Haryana: కన్వరియాలు ఘాతుకం.. కక్షతో జవాన్ కాల్చివేత.. 4రోజుల క్రితమే భార్య ప్రసవం
- హర్యానాలో దారుణం
- జవాన్ను కాల్చి చంపిన దుండుగులు
- 4రోజుల క్రితమే భార్య ప్రసవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలో దారుణం జరిగింది. ఓ సీఆర్పీఎఫ్ జవాన్ను అత్యంత దారుణంగా దుండగులు కాల్చి చంపేశారు. సోనేపట్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Trump: లండన్ మేయర్ దుష్టుడు.. బ్రిటన్ ప్రధాని పక్కన ఉండగానే ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
- Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
- Trinamool Congress: ‘‘ముస్లింల కోసమే పనిచేసింది’’.. టీఎంసీ పార్టీ చీఫ్ రాజీనామా..
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్ కృష్ణ కుమార్(30)కు ఇటీవల కన్వారియాలతో మత సంబంధమైన ఘర్షణ జరిగింది. అయితే దీన్ని మనసులో పెట్టుకున్న ముగ్గురు దుండగులు జవాన్ ఇంటికి వచ్చారు. బయటకు పిలిచి అతి సమీపంలోంచి కాల్చివేసేశారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Karnataka: ఓ అక్క మరణశాసనం.. వ్యాధి బయటకు తెలియకూడదని తమ్ముడు హత్య
కృష్ణ కుమార్ ఇటీవలే ఛత్తీస్గఢ్ నుంచి తన స్వస్థలానికి తిరిగి వచ్చాడు. జూలై 25న ఖాన్పూర్ కలాన్లోని భగత్ ఫూల్ సింగ్ మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్లో భార్య కుమారుడికి జన్మనిచ్చింది. భార్యను, బిడ్డను చూసేందుకు హర్యానా వచ్చాడు. అయితే ఆదివారం-సోమవారం అర్ధరాత్రి సమయంలో దమ్కాన్ గ్రామంలోని కృష్ణకుమార్ ఇంటికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. బయటకు రావాలని పిలిచారు. వెంటనే అతనిపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించినట్లు సోనెపట్ పోలీసు ప్రతినిధి రవీందర్ సింగ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Nimisha Priya: కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దులో ట్విస్ట్..
ఇటీవల కన్వారియాలతో జరిగిన ఘర్షణ కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులంతా సొంత గ్రామస్థులేనని.. అంతేకాకుండా వారంతా కన్వారియాలేనని పోలీసులు పేర్కొన్నారు. నిందితులు నిషాంత్, ఆనంద్, అజయ్లుగా గుర్తించారు. హరిద్వార్ తీర్థయాత్ర చేస్తున్న సమయంలో జవాన్ కృష్ణకుమార్కు నిందితుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకుని నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా వెల్లడించారు. హత్య కేసు కింద కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..