Uttar Pradesh: వలస కూలీల సైకిళ్ల వేలం.. ప్రభుత్వానికి రూ.21 లక్షల ఆదాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2020 లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా చాలా మంది కూలీలు తమ స్వస్థలాలకు తరలివెళ్లిపోయారు. ఆ సమయంలో సరైన రవాణా సౌకర్యాలు కూడా లేవు. దీంతో వలస కూలీలు కాలి నడకన లేదా సైకిళ్ల మీద సొంతూళ్లకు వెళ్లారు. యూపీలో కొందరు వలస కూలీలు తమ సైకిళ్లను సహరణ్ పూర్లో వదిలి వెళ్లారు. ఎందుకంటే సహరణ్ పూర్ జిల్లా కేంద్రం అనేక రాష్ట్రాలకు మెయిన్ సెంటర్గా ఉంటుంది. దీంతో ఆ ప్రాంతంలో కూలీలు భారీ ఎత్తున సైకిళ్లు వదిలివెళ్లారు. ఇన్నాళ్లు ఆయా సైకిళ్లు ఎండకు ఎండి.. వానకు తడిచి పాడవుతున్నాయి. దీంతో ప్రభుత్వం స్పందించింది.
Corona: ‘కార్బెవాక్స్’ బూస్టర్ డోస్ కు అనుమతి
Also Read
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం లాక్డౌన్ విధించిన సమయంలో కూలీలు వదిలి వెళ్ళిన సైకిళ్లను యూపీ ప్రభుత్వం తాజాగా వేలం వేసింది. మొత్తం 5,400 సైకిళ్లను వేలం వేయగా రూ.21 లక్షల ఆదాయం వచ్చింది. సహరణ్ పూర్ జిల్లా కేంద్రం అనేక రాష్ట్రాలకు వెళ్లేందుకు మెయిన్ సెంటర్గా ఉంది. ఇక్కడి నుంచి హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లొచ్చు. సైకిళ్ల ద్వారా సహరణ్పూర్ చేరుకున్న కూలీలను అధికారులు బస్సులు, ఇతర రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసి సొంతూళ్లకు తరలించారు. సైకిళ్లు విడిచి వెళ్లే వాళ్లకు టోకెన్లు కూడా ఇచ్చారు. దాదాపు 14,600 మంది తమ సైకిళ్లను అక్కడే వదిలేసి వెళ్లారు. కొంత కాలం తర్వాత చాలా మంది తిరిగొచ్చి టోకెన్లు చూపించి తమ సైకిళ్లు తీసుకెళ్లారు. రెండేళ్లు గడుస్తున్నా ఇంకొందరు సైకిళ్లను తీసుకెళ్లలేదు. దీంతో సుమారు 5,400 సైకిళ్లు అలాగే ఉండిపోయాయి. తాజాగా ఈ సైకిళ్లను యూపీ ప్రభుత్వం వేలం వేసింది.
తాజావార్తలు
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!