పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తతలు, ప్రాణ నష్టంపై మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అలాగే భారతీయుల భద్రత, ఇంధన సరఫరాపై కీలకంగా మోడీ చర్చించారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ను హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేయడంపై ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పందిస్తూ.. క్షమాపణలు చెప్పారు. ఇరాన్ క్షమాపణలు చెప్పిన తర్వాత ట్రంప్ స్పందిస్తూ.. ‘‘ఇరాన్ మధ్యప్రాచ్యంలో ఓడిపోయిన దేశం’’గా అభివర్ణించారు. ఇరాన్ ఈ రోజు చాలా తీవ్రంగా దెబ్బతింటుందని కూడా ట్రంప్ హెచ్చరించారు.
Donald Trump: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు కీలక హెచ్చరిక చేశారు. ఇరాన్ ‘‘బేషరతుగా’’ లొంగిపోతేనే ఇరాన్తో ఏదైనా ఒప్పందం సాధ్యమవుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. లొంగిపోకపోతే ఒప్పందం లేదని చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ట్రూత్ సోషల్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ లొంగిపోయే వరకు, దౌత్యమార్గం లేదని అన్నారు.
Iran: ఇజ్రాయిల్, అమెరికా దాడులు ఇరాన్పై తీవ్రమవుతున్నాయి. శనివారం ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు ఇతర నగరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఖమేనీతో పాటు ఇరాన్ టాప్ సైనిక, రాజకీయ నాయకత్వాన్ని తుడిచిపెట్టినట్లు ఇజ్రాయిల్ చెబుతోంది.
Ayatollah Arafi: అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత, కొత్త సుప్రీం లీడర్గా సీనియర్ మతాధికారి ఆయతొల్లా అలిరేజా అరాఫీని నియమించినట్లు ఆ దేశ వార్తా సంస్థ వెల్లడించింది. ఆయన తాత్కాలిక సుప్రీం లీడర్గా పనిచేస్తారని తెలిపింది. ఇరాన్ రాజ్యాంగ ప్రక్రియలో వారసుడిని ఎన్నుకునే వరకు, సుప్రీం లీడర్గా విధులు బాధ్యత కలిగిన తాత్కాలిక నాయకత్వ మండలిలో అయతుల్లా అలిరేజా అరాఫీని తాత్కాలిక అత్యున్నత నాయకుడిగా నియమించారు. Read…
Iran Nuclear Program: టెహ్రాన్లోని అణుశక్తి సంస్థను ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ సందర్శించారు. ఈ సందర్భంగా పెజెష్కియాన్ దేశ అణు శాస్త్రవేత్తలు, అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టెహ్రాన్ తన అణు సౌకర్యాలను పునర్నిర్మించుకుంటుందని, ఇంకా ఎక్కువ శక్తితో వాటిని తిరిగి నిర్మిస్తామని చెప్పారు. “ఎన్ని భవనాలు, కర్మాగారాలు ధ్వంసమైనా, మేము వాటిని పునర్నిర్మిస్తాము, ఈసారి మరింత బలంగా ఉంటాము” అని ఆయన వెల్లడించారు. ఇరాన్ అణు కార్యక్రమం ఆయుధాల కోసం కాదు,…
ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం చాలా ప్రమాదకరమైన దశకు చేరుకుంది. ఆదివారం ఉదయం, అమెరికా ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసింది. అమెరికా చర్య తర్వాత, ప్రపంచంలో కలకలం రేగింది. ఈ సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడారు. ప్రధాని మోదీ ఈ సమాచారాన్ని ఎక్స్ పోస్ట్ ద్వారా పంచుకున్నారు. ‘నేను ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తో మాట్లాడాను. ప్రస్తుత పరిస్థితిపై వివరంగా చర్చించాము.…
PM Modi: ఇజ్రాయిల్-ఇరాన్ సంక్షోభం, హమాస్, హిజ్బుల్లాతో ఇజ్రాయిల్ యుద్ధాల నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ నేపథ్యంలో రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్లో ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజిష్కియాన్ ప్రధాని నరేంద్రమోడీతో ఈ రోజు భేటీ అయ్యారు. పశ్చిమాసియా సంక్షోభం గురించి ఇరువురు నేతలు చర్చించారు.
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. సంస్కరణవాద అభ్యర్థి మసూద్ పెజెష్కియాన్ అధ్యక్ష ఎన్నికల్లో అతివాద అభ్యర్థి సయీద్ జలీలీని ఓడించి విజయం సాధించారు. దేశంలో 49.8 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి మొహసిన్ ఎస్లామీ తెలిపారు.