Haryana: కన్వరియాలు ఘాతుకం.. కక్షతో జవాన్ కాల్చివేత.. 4రోజుల క్రితమే భార్య ప్రసవం
- హర్యానాలో దారుణం
- జవాన్ను కాల్చి చంపిన దుండుగులు
- 4రోజుల క్రితమే భార్య ప్రసవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలో దారుణం జరిగింది. ఓ సీఆర్పీఎఫ్ జవాన్ను అత్యంత దారుణంగా దుండగులు కాల్చి చంపేశారు. సోనేపట్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Trump: లండన్ మేయర్ దుష్టుడు.. బ్రిటన్ ప్రధాని పక్కన ఉండగానే ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు
Also Read
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
- Tamil Nadu: గోవధ నిషేధంపై విజయ్ సర్కార్కు సుప్రీంకోర్టులో ఊరట
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) జవాన్ కృష్ణ కుమార్(30)కు ఇటీవల కన్వారియాలతో మత సంబంధమైన ఘర్షణ జరిగింది. అయితే దీన్ని మనసులో పెట్టుకున్న ముగ్గురు దుండగులు జవాన్ ఇంటికి వచ్చారు. బయటకు పిలిచి అతి సమీపంలోంచి కాల్చివేసేశారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Karnataka: ఓ అక్క మరణశాసనం.. వ్యాధి బయటకు తెలియకూడదని తమ్ముడు హత్య
కృష్ణ కుమార్ ఇటీవలే ఛత్తీస్గఢ్ నుంచి తన స్వస్థలానికి తిరిగి వచ్చాడు. జూలై 25న ఖాన్పూర్ కలాన్లోని భగత్ ఫూల్ సింగ్ మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్లో భార్య కుమారుడికి జన్మనిచ్చింది. భార్యను, బిడ్డను చూసేందుకు హర్యానా వచ్చాడు. అయితే ఆదివారం-సోమవారం అర్ధరాత్రి సమయంలో దమ్కాన్ గ్రామంలోని కృష్ణకుమార్ ఇంటికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. బయటకు రావాలని పిలిచారు. వెంటనే అతనిపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించినట్లు సోనెపట్ పోలీసు ప్రతినిధి రవీందర్ సింగ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Nimisha Priya: కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దులో ట్విస్ట్..
ఇటీవల కన్వారియాలతో జరిగిన ఘర్షణ కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులంతా సొంత గ్రామస్థులేనని.. అంతేకాకుండా వారంతా కన్వారియాలేనని పోలీసులు పేర్కొన్నారు. నిందితులు నిషాంత్, ఆనంద్, అజయ్లుగా గుర్తించారు. హరిద్వార్ తీర్థయాత్ర చేస్తున్న సమయంలో జవాన్ కృష్ణకుమార్కు నిందితుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకుని నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా వెల్లడించారు. హత్య కేసు కింద కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Yemen Airport Attack: యెమెన్లో ల్యాండ్ అవుతుండగా క్షిపణుల వర్షం.. ఇరాన్ ప్రయాణికుల ప్రాణాలు గాల్లో!
-
RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
-
Jani Master: చిరంజీవి సమక్షంలో కలిసిన జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్.. పెద్దరికం అంటే ఇదే!
-
Suryakumar Yadav: టీ20 జట్టులోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బీసీసీఐ కీలక సంకేతాలు
-
UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!