Goa: “మద్యం తాగుతారు, చెత్త వేస్తారు”..గోవాలో ఫేమస్ బీచ్కి వెళ్లాలంటే రిజర్వేషన్ తప్పనిసరి..
- గోవాలోని ఆ బీచ్కి వెళ్లాంటే హోటల్ రిజర్వేషన్ తప్పనిసరి..
- నిబంధనలు ఉల్లంఘించే పర్యాటకులపై పన్ను..
- ఇష్టారీతిగా ప్రవర్తిస్తుండటంతో పంచాయతీ తీర్మానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Goa: బ్యాచిలర్లకు, కపుల్స్, ఫ్యామిలీ ఇలా ఎవరికైనా డ్రీమ్ డెస్టినేషన్లలో గోవా తప్పకుండా ఉంటుంది. బీచులు, మందు, విందు, నైట్ లైఫ్ ఇలా ప్రతీది ఆస్వాదించవచ్చు. అయితే, ఇప్పుడు మాత్రం మందు తాగుతూ, చెత్త ఎక్కడపడితే అక్కడ పడేస్తామంటే కదరదు. గోవాలోని ఫేమస్ బీచుల్లో ఒకటైన ‘కలంగుట్’ బీచ్కి వచ్చే వారు తప్పకుండా హోటల్ రిజర్వేషన్లను చూపించాలని అక్కడి స్థానిక గ్రామపంచాయతీ నిర్ణయం తీసుకుంది. పర్యాటకులు విచ్చలవిడిగా ప్రవర్తించడం, గ్రామానికి చెడ్డపేరు తెచ్చే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందడంతో పంచాయతీ ఈ నిర్ణయం తీసుకుంది.
Read Also: Automatic Cars: సరసమైన ధరలో ఇండియాలోని టాప్-5 ఆటోమేటిక్ కార్లు ఇవే..
Also Read
పర్యాటకులు తమ గ్రామ పరిధిలోకి ప్రవేశించే ముందు హోటల్ రిజర్వేషన్లను తప్పనిసరిగా చూపించాలని తీర్మానం చేసింది. గ్రామ పరిసరాల్లో చెత్తను విసిరేసేవారిపై పన్ను విధించాలని నిర్ణయించింది. ‘‘పర్యాటకులు జీపులు, బస్సులతో గుంపులుగా వస్తారు. బీచ్ ప్రాంతంలో మద్యం సేవిస్తారు. అక్కడే వంట చేసుకుని చెత్తను విసిరేస్తు్న్నారు. ఇప్పుడు హోటల్ రిజర్వేషన్ వెరిఫికేషన్ కోసం చెక్పోస్టుల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ఇష్టారీతిగా ప్రవర్తించే వారిపై పన్ను, ప్రవేశ రుసుము వసూలు చేయాలని నిర్ణయించుకున్నాము’’ అని గ్రామ సర్పంచ్ జోసెఫ్ సిక్వెరా తెలిపారు.
గతంలో మహాబలేశ్వర్లో కూడా ఇలాంటి తీర్మానాన్ని తీసుకువచ్చినట్లు కలంగుట్ పంచాయతీ గుర్తు చేసింది. కలంగుట్ బీచ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది, ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి పంచాయతీ అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోందని తీర్మానం పేర్కొంది. పర్యాటకులు బీచ్ని పబ్లిక్ టాయిలెట్గా ఉపయోగిస్తున్నారని, ఇస్టారీతిలో వాహనాలను పార్కింగ్ చేస్తున్నారని, మద్యం తాగి సీపాలు, చెత్తను విసిరేసి వెళ్తున్నట్లు పంచాయతీ పేర్కొంది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!