Nimisha Priya: కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దులో ట్విస్ట్..
- కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దులో ట్విస్ట్
- ఉరిశిక్షను రద్దు చేశారంటూ వస్తోన్న వార్తలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ కొన్ని గంటల క్రితం కేరళ నర్సు నిమిషా ప్రియకు యెమెన్ లో ఉరిశిక్ష రద్దు అంటూ వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. భారతీయ నర్సు నిమిషా ప్రియకు విధించిన మరణశిక్షను పూర్తిగా రద్దు చేసినట్లు గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ ఇండియా కాంతపురం ఎపి అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, యెమెన్ ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక లిఖిత పూర్వక ధృవీకరణ రాలేదని కూడా ప్రకటనలో స్పష్టం చేశారు. తాజాగా ఈ కేసులో ట్విస్ట్ చేసుకుంది. ఆమె ఉరిశిక్షను రద్దు చేశారంటూ వస్తోన్న వార్తలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. ఉరిశిక్ష రద్దు అంటూ వస్తున్న వార్తలు అవాస్తవేమనని, ఉరిశిక్ష రద్దు కాలేదని విదేశాంగ శాఖ వర్గాలు మంగళవారం వెల్లడించాయి.
Also Read:Physical Harassment: 9వ క్లాస్ విద్యార్థినిపై ప్రిన్సిపాల్ లైంగిక దాడి.. గర్భవతి కావడంతో..!
Also Read
- TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం..
- TVK: కర్ణాటకలో కుదిరినప్పుడు.. తమిళనాడులో ఎందుకు కుదరదు.. గవర్నర్పై ఆగ్రహంతో టీవీకే కార్యకర్తలు..
- Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
- Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్లోకి కూడా చేరిన అభిషేక్.
భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్లోని సూఫీ ముఖ్య పండితుడు అయిన షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ ఒక బృందాన్ని చర్చల కోసం నియమించారు. ఆ బృందం యెమెన్ ప్రభుత్వంతో చర్చలు జరిపిందని, చర్చలు ఫలించడంతో ఉరిశిక్ష రద్దుకు అధికారులు అంగీకరించారని ముఫ్తీ కార్యాలయం పేర్కొంది. ఈ క్రమంలోనే భారత విదేశాంగ శాఖ వర్గాలు దీనిపై స్పందించాయి. నిమిష ప్రియ కేసులో కొంతమంది వ్యక్తుల నుంచి వచ్చిన సమాచారం అవాస్తవమని వెల్లడించాయి. దీనిపై తమకు యెమెన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని పేర్కొన్నాయి. దీంతో మళ్లీ ఈ కేసులో ఉత్కంఠ చోటుచేసుకుంది. నిమిషా ప్రియ కేసు 2018 నుంచి అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. నిమిషా తన వ్యాపార భాగస్వామిని హత్య చేసి, ఆపై శరీరాన్ని ముక్కలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమె మార్చి 2018లో హత్య కేసులో దోషిగా నిర్ధారించింది కోర్టు. 2020లో యెమెన్ కోర్టు మరణశిక్ష విధించింది.
తాజావార్తలు
-
TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్కు బీసీసీఐ ఆమోదం..
-
TVK Vijay: ఉత్కంఠ పెంచుతున్న తమిళనాడు రాజకీయాలు.. మెజార్టీ నిరూపణకు విజయ్కు రేపటివరకు గవర్నర్ డెడ్లైన్..
-
Thomson QLED Smart TV: ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభూతి.. క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ చౌక ధరతో విడుదల
-
Vivo X300 Ultra: వివో ఎక్స్300 అల్ట్రా భారత్ లో విడుదల.. డ్యుయల్ 200MP ZEISS కెమెరాలు, DSLR స్టైల్ ఫోటోలు
-
Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!