Batenge to Katenge: ‘మహా’మంత్రంగా సీఎం యోగి ‘‘బటేంగే తో కటేంగే’’ నినాదం..
- మహారాష్ట్రలో వైరల్గా మారిన సీఎం యోగి నినాదం..
- పలు ప్రాంతాల్లో ‘‘బటేంగే తో కటేంగే’’ పోస్టర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Batenge to Katenge: మహారాష్ట్ర ఎన్నికల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నినాదం ‘‘బాటేంగే తో కటేంగే’’ మారుమోగుతోంది. మహరాష్ట్రలోని పలు ప్రాంతాల్లో యోగి ఫోటో, నినాదంతో ప్లేక్సీలు వెలిశాయి. ముఖ్యంగా ముంబైలోని పలు ప్రాంతాల్లో ఈ పోస్టర్లు సందడి చేస్తున్నాయి. హర్యానా ఎన్నికల సమయంలో కూడా ఈ నినాదం చాలా ఫేమస్ అయింది. ‘‘ విడిపోతే.. నాశనం అవుతాం’’ అని అర్థమయ్యే ఈ నినాదాన్ని హిందువుల ఐక్యత కోసం యోగి చెప్పినట్లు తెలుస్తోంది.
Read Also: India Canada: లారెన్స్ బిష్ణోయ్ లింక్స్.. కెనడా ఆరోపణల్లో కీలక విషయాలు..
Also Read
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
భారత్కి స్వాతంత్య్రం, దేశ విభజన వచ్చిన సమయంలో హిందువుల ఊచకోత వంటి అంశాలను ఉదహరిస్తూ యోగి ఈ కామెంట్స్ చేశారు. ఆగస్టులో బంగ్లాదేశ్ అల్లర్లను ఉదహరిస్తూ సమాజంలో విభజన పర్యవసానాలపై హెచ్చరించారు. జాతీయ ఐక్యత కోసం పిలుపునిచ్చారు. ఆగ్రాలో మాట్లాడుతూ.. “దేశానికి మించినది ఏదీ ఉండదు. మనం ఐక్యంగా ఉన్నప్పుడే దేశం సాధికారత పొందుతుంది.బంగ్లాదేశ్లో ఏమి జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఆ తప్పులు ఇక్కడ పునరావృతం కాకూడదు. మనం విడిపోతే, మనం నాశనం అవుతాము. మనం ఐక్యంగా ఉంటేనే సురక్షితం” అని ఆదిత్యనాథ్ అన్నారు.
ఇదిలా ఉంటే, బీజేపీ శ్రేణులు మరో విధమైన భాష్యాన్ని చెబుతున్నాయి. ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ కులగణన పేరుతో దేశాన్ని విభజించే కుట్రకు పాల్పడుతున్నాడని, అందుకే హిందువులు సంఘటితంగా ఉండాలని యోగి ‘‘బటేంగే తో కటేంగే’’ నినాదం చెబుతుందని వెల్లడిస్తున్నారు. ఈ నినాదాలు ప్రస్తుతం మహారాష్ట్రలో వైరల్ అవుతున్నాయి. ఆ రాష్ట్రంలోని 288 సీట్లకు నవంబర్ 20న ఎన్నికలు జరగబోతున్నాయి. 23న ఫలితాలు వెలువడుతాయి.
తాజావార్తలు
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?