Darshan Case: రేణుకా స్వామి చిత్రహింసలు చూస్తూ పవిత్ర గౌడ ఆనందం..
- దర్శన్ కేసులో కీలక విషయాలు..
- రేణుకా స్వామిని చిత్రహింసలు చూసిన పవిత్ర గౌడ...
- ఆ సమయంలో అక్కడే ఉందన్న పోలీసులు..
- కర్రలతో కొడుతూ. కరెంట్ షాక్ ఇస్తూ టార్చర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Darshan Case: కన్నడ స్టార్ దర్శన్ వ్యవహారం కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దర్శన్, నటి పవిత్ర గౌడతో సహజీవనం చేయడంపై సోషల్ మీడియాలో విమర్శించిన రేణుకాస్వామిని(33) దారుణంగా హత్య చేశారు. చిత్రదుర్గకు చెందిన ఫార్మసీలో పనిచేసే వ్యక్తిని బెంగళూర్ తీసుకువచ్చి హింసించి హత్య చేసిన వ్యవహారం వెలుగులోకి రావడంతో ఒక్కసారి కన్నడ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ఈ కేసులో ఇప్పటి వరకు దర్శన్, పవిత్రలతో సహా 17 మందిని అరెస్ట్ చేశారు. పెళ్లై భార్య, కుమారుడు ఉన్న దర్శన్, పవిత్ర గౌడతో రిలేషన్ ఉండటం గురించి అసభ్యకరమై పోస్టులు పెట్టడంతోనే రేణుకా స్వామి హత్య జరిగింది.
Read Also: Goa: “మద్యం తాగుతారు, చెత్త వేస్తారు”..గోవాలో ఫేమస్ బీచ్కి వెళ్లాలంటే రిజర్వేషన్ తప్పనిసరి..
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
ఇదిలా ఉంటే, జూన్ 8న స్వామిని అతని స్వస్థలం చిత్రదుర్గ నుంచి కిడ్నాప్ చేసి బెంగళూర్లోని ఓ షెడ్కి తీసుకువచ్చారు. అతడిని కర్రలతో కొట్టడంతో పాటు పలుమార్లు కరెంట్ షాక్కి గురిచేసినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. అతని వృషణాలపై తన్నడంతో తీవ్రగాయాలైనట్లు వెల్లడైంది. చిత్రహింసలు పెడుతున్న సమయంలో పవిత్ర గౌడ అక్కడే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. స్వామి సోషల్ మీడియా పోస్టుల కారణంగా పవిత్రనే దర్శన్ని దాడికి ప్రేరేపించినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో 17 మందిని అరెస్ట్ చేయగా, తమకు బదులుగా నేరం వేరే వారిపై వేసుకోవాలని దర్శన్ రూ. 50 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇందులో రూ. 30 లక్షలు కిడ్నాప్, హత్య మరియు మృతదేహాన్ని పారవేయడం పర్యవేక్షించిన ప్రదోష్ అలియాస్ పవన్ అనే వ్యక్తికి చెల్లించారు. రాఘవేంద్ర మరియు కార్తీక్ అనే ఇద్దరు వ్యక్తుల కుటుంబాలకు ₹ 5 లక్షలు చెల్లించాల్సి ఉంది. హత్య జరిగిన రోజు దర్శన్, పవిత్రలా చెప్పులతో పాటు సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పవిత్ర ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా, దర్వన్ పోలీస్ కస్టడీని గురువారం రెండు రోజులు పొడగించారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!