Swami Chaitanyananda Saraswati: ‘‘బేబీ, ఐ లవ్ యూ’’ అంటూ బాబా మెసేజ్లు.. స్వామి చైతన్యానంద లీలలు..
- "బేబీ, ఐలవ్ యూ" అంటూ బాబా మెసేజ్లు..
- స్వామి చైతన్యానంద సరస్వతి లీలలు.
- . విద్యార్థినులపై లైంగిక వేధింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swami Chaitanyananda Saraswati: న్యూఢిల్లీలోని ప్రముఖ విద్యా, ఆధ్యాత్మిక సంస్థలో లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనంగా మారాయి. వసంత్ కుంజ్ ప్రాంతంలోని శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ డైరెక్టర్, తనను తాను ‘‘బాబా’’గా చెప్పుకునే స్వామి చైతన్యానంద సరస్వతి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ కేసుపై పోలీసులు విస్తృత దర్యాప్తును ప్రారంభించారు. ఆగస్టు 2025లో అనేక మంది మహిళా విద్యార్థినులు ఆయనపై ఫిర్యాదు చేశారు. ఒడిశాలో పుట్టిన పార్థసారధి, ఆ తర్వాత బాబాగా మారి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లారు, ఇప్పుడు ఈ ఆరోపణలతో అసలు స్వరూపం బయటకు వచ్చింది.
విద్యార్థినులకు ‘‘బేబీ’’, ‘‘ఐ లవ్ యూ’’ అంటూ మెసేజ్లు పంపినట్లు తేలింది. విద్యార్థినుల హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ను పొగుడుతూ మాట్లాడే వాడని అధికారులు ధ్రువీకరించారు. 2024 అక్టోబర్లో అడ్మిషన్ పొందిన కొద్ది సమయానికే ఒక విద్యార్థిని ఎలా వేధించాడనే విషయాన్ని ఎఫ్ఐఆర్ ప్రస్తావించింది. ఆ ఏడాది దీపావళి ముందు తను పిలిపించారని, అతను వింతగా చూసేవాడని ఆమె ఆరోపించింది. డిసెంబర్లో తన కాలు ఫ్రాక్చర్ అయిన తర్వాత, ఎక్స్-రే షేర్ చేయాలని ఆదేశించాడని, అప్పటి నుంచి తనతో అనుచితంగా, బలవంతపు సందేశాలు పంపేవాడని ఫిర్యాదులో పేర్కొంది.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
‘‘నువ్వు ఈ రోజు అందంగా కనిపిస్తున్నావు’’, ‘‘నేను నిన్ను ఆరాధిస్తున్నాను’’ వంటి మేసేజులను ప్రతీరోజు పంపే వారని విద్యార్థినులు ఆరోపించారు. వీటికి స్పందించకుంటే, మార్కులు తక్కువగా ఇస్తానని,నోటీసులు ఇస్తానని వేధించే వాడనే ఆరోపణలు ఉన్నాయి. 2025లో బీఎండబ్ల్యూ కారు పూజ నెపంతో బాబా తనను తన క్వార్టర్కు పిలిచాడని ఆరోపించింది. ఆ రాత్రి తనను వ్యక్తిగతంగా కలవాలని మెసేజ్ చేశాడని చెప్పింది.
2025 జూన్ లో రిషికేష్ పర్యటనలో అనేక మంది విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతిఘటించిన విద్యార్థినులకు మార్కులు తగ్గించాడని తెలుస్తోంది. తాజా ఫిర్యాదులో మొత్తం 17 మంది మహిళా విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు 50 మంది విద్యార్థిను నుంచి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాట్సాప్ మెసేజ్లు, ఫోన్ రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇతడిపై 2009, 2016లో కూడ లైంగిక వేధింపు ఆరోపణలు వచ్చాయి. అయితే, తన ప్రభావం, పలుకుబడితో ఇందులో నుంచి తప్పించుకున్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Rajinikanth-Kamal Haasan: రజినీ – కమల్ మల్టీస్టారర్ నుంచి త్రిష ఔట్..?
-
Finn Allen: 10 సిక్సర్లు, 4 ఫోర్లు.. అభిషేక్, వైభవ్ల ప్రత్యేక బ్యాట్స్మెన్ల జాబితాలో ఫిన్ అలెన్..
-
Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..