీగా మోహరించనున్నారు. జెడ్ కేటగిరీలో పీఎస్వోలు, ఎస్కార్ట్స్, సాయుధ గార్డులు ఉంటారు. ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖ.. ఆమె భద్రతను సమీక్షించే అవకాశం ఉంటుందని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.
ఇది కూడా చదవండి: Israel-Lebanon War: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భారీ దాడులు
Also Read
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
సెప్టెంబర్ 21న ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల ఆమె బాధ్యతలు చేపడుతూ కేజ్రీవాల్ కుర్చీని పక్కన పెట్టి మరొక చైర్లో కూర్చుని బాధ్యతలు స్వీకరించారు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ఆరు నెలలు తీహార్ జైల్లో ఉన్నారు. సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఇటీవలే విడుదలయ్యారు. అయితే అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అతిషికి బాధ్యతలు అప్పగించారు. ఇలా అతిషికి అదృష్టం దక్కింది.
ఇది కూడా చదవండి: UP: మహిళతో లేచిపోయిన తమ్ముడు.. అన్నకు శిక్ష..
కార్మికులకు దసరా శుభవార్త
ఇక తాజాగా ముఖ్యమంత్రి అతిషి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో అసంఘటిత రంగంలోని కార్మికుల కనీస వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త రేట్లు అమలులోకి వస్తాయని అతిషి వెల్లడించారు. తాజా నిర్ణయంతో నైపుణ్యం లేని కార్మికులకు కనీస వేతనం రూ.18,066, మధ్యస్తంగా నైపుణ్యం కలిగిన వారికి రూ.19,929, నైపుణ్యం కలిగినవారికి రూ.21,917కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సామాన్య ప్రజలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించేందుకు అవసరమైన ప్రతి చర్యను ప్రభుత్వం చేపడుతుందని అతిషి తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం దేశంలోనే అత్యధిక కనీస వేతనాలను అమలు చేసిందని విలేకరుల సమావేశంలో అతిషి స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Vettaiyan-The Hunter: ‘వేట్టయన్’ రజినీకాంత్ దిగాడు.. అంచనాలు రేపుతున్న ప్రివ్యూ వీడియో
తాజావార్తలు
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
-
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!