Karnataka: ఓ అక్క మరణశాసనం.. వ్యాధి బయటకు తెలియకూడదని తమ్ముడు హత్య
- కర్ణాటకలో దారుణం
- ఓ అక్క మరణశాసనం
- వ్యాధి బయటకు తెలియకూడదని తమ్ముడు హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ అక్క.. రక్తం పంచుకుని పుట్టిన సోదరుడికి మరణశాసనం రాసింది. వ్యాధి బయటకు తెలిస్తే కుటుంబ పరువు పోతుందని సోదరుడిని కాటికి పంపించింది సోదరి. చిత్రదుర్గ జిల్లా హోళల్కెరె తాలూకాలో ఈ ఘోరం జరిగింది.
ఇది కూడా చదవండి: Honor killing: మరో పరువు హత్య.. ఎస్ఐ కూతురుతో ప్రేమ.. చంపేయాలని కొడుకుతో చెప్పిన తల్లిదండ్రులు
Also Read
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
హోళల్కెరె తాలూకాలోని ఒక గ్రామానికి చెందిన యువకుడు(23) ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. యువకుడి సోదరి, బావ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించారు. టెస్టుల్లో హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లుగా తేలింది. విషయం తెలియగానే సోదరి అవమానంగా భావించింది. విషయం గ్రామంలో తెలిస్తే కుటుంబ పరువు పోతుందని భయాందోళన చెందింది.
ఇది కూడా చదవండి: Nimisha Priya: కేరళ నర్సు నిమిషా ప్రియకు యెమెన్లో ఉరిశిక్ష రద్దు!.. గ్రాండ్ ముఫ్తీ కార్యాలయం ధృవీకరణ
అంతే జూలై 25న సోదరుడికి ఎయిడ్స్ ఉందని తెలియగానే.. భర్త సాయంతో బురఖాను ఉపయోగించి గొంతుకోసి చంపేసింది. సోదరుడికి బెంగళూరులో వైద్యం చేయించే నెపంతో ఆస్పత్రి నుంచి బయటకు తీసుకెళ్లి హతమార్చింది. ఇక మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకొచ్చినప్పుడు.. ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో చనిపోయాడని గ్రామస్తుల్ని నమ్మించింది. కానీ గ్రామస్తుల్లో కొందరు మెడ భాగంలో గాయాలు ఉన్నట్లు గమనించిడంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకోగా.. నేరాన్ని అంగీకరించింది. సోదరుడి రోగం సమాజానికి తెలిస్తే.. కుటుంబ పరువు పోతుందని తన భర్తతో కలిసి చంపేసినట్లుగా ఒప్పుకుంది. దీంతో ఆమెను అరెస్ట్ చేయగా… భర్త పరారీలో ఉన్నాడు.
కుటుంబ పరువు కోసమే సోదరుడిని అక్క చంపేసిందని పోలీసులు తెలిపారు. మహిళను అరెస్టు చేశామని, ఆమె భర్తను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అతను ఇంకా పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. సోదరుడికి హెచ్ఐవి పాజిటివ్ అని తెలిస్తే కుటుంబం సిగ్గుపడుతుందని, అలాగే బంధువులు, గ్రామస్తులు బహిష్కరిస్తారేమోనని భయపడిందని పోలీసులు తెలిపారు. బీపీ, షుగర్ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తల్లిదండ్రులకు కూడా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందని ఆమె ఆందోళన చెందినట్లుగా వెల్లడించారు. అయితే సోదరుడు అప్పుల్లో ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ముందు అబద్ధం చెప్పిందని పోలీసులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!