Darshan Case: రేణుకా స్వామి చిత్రహింసలు చూస్తూ పవిత్ర గౌడ ఆనందం..
- దర్శన్ కేసులో కీలక విషయాలు..
- రేణుకా స్వామిని చిత్రహింసలు చూసిన పవిత్ర గౌడ...
- ఆ సమయంలో అక్కడే ఉందన్న పోలీసులు..
- కర్రలతో కొడుతూ. కరెంట్ షాక్ ఇస్తూ టార్చర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Darshan Case: కన్నడ స్టార్ దర్శన్ వ్యవహారం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దర్శన్, నటి పవిత్ర గౌడతో సహజీవనం చేయడంపై సోషల్ మీడియాలో విమర్శించిన రేణుకాస్వామిని(33) దారుణంగా హత్య చేశారు. చిత్రదుర్గకు చెందిన ఫార్మసీలో పనిచేసే వ్యక్తిని బెంగళూర్ తీసుకువచ్చి హింసించి హత్య చేసిన వ్యవహారం వెలుగులోకి రావడంతో ఒక్కసారి కన్నడ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ఈ కేసులో ఇప్పటి వరకు దర్శన్, పవిత్రలతో సహా 17 మందిని అరెస్ట్ చేశారు. పెళ్లై భార్య, కుమారుడు ఉన్న దర్శన్, పవిత్ర గౌడతో రిలేషన్ ఉండటం గురించి అసభ్యకరమై పోస్టులు పెట్టడంతోనే రేణుకా స్వామి హత్య జరిగింది.
Read Also: Goa: “మద్యం తాగుతారు, చెత్త వేస్తారు”..గోవాలో ఫేమస్ బీచ్కి వెళ్లాలంటే రిజర్వేషన్ తప్పనిసరి..
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
ఇదిలా ఉంటే, జూన్ 8న స్వామిని అతని స్వస్థలం చిత్రదుర్గ నుంచి కిడ్నాప్ చేసి బెంగళూర్లోని ఓ షెడ్కి తీసుకువచ్చారు. అతడిని కర్రలతో కొట్టడంతో పాటు పలుమార్లు కరెంట్ షాక్కి గురిచేసినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. అతని వృషణాలపై తన్నడంతో తీవ్రగాయాలైనట్లు వెల్లడైంది. చిత్రహింసలు పెడుతున్న సమయంలో పవిత్ర గౌడ అక్కడే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. స్వామి సోషల్ మీడియా పోస్టుల కారణంగా పవిత్రనే దర్శన్ని దాడికి ప్రేరేపించినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో 17 మందిని అరెస్ట్ చేయగా, తమకు బదులుగా నేరం వేరే వారిపై వేసుకోవాలని దర్శన్ రూ. 50 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇందులో రూ. 30 లక్షలు కిడ్నాప్, హత్య మరియు మృతదేహాన్ని పారవేయడం పర్యవేక్షించిన ప్రదోష్ అలియాస్ పవన్ అనే వ్యక్తికి చెల్లించారు. రాఘవేంద్ర మరియు కార్తీక్ అనే ఇద్దరు వ్యక్తుల కుటుంబాలకు ₹ 5 లక్షలు చెల్లించాల్సి ఉంది. హత్య జరిగిన రోజు దర్శన్, పవిత్రలా చెప్పులతో పాటు సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పవిత్ర ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా, దర్వన్ పోలీస్ కస్టడీని గురువారం రెండు రోజులు పొడగించారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..