COVID 19: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
COVID 19 Updates: దేశంలో మరోసారి కరోనా కేసులు సంఖ్య పెరిగింది. గత కొంత కాలంగా కేసులు రోజూవారీ కేసుల సంఖ్య 15 వేలకు పైబడి నమోదు అవుతున్నాయి. తాజాగా ఇండియాలో గడిచిన 24 గంటల్లో కేసులు 20 వేలను దాటాయి. మరణాల సంఖ్య కూడా భారీగానే నమోదు అవుతోంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో 20,557 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడచిన 24 గంటల్లో 44 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం దేశంలో 1,46,323 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 19,216 మంది మహమ్మారిని జయించారు.
దేశంలో కోవిడ్ మొదలైన రెండున్నర ఏళ్లలో 4,39,59,321 మందికి కరోనా సోకింది. వీరిలో ఇప్పటి వరకు 5,26,211 మంది చనిపోయారు. 4,32,86,787 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.33 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.47 శాతంగా, మరణాల శాతం 1.20గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో యాక్టివ్ కేస్ లోడ్ 1,297 కేసులకు పెరిగింది. డైలీ పాజిటివిటీ రేటు 5.18 శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 4.71గా ఉంది.
Also Read
- UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్సభలో కీలక బిల్లు ఆమోదం
- Karnataka: ఘోరం.. వాలీబాల్ ఆడుతుండగా గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి
- Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
- PM Modi: ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖర్చులపై కేంద్రం కీలక ప్రకటన..
Read Also: Mamata Banerjee: మంత్రి పార్థ ఛటర్జీ కేసు.. మీడియాపై దీదీ ఆగ్రహం
కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనే ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా 24 గంటల్లో చోటు చేసుకున్న మరణాల్లో కూడా ఈ రాష్ట్రాల నుంచే ఎక్కవ మంది చనిపోయారు. కేరళలో 12 మంది, మహారాష్ట్రలో 8 మంది, బెంగాల్లో 5 మంది, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, త్రిపుర, అస్సాం, చండీగఢ్, చత్తీస్ గఢ్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో ఒక్కొక్కరు కరోనా బారిన పడి మరణించారు.
తాజావార్తలు
-
2027 World Cup: వన్డే వరల్డ్ కప్కు కౌంట్ డౌన్ స్టార్ట్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. ఈ తేదీల్లోనే..
-
Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
-
UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్సభలో కీలక బిల్లు ఆమోదం
-
The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
-
Perni Nani: జగన్ దెబ్బకు సీఆర్డీఏలో ‘అవిగన్’ తీర్మానం.. కేబినెట్లో పెట్టనున్నారు..!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!