D Raja: 2024 ఎన్నికలు చాలా కీలకం.. పొత్తుల విషయం తేల్చేసిన సీపీఐ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా.. పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు.. 2024 ఎన్నికలు కీలకమైనవని పేర్కొన్న ఆయన.. రీజినల్, డెమోక్రటిక్ పార్టీలతో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తాం అన్నారు.. ప్రస్తుత పరిస్థితిపై లెఫ్ట్ పార్టీలు అధ్యయనం చేస్తున్నాయన్నారు.. ఇండియా సెక్యులర్ దేశంఅని.. మరోవైపు దేశ సంపదను బడా పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు.. పేదలను నిత్యావసర ధరలు పెరుగుదల, నిరుద్యోగ సమస్య వేధిస్తోందన్న ఆయన.. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఉన్న ఉద్యోగాలను పీకేసేపనిలో పడ్డారని మండిపడ్డారు.. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉంది.. కానీ, మోడీ మద్దతు ఇస్తున్న కార్పొరేట్ శక్తులు మరింత బలోపేతం అయ్యాయి.. పేదలు మరింత పేదలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: KCR Congratulates Nikhat Zareen: నిఖత్ జరీన్ కు అర్జున అవార్డు.. అభినందించిన కేసీఆర్
Also Read
- Abhishek Banerjee:అభిషేక్ దాడి వెనుక బీజేపీనా? టీఎంసీనా? బెంగాల్లో కొత్త రాజకీయ తుఫాన్
- West Bengal: దోచుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాం.. "కట్మనీ"పై టీఎంసీలో భయం..
- Brahmos: చైనాకు బిగ్ షాక్.. వియత్నాం తర్వాత ఇండోనేషియా చేతుల్లోకి బ్రహ్మోస్..
- Mamata Banerjee: బీజేపీ ప్రభుత్వం లేకపోతే, మీ సంగతి చూస్తాం.. హాస్పిటల్కు మమత వార్నింగ్..
కేంద్రం నేషనల్ విద్యా విధానాన్ని రాష్ట్రాల మీద బలవంతంగా రుద్దుతుందని ఫైర్ అయ్యారు డి. రాజా.. గవర్నర్ ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలను భయపెడుతోందని విమర్శించారు.. గవర్నర్లతో బీజేపీ తన అజెండాని అమలుపరుస్తోందని.. అసలు గవర్నర్ పోస్ట్ అవసరమా? అనే చర్చ కూడా జరుగుతోందన్నారు.. ఏదేమైనా.. రాష్ట్ర ప్రభుత్వాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవడం సరికాదని హితవుపలికారు.. రాజ్యాంగం, డెమోక్రాసి కాపాడటం కోసం సెక్యులర్ శక్తులు అన్నీ ఏకంకావాలి అని పిలుపునిచ్చారు.. జాతీయ స్థాయిలో బీజేపీ ఓటమికి కలిసి వచ్చే పార్టీలతో పని చేస్తామని.. రాష్ట్రాలలో కూడా అలాంటి శక్తులతో కలుస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంపైనే మేం రీజినల్ పార్టీలతో మాట్లాడుతున్నాం.. ఎన్నికలకు ముందే కలిసి పని చేయాలని ఆలోచనతో ఉన్నామని వెల్లడించారు.
Read Also: Yashoda: సమంత ఓకే అంటే ‘యశోద’ సీక్వెల్ – సక్సెస్మీట్లో దర్శక నిర్మాతలు
ఇక, తెలంగాణలో ఉమ్మడి కమ్యూనిస్టులు (సీపీఐ, సీపీఎం ఇతర లెఫ్ట్పార్టీలు).. టీఆర్ఎస్కు ఇటీవల అంటే మునుగోడు ఉప ఎన్నికలో మద్దతు ఇచ్చాం.. టీఆర్ఎస్, ఇతర పార్టీలతో సంబంధాలు కొనసాగుతాయని తెలిపారు డి. రాజా.. మరోవైపు కాంగ్రెస్ పాన్ ఇండియన్ సెక్యులర్ పార్టీగా అభివర్ణించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామన్నారు. అయితే, ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టాలి.. ఎలా ముందుకు వెళ్లాలి అనేది మాత్రం ఆయా రాష్ట్ర కమిటీలు నిర్ణయం తీసుకుంటాయని స్పష్టం చేశారు.. ఇదే సమయంలో.. కాంగ్రెస్ పార్టీ రియలైజ్ కావాల్సిన అవసరం ఉందన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా.
తాజావార్తలు
-
Ration Dealers: రేషన్ డీలర్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులు వీరే..
-
Iran War: F-15 కూల్చివేత వెనక చైనా హస్తం.. ఇరాన్కు డ్రాగన్ కంట్రీ సాయం..
-
Singapore Open 2026: సింగపూర్ ఓపెన్లో చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్.. టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ జోడీ
-
RCB Vs GT: “అతడిని ఆడిస్తే RCB ఓడిపోవడం ఖాయం”.. ఫైనల్కు ముందు మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..