Karnataka: ఓ అక్క మరణశాసనం.. వ్యాధి బయటకు తెలియకూడదని తమ్ముడు హత్య
- కర్ణాటకలో దారుణం
- ఓ అక్క మరణశాసనం
- వ్యాధి బయటకు తెలియకూడదని తమ్ముడు హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ అక్క.. రక్తం పంచుకుని పుట్టిన సోదరుడికి మరణశాసనం రాసింది. వ్యాధి బయటకు తెలిస్తే కుటుంబ పరువు పోతుందని సోదరుడిని కాటికి పంపించింది సోదరి. చిత్రదుర్గ జిల్లా హోళల్కెరె తాలూకాలో ఈ ఘోరం జరిగింది.
ఇది కూడా చదవండి: Honor killing: మరో పరువు హత్య.. ఎస్ఐ కూతురుతో ప్రేమ.. చంపేయాలని కొడుకుతో చెప్పిన తల్లిదండ్రులు
Also Read
- USA: భారత్ ఒక ‘‘సూపర్ పవర్’’: అమెరికా రక్షణ మంత్రి..
- IMD Warning: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో వర్షాలు
- CM Yogi Adityanath: దేశానికి "ధర్మ హింస" అవసరమే.. యోగి సంచలన వ్యాఖ్యలు
- NFHS: దేశంలో పెరుగుతున్న సీ-సెక్షన్ కేసులు.. ఈ రాష్ట్రంలో 90% ప్రసవాలు సిజేరియన్ ద్వారానే.. NFHS సంచలన రిపోర్ట్
హోళల్కెరె తాలూకాలోని ఒక గ్రామానికి చెందిన యువకుడు(23) ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. యువకుడి సోదరి, బావ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించారు. టెస్టుల్లో హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లుగా తేలింది. విషయం తెలియగానే సోదరి అవమానంగా భావించింది. విషయం గ్రామంలో తెలిస్తే కుటుంబ పరువు పోతుందని భయాందోళన చెందింది.
ఇది కూడా చదవండి: Nimisha Priya: కేరళ నర్సు నిమిషా ప్రియకు యెమెన్లో ఉరిశిక్ష రద్దు!.. గ్రాండ్ ముఫ్తీ కార్యాలయం ధృవీకరణ
అంతే జూలై 25న సోదరుడికి ఎయిడ్స్ ఉందని తెలియగానే.. భర్త సాయంతో బురఖాను ఉపయోగించి గొంతుకోసి చంపేసింది. సోదరుడికి బెంగళూరులో వైద్యం చేయించే నెపంతో ఆస్పత్రి నుంచి బయటకు తీసుకెళ్లి హతమార్చింది. ఇక మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకొచ్చినప్పుడు.. ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో చనిపోయాడని గ్రామస్తుల్ని నమ్మించింది. కానీ గ్రామస్తుల్లో కొందరు మెడ భాగంలో గాయాలు ఉన్నట్లు గమనించిడంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకోగా.. నేరాన్ని అంగీకరించింది. సోదరుడి రోగం సమాజానికి తెలిస్తే.. కుటుంబ పరువు పోతుందని తన భర్తతో కలిసి చంపేసినట్లుగా ఒప్పుకుంది. దీంతో ఆమెను అరెస్ట్ చేయగా… భర్త పరారీలో ఉన్నాడు.
కుటుంబ పరువు కోసమే సోదరుడిని అక్క చంపేసిందని పోలీసులు తెలిపారు. మహిళను అరెస్టు చేశామని, ఆమె భర్తను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అతను ఇంకా పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. సోదరుడికి హెచ్ఐవి పాజిటివ్ అని తెలిస్తే కుటుంబం సిగ్గుపడుతుందని, అలాగే బంధువులు, గ్రామస్తులు బహిష్కరిస్తారేమోనని భయపడిందని పోలీసులు తెలిపారు. బీపీ, షుగర్ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తల్లిదండ్రులకు కూడా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందని ఆమె ఆందోళన చెందినట్లుగా వెల్లడించారు. అయితే సోదరుడు అప్పుల్లో ఉండడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ముందు అబద్ధం చెప్పిందని పోలీసులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
USA: భారత్ ఒక ‘‘సూపర్ పవర్’’: అమెరికా రక్షణ మంత్రి..
-
Vivo Over Ear Headphones: వివో తొలి వైర్లెస్ ఓవర్-ఇయర్ హెడ్ఫోన్స్ విడుదల.. 75 గంటల బ్యాటరీ, 58dB ANC ఫీచర్
-
America : భారతీయుల నెత్తిన మరో భారీ పిడుగు.. ఆందోళనలో లక్షలాది మంది పౌరులు
-
Bobby Deol: వైభవ్ బ్యాటింగ్కు ‘యానిమల్’ విలన్ ఫిదా.. ‘దేవుడా ఆ బుడ్డోడికి దిష్టి తగలకుండా చూడు’!
-
IMD Warning: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో వర్షాలు
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..